బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏదో అనుకుంటే ఇంకేదో అయింది. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలనే కలలు గన్న ఆయనకు తెలంగాణలోనే అధికారం లేకుండా పోయింది. అన్నీ తానే అనుకుని, పార్టీకి ఎలాంటి వ్యూహకర్తల అవసరం లేదని బీరాలు పలికిన కేసీఆర్కు షాక్ తగిలింది. ఇప్పుడు అర్జెంట్గా ఆ పార్టీకి ఓ వ్యూహకర్త అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇప్పుడు ప్రతి పార్టీకి ఓ వ్యూహకర్త ఉంటున్నారు. ఎన్నికల ప్రచారంలో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలు, అమలు చేయాల్సిన ప్రణాళికలను ఆ వ్యూహకర్తలు సిద్ధం చేస్తున్నారు. సునీల్ కనుగోలు వ్యూహాలతో కాంగ్రెస్ దూసుకెళ్తోంది. లోక్సభ ఎన్నికల ప్రచారంలో దూకుడు ప్రదర్శిస్తోంది. తాజాగా తెలంగాణకు బీజేపీ ఇచ్చింది గాడిద గుడ్డే అని రేవంత్ రెడ్డి ఆ నమూనాను ప్రదర్శించడం వైరల్గా మారింది. దీంతో కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం సాగుతోంది.
దీంతో లోకసభ ఎన్నికల తెలంగాణ పోరులో ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీ మధ్యనే పోటీ ఉందనేలా పరిస్థితి మారింది. బీఆర్ఎస్కు ఒకట్రెండు సీట్లు దక్కినా ఎక్కువే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయినా కేసీఆర్ కానీ ఆ పార్టీ నేతలు కానీ పంథా మార్చడం లేదు. అదే పాత చింతకాయ పచ్చడి తరహా ప్రచారం, స్పీచ్లతో సాగుతున్నారు. దీంతో పెద్దగా ప్రయోజనం ఉండటం లేదు. గతంలో ప్రశాంత్ కిషోర్ను వ్యూహకర్తంగా ఎంచుకున్న తర్వాత కేసీఆర్ వద్దనుకున్నారు. అంతా తానే చూసుకుంటా అనుకున్నారు. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో బొక్కబోర్లా పడ్డారు. ఇప్పుడు లోక్సభ ఎన్నికల ముందు కూడా కేసీఆర్ అదే వైఖరితో సాగుతున్నారు. ఇలాగే ఉంటే బీఆర్ఎస్ ఉనికే ప్రమాదంలో పడే ఆస్కారముంది. అందుకే ఎలాంటి బేషజాలకు వెళ్లకుండా పార్టీ భవిష్యత్ కోసం అర్జెంట్గా ఓ వ్యూహకర్తను ఎంపిక చేసుకోవాలని బీఆర్ఎస్ వర్గాలే అంటున్నాయి.
This post was last modified on May 4, 2024 2:59 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…