పార్టీని ఇప్పుడున్న పరిస్థితిలో బలోపేతం చేయాలి.. ఈ క్రమంలో మార్పులు సహజం..- ఇదీటీడీపీ అధినేత చంద్రబాబు పఠిస్తున్న రాజకీయ మంత్రం! మంచిదే. అయితే, ఈ మార్పుల నేపథ్యంలో అసలుకే ఆయన ఎసరు పెట్టుకుంటున్నారనే వాదన తెరమీదికి వస్తోందని అంటున్నారు సొంత పార్టీ నాయకులు.
తాజాగా ఏలూరు పార్లమెంటు వ్యవహారం పార్టీలో తీవ్ర చర్చకు దారితీస్తోంది. ఇక్కడ పార్టీ ఇంచార్జ్గా ఉన్న మాగంటి వెంకటేశ్వరరావు.. ఉరఫ్ బాబును మార్చేయాలనేది బాబు నిర్ణయంగా ఉందని ప్రచారం సాగుతోంది. గత ఏడాది ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు.
పైగా పార్టీలోనూ యాక్టివ్గా లేరు. అనారోగ్య కారణాలు కూడా పట్టిపీడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మార్పు అవసరమే. కానీ, ఈ విషయంలో ఆయనతో మాటైనా చెప్పాల్సిన బాధ్యత.. అవసరం చంద్రబాబుకు లేవా? అంటు ఖచ్చితంగా ఉన్నాయి. ఎందుకంటే.. పార్టీలో కీలకమైన కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేత కావడం.. పార్టీకి అంతో ఇంతో నిధులు సర్దుబాటు చేసిన సీనియర్ నేత కావడం. పైగా .. బలమైన కోటరీ ఉన్న నాయకుడు.. కూడా కావడం వంటి కారణాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే కమ్మ సామాజిక వర్గం చంద్రబాబు వల్ల తాము బజారునపడ్డామనే భావనతో రగిలిపోతోంది. ఈ క్రమంలో ఇప్పుడు చంద్రబాబు వేసే అడుగు కీలకం కానుంది.
కానీ, చంద్రబాబు మాత్రం మాగంటిని ఇక్కడ తప్పించి.. మరో వ్యక్తి(ఇంకా నిర్ణయించలేదు. చర్చల్లో ఉంది)ని నియమించాలని.. భావిస్తున్నారు. పోనీ.. ఇదే విషయాన్ని మాగంటితో అయినా చర్చించారా? అంటే లేదు. నిజానికి మాగంటి తల్లీ దండ్రులు కూడా రాజకీయాల్లో చక్రం తిప్పిన చరిత్ర ఉంది. వారు కాంగ్రెస్లోను.. మాగంటిబాబు.. టీడీపీలో అనూహ్యమైన రాజకీయాలు చేశారు. ఇప్పుడు ఒక్కసారిగా ఈ కుటుంబానికి రాజకీయ ప్రాధాన్యం లేకుండా చేస్తానంటే.. బాబుకు వ్యతిరేకత మరింత పెరిగిపోదా?
పైగా మాగంటి బాబు కుమారుడు రాంజీ ప్రస్తుతం పశ్చిమ గోదావరిజిల్లా తెలుగు యువత అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయననైనా ఇక్కడ నియమించే అవకాశంఉంది. కానీ, ఇవేవీ పట్టించుకోకుండా.. బాబు వ్యవహరిస్తే.. రేపు ఏలూరు కూడా టీడీపీ ఖాతా నుంచి పోవడం ఖాయమని తమ్ముళ్లే పెదవి విరుస్తున్నారు. గత ఏడాది ఎన్నికల్లోనూ ఇలా చేసుకునే చంద్రబాబు తాను చెడి.. అందరినీ చెడగొట్టారని పేర్కొంటున్నారు. మరి బాబు నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి.
This post was last modified on September 16, 2020 5:06 pm
ఒక సినిమా రిలీజైన రెండు మూడేళ్ల తర్వాత కూడా దాని కలెక్షన్ల గురించి విపరీతమైన చర్చ జరగడం అరుదు. ‘దేవర’ విషయంలో ఇదే…
అక్కినేని యువ కథానాయకుడు అఖిల్ హీరోగా స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి రూపొందించిన ‘ఏజెంట్’ టాలీవుడ్ చరిత్రలోనే అతి పెద్ద…
కేంద్ర విద్యా శాఖకు నూతన మంత్రిగా బీజేపీ సీనియర్ నేత, కేంద్ర కేబినెట్ లో కీలక శాఖల మంత్రిగా కొనసాగుతున్న ప్రహ్లాద్ జోషి నియమితులయ్యారు.…
బాక్సాఫీస్ దగ్గర పోటీ ఉన్నప్పుడు కొన్ని ఆసక్తికరమైన పరిణామాలు జరుగుతాయి. ఇది అలాంటిదే. కేవలం ఒక్క రోజు గ్యాప్ తో…
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది అభిమానులను సొంతం చేసుకున్న స్పైడర్ మ్యాన్ సిరీస్ లోని కొత్త సినిమా బ్రాండ్ న్యూ డే జూలై…
ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్ కొత్త లాజిక్ మాట్లాడుతున్నారు. నైతిక బాధ్యత వహిస్తూ…