Political News

జ‌గ‌న్ పిలిచి ప‌ద‌వులిస్తే.. ప‌ట్టించుకోకుండా ఉంటున్నారే!

త‌మ రాష్ట్రం కాదు త‌మ పార్టీ కూడా కాదు.. కానీ త‌న అవ‌స‌రాల కోసం జ‌గ‌న్ పిలిచి మ‌రీ వాళ్ల‌కు ప‌ద‌వులు క‌ట్ట‌బెట్టారు. తీరా ఇప్పుడు ఏపీ ఎన్నిక‌ల స‌మ‌యంలో వాళ్లు క‌నీసం జ‌గ‌న్ ముఖం కూడా చూడ‌టం లేదు. ప్ర‌చారం సంగ‌తి ప‌క్క‌న పెడితే క‌నీసం జ‌గ‌న్ను కూడా వాళ్లు ప‌ట్టించుకోవ‌డం లేద‌నే టాక్ ఉంది. జ‌గ‌న్ ఏరికోరి ప‌ద‌వులు ఇచ్చిన వైసీపీ రాజ్య‌స‌భ స‌భ్యులు ఇప్పుడు ప‌త్తాలేకుండా పోయార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా బ‌య‌టి వాళ్లు అస‌లు క‌నిపించ‌డం లేద‌నే చెప్పాలి.

తెలంగాణ‌కు చెందిన బీసీ నాయ‌కుడు ఆర్‌.కృష్ణ‌య్య‌ను పిలిచి మ‌రీ జ‌గ‌న్ రాజ్య‌స‌భ‌కు పంపారు. ఏపీలో బీసీ నేత‌లే లేన‌ట్లు జాతీయ స్థాయిలో గుర్తింపు ఉంద‌నే ఉద్దేశంతో కృష్ణ‌య్య‌కు జై కొట్టారు. కానీ ఇప్పుడు కృష్ణ‌య్య ఎక్క‌డా అని వైసీపీ నేత‌లే ప్ర‌శ్నిస్తున్నారు. ఆయ‌న ప్ర‌స్తుతం తెలంగాణ‌లో కాంగ్రెస్‌కు స‌పోర్ట్ చేస్తున్నారు. అయినా జ‌గ‌న్ సైలెంట్‌గానే ఉంటున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లోనూ కృష్ణ‌య్య కాంగ్రెస్ ప‌క్షాన నిలిచారు. అయినా జ‌గ‌న్ మౌన‌మే దాల్చారు. కానీ ఇప్పుడు ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల వేళ అయినా జ‌గ‌న్‌కు కృష్ణ‌య్య అండ‌గా ఉంటార‌ని వైసీపీ నాయ‌కులు అనుకుంటే నిరాశే ఎదుర‌వుతోంది.

మ‌రోవైపు రిల‌య‌న్స్‌కు చెందిన ఓ పెద్ద మ‌నిషి ప‌రిమ‌ళ్ న‌త్వానీ, సుప్రీం కోర్టు లాయ‌ర్ నిరంజ‌న్ రెడ్డికి జ‌గ‌న్ రాజ్య‌స‌భ ప‌ద‌వులు ఇచ్చారు. కానీ వీళ్లు కూడా ఇప్పుడు జ‌గ‌న్‌కు దూరంగానే ఉంటున్నారు. ప్ర‌త్య‌క్షంగా ప్ర‌చారంలో పాల్గొన‌క‌పోయినా సోష‌ల్ మీడియాలోనైనా జ‌గ‌న్‌కు ఓటు వేయాల‌ని కూడా అడ‌గ‌డం లేదు. పైగా ప‌రిమ‌ళ్ వ‌స్తే వైఎస్‌ను హ‌త్య చేయించింది రిల‌య‌న్సే అని గ‌తంలో జ‌గ‌న్ దొండ ఏడుపులు ఎక్క‌డ బ‌య‌ట‌కు వ‌స్తాయోన‌ని వైసీపీ నాయ‌కులే మాట్లాడుకుంటున్నారు. ఇన తెలంగాణ‌కు చెందిన నిరంజ‌న్ రెడ్డికి జ‌గ‌న్ కేసుల్లో వాద‌న‌ల‌కే స‌మ‌యం స‌రిపోవ‌డం లేదంటా. ఇక ప్ర‌చారం ఎప్పుడు చేస్తారు? మొత్తానికి జ‌గ‌న్ ఓట‌మి పాల‌వుతార‌ని వీళ్ల‌కు ఓ అంచ‌నా ఉండ‌టంతోనే ప్ర‌చారానికి రావ‌డం లేద‌ని తెలిసింది.

This post was last modified on May 10, 2024 7:38 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

5 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

5 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

5 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

6 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

8 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

9 hours ago