2014లో తెలుగుదేశంకు మద్దతుగా ప్రచారం చేసి ఆ పార్టీ విజయంలో తన వంతు పాత్ర పోషించాడు జనసేనాని పవన్ కళ్యాణ్. కానీ ఆ తర్వాత టీడీపీతో విభేదించి.. ఆ పార్టీ మీద విమర్శలు చేయడం మొదలుపెట్టారు. 2019 ఎన్నికల్లో ఆ పార్టీకి వ్యతిరేకంగా పోటీ చేశారు. ఐతే ఫలితాలు ప్రతికూలంగా వచ్చాయి. ఇప్పుడు మళ్లీ టీడీపీతో కలిసి పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలో నిలిచారు.
పవన్ టీడీపీతో విభేదించిన సమయంలో ఆ పార్టీ నేతలు కొందరు ఆయనపై తీవ్ర విమర్శలే చేశారు. పవన్ కూడా అంతే ఘాటుగా స్పందించారు. పవన్ వ్యతిరేకించిన నాయకుల్లో దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఒకరు. ప్రభాకర్ను పవన్ విమర్శిస్తే.. ప్రభాకర్ సైతం జనసేనానిని గట్టిగా టార్గెట్ చేశారు.
ఈ నేపథ్యంలో ఇప్పుడు పవన్ దెందులూరు వెళ్లి చింతమనేనికి మద్దతుగా ప్రచారం చేయడం ఆసక్తి రేకెత్తించింది. గతంలో తమ మధ్య నెలకొన్న గొడవను కూడా ప్రస్తావిస్తూ.. ప్రేమున్న చోటే గొడవ ఉంటుందని, తమది అందమైన గొడవ అని జనసేనాని వ్యాఖ్యానించడం విశేషం. ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. “నాకు బాగా ఇష్టమైన నాయకుడు. గొడవ పెట్టుకునే నాయకుడీయన. ఎవరు స్నేహితులవుతారు. గొడవ పెట్టుకునేవాళ్లే స్నేహితులవుతారు. పవన్ కళ్యాణ్ పోటీ చేస్తానంటే దెందులూరు నుంచి నేను గెలిపిస్తాను అన్న చింతమనేని గారికి మనస్ఫూర్తిగా నమస్కారాలు. ఆయనతో గొడవ పెట్టుకోవడం కూడా అందంగానే ఉంటుంది నాకు. ప్రేమున్న చోటే గొడవుంటుంది. ఏమంటారు ప్రభాకర్ గారు? మా ఇద్దరికీ ఆ సామరస్యం కుదిరింది. గొడవతో మొదలైన మైత్రి చాలా బలంగా ఉంటుందని అంటారు. చింతమనేని గారికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెబుతూ ఆయన్ని గెలిపించాలని కోరుకుంటున్నా” అని పవన్ అనడంతో దెందులూరు జనాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి.
This post was last modified on May 9, 2024 3:04 pm
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…