పార్టీని ఇప్పుడున్న పరిస్థితిలో బలోపేతం చేయాలి.. ఈ క్రమంలో మార్పులు సహజం..- ఇదీటీడీపీ అధినేత చంద్రబాబు పఠిస్తున్న రాజకీయ మంత్రం! మంచిదే. అయితే, ఈ మార్పుల నేపథ్యంలో అసలుకే ఆయన ఎసరు పెట్టుకుంటున్నారనే వాదన తెరమీదికి వస్తోందని అంటున్నారు సొంత పార్టీ నాయకులు.
తాజాగా ఏలూరు పార్లమెంటు వ్యవహారం పార్టీలో తీవ్ర చర్చకు దారితీస్తోంది. ఇక్కడ పార్టీ ఇంచార్జ్గా ఉన్న మాగంటి వెంకటేశ్వరరావు.. ఉరఫ్ బాబును మార్చేయాలనేది బాబు నిర్ణయంగా ఉందని ప్రచారం సాగుతోంది. గత ఏడాది ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు.
పైగా పార్టీలోనూ యాక్టివ్గా లేరు. అనారోగ్య కారణాలు కూడా పట్టిపీడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మార్పు అవసరమే. కానీ, ఈ విషయంలో ఆయనతో మాటైనా చెప్పాల్సిన బాధ్యత.. అవసరం చంద్రబాబుకు లేవా? అంటు ఖచ్చితంగా ఉన్నాయి. ఎందుకంటే.. పార్టీలో కీలకమైన కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేత కావడం.. పార్టీకి అంతో ఇంతో నిధులు సర్దుబాటు చేసిన సీనియర్ నేత కావడం. పైగా .. బలమైన కోటరీ ఉన్న నాయకుడు.. కూడా కావడం వంటి కారణాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే కమ్మ సామాజిక వర్గం చంద్రబాబు వల్ల తాము బజారునపడ్డామనే భావనతో రగిలిపోతోంది. ఈ క్రమంలో ఇప్పుడు చంద్రబాబు వేసే అడుగు కీలకం కానుంది.
కానీ, చంద్రబాబు మాత్రం మాగంటిని ఇక్కడ తప్పించి.. మరో వ్యక్తి(ఇంకా నిర్ణయించలేదు. చర్చల్లో ఉంది)ని నియమించాలని.. భావిస్తున్నారు. పోనీ.. ఇదే విషయాన్ని మాగంటితో అయినా చర్చించారా? అంటే లేదు. నిజానికి మాగంటి తల్లీ దండ్రులు కూడా రాజకీయాల్లో చక్రం తిప్పిన చరిత్ర ఉంది. వారు కాంగ్రెస్లోను.. మాగంటిబాబు.. టీడీపీలో అనూహ్యమైన రాజకీయాలు చేశారు. ఇప్పుడు ఒక్కసారిగా ఈ కుటుంబానికి రాజకీయ ప్రాధాన్యం లేకుండా చేస్తానంటే.. బాబుకు వ్యతిరేకత మరింత పెరిగిపోదా?
పైగా మాగంటి బాబు కుమారుడు రాంజీ ప్రస్తుతం పశ్చిమ గోదావరిజిల్లా తెలుగు యువత అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయననైనా ఇక్కడ నియమించే అవకాశంఉంది. కానీ, ఇవేవీ పట్టించుకోకుండా.. బాబు వ్యవహరిస్తే.. రేపు ఏలూరు కూడా టీడీపీ ఖాతా నుంచి పోవడం ఖాయమని తమ్ముళ్లే పెదవి విరుస్తున్నారు. గత ఏడాది ఎన్నికల్లోనూ ఇలా చేసుకునే చంద్రబాబు తాను చెడి.. అందరినీ చెడగొట్టారని పేర్కొంటున్నారు. మరి బాబు నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి.
This post was last modified on September 16, 2020 5:06 pm
కరుప్పు / వీరభద్రుడు, విశ్వనాథ్ అండ్ సన్స్ విజయాలతో సూర్య మంచి ఊపు మీద ఉన్నాడు. గత కొన్నేళ్లుగా సరైన…
ఫ్యాన్ బేసులకు అతీతంగా అందరు హీరోల అభిమానులు అధిక శాతం ఇష్టపడే హీరో రవితేజ. ఆరు పదుల వయసుకు దగ్గరగా…
స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యకర్తలు, నాయకులకు కీలక…
తిరుమల అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతోపాటు, భక్తుల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు టీటీడీ ఆధునిక సాంకేతిక…
ఇప్పుడు పెద్ద హీరోల నుంచి ఏడాదికో సినిమా వస్తే ఆశ్చర్యపోయే పరిస్థితి ఉంది. ఒక్క ప్రభాస్ను పక్కన పెడితే.. అల్లు…
ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న స్పిరిట్ షూటింగ్ మొదలుకాక ముందు హాట్ టాపిక్ గా మారింది…