Political News

సోమిరెడ్డి వదిలిన సెంటిమెంటాస్త్రం!

నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితం. రెండు సార్లు గెలిచి మంత్రి పదవి, ఒకసారి ఓడినా ఎమ్మెల్సీని చేసి మంత్రిని చేశారు. ముచ్చటగా మూడు సార్లు మంత్రి. కానీ రెండు దశాబ్దాలుగా ఓటమి తప్ప గెలుపు బాట పట్టడం లేదు. ఈ సారి పార్టీ టికెట్ కూడా ఇవ్వకుండా పక్కకు పెట్టాలని చూసినా అన్ని సమీకరణాలు బేరీజు వేసుకుని ఆయనకే టికెట్ ఇచ్చారు. దీంతో ఈసారి గెలుపు ఆయనకు అనివార్యంగా మారడంతో ఆఖరి అస్త్రాన్ని బయటకు తీశాడు. అదే బ్రహ్మాస్త్రంగా భావిస్తున్నాడు.

నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నది. మేనమామ నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి 1994 ఎన్నికల్లో టీడీపీ నుండి గెలిచి చంద్రబాబు మంత్రి వర్గంలో ఏకంగా ఐదు శాఖలకు మంత్రిగా పనిచేశాడు. 1999లో గెలిచి  రెండో సారి మంత్రి అయ్యాడు.

2004, 2009లలో ఆదాల ప్రభాకర్ రెడ్డి చేతిలో, 2014, 2019లలో కాకాణి గోవర్దన్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యాడు. 2014లో ఓడినా ఆయనను ఎమ్మెల్సీ చేసి చంద్రబాబు మంత్రిగా తీసుకున్నారు. అయినా 2019లో ఓటమి తప్పలేదు. నాలుగు ఓటముల నేపథ్యంలో ఈసారి ఆయన కోడలు శృతికి టికెట్ ఇవ్వాలని భావించారు. కాకలు తీరిన కాకాణిని ఢీకొట్టడం ఆమెతో కాదని చివరికి సోమిరెడ్డికే టికెట్ ఇచ్చారు.

రెండు దశాబ్దాల వరస ఓటముల నేపథ్యంలో ఆయన ప్రజలపై సెంటిమెంటును ప్రయోగిస్తున్నారు. ‘నాకు ఇవే చివరి ఎన్నికలు. దయచేసి నాకు మద్దతిచ్చి గెలిపించండి’ అని సోమిరెడ్డి వేడుకుంటున్నారు. పార్టీని వీడిన నేతల ఇళ్లకు వెళ్లి తనకు సహకరించాలని కోరుకుంటున్నారు. మరి ఆయన సెంటిమెంట్ సర్వేపల్లి జనం కరిగిపోతారా ? వేచిచూడాలి.

This post was last modified on April 28, 2024 7:18 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

17 minutes ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

23 minutes ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

54 minutes ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

2 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

3 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

5 hours ago