Political News

చింతమనేనితో గొడవ గురించి పవన్..

2014లో తెలుగుదేశంకు మద్దతుగా ప్రచారం చేసి ఆ పార్టీ విజయంలో తన వంతు పాత్ర పోషించాడు జనసేనాని పవన్ కళ్యాణ్. కానీ ఆ తర్వాత టీడీపీతో విభేదించి.. ఆ పార్టీ మీద విమర్శలు చేయడం మొదలుపెట్టారు. 2019 ఎన్నికల్లో ఆ పార్టీకి వ్యతిరేకంగా పోటీ చేశారు. ఐతే ఫలితాలు ప్రతికూలంగా వచ్చాయి. ఇప్పుడు మళ్లీ టీడీపీతో కలిసి పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలో నిలిచారు.

పవన్ టీడీపీతో విభేదించిన సమయంలో ఆ పార్టీ నేతలు కొందరు ఆయనపై తీవ్ర విమర్శలే చేశారు. పవన్ కూడా అంతే ఘాటుగా స్పందించారు. పవన్ వ్యతిరేకించిన నాయకుల్లో దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఒకరు. ప్రభాకర్‌ను పవన్ విమర్శిస్తే.. ప్రభాకర్ సైతం జనసేనానిని గట్టిగా టార్గెట్ చేశారు.

ఈ నేపథ్యంలో ఇప్పుడు పవన్ దెందులూరు వెళ్లి చింతమనేనికి మద్దతుగా ప్రచారం చేయడం ఆసక్తి రేకెత్తించింది. గతంలో తమ మధ్య నెలకొన్న గొడవను కూడా ప్రస్తావిస్తూ.. ప్రేమున్న చోటే గొడవ ఉంటుందని, తమది అందమైన గొడవ అని జనసేనాని వ్యాఖ్యానించడం విశేషం. ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. “నాకు బాగా ఇష్టమైన నాయకుడు. గొడవ పెట్టుకునే నాయకుడీయన. ఎవరు స్నేహితులవుతారు. గొడవ పెట్టుకునేవాళ్లే స్నేహితులవుతారు. పవన్ కళ్యాణ్ పోటీ చేస్తానంటే దెందులూరు నుంచి నేను గెలిపిస్తాను అన్న చింతమనేని గారికి మనస్ఫూర్తిగా నమస్కారాలు. ఆయనతో గొడవ పెట్టుకోవడం కూడా అందంగానే ఉంటుంది నాకు. ప్రేమున్న చోటే గొడవుంటుంది. ఏమంటారు ప్రభాకర్ గారు? మా ఇద్దరికీ ఆ సామరస్యం కుదిరింది. గొడవతో మొదలైన మైత్రి చాలా బలంగా ఉంటుందని అంటారు. చింతమనేని గారికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెబుతూ ఆయన్ని గెలిపించాలని కోరుకుంటున్నా” అని పవన్ అనడంతో దెందులూరు జనాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి.

This post was last modified on May 9, 2024 3:04 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

సంక్రాంతి ఎఫెక్ట్: హైదరాబాద్ నిల్లు… విజయవాడ ఫుల్లు

సంక్రాంతి పండుగ హడావుడి మొదలవడంతో హైదరాబాద్ నగరం ఒక్కసారిగా ఖాళీ అవుతోంది. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో విజయవాడ జాతీయ రహదారి…

24 minutes ago

దెబ్బతిన్న హీరోలు vs రావిపూడి

టాలీవుడ్‌లో సక్సెస్ ఫార్ములా తెలిసిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి ఆయన ఎంచుకుంటున్న పంథా చాలా…

43 minutes ago

తెలంగాణ జనసేన టార్గెట్ ఫిక్స్… పొత్తు ఉంటుందా పవన్ సార్?

తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్‌చార్జ్‌ శంకర్‌గౌడ్‌…

1 hour ago

లెజెండరీ ప్లేయర్లను దాటేసిన హిట్ మ్యాన్

వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…

2 hours ago

తొమ్మిదేళ్ల విక్రమ్ సినిమాకు మోక్షం ?

క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…

2 hours ago

‘అప్పుడు మహ్మద్ గజిని… ఇప్పుడు వైఎస్ జగన్’

అప్పుడు మహ్మద్‌ గజని… ఇప్పుడు వైఎస్‌ జగన్‌ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…

3 hours ago