నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితం. రెండు సార్లు గెలిచి మంత్రి పదవి, ఒకసారి ఓడినా ఎమ్మెల్సీని చేసి మంత్రిని చేశారు. ముచ్చటగా మూడు సార్లు మంత్రి. కానీ రెండు దశాబ్దాలుగా ఓటమి తప్ప గెలుపు బాట పట్టడం లేదు. ఈ సారి పార్టీ టికెట్ కూడా ఇవ్వకుండా పక్కకు పెట్టాలని చూసినా అన్ని సమీకరణాలు బేరీజు వేసుకుని ఆయనకే టికెట్ ఇచ్చారు. దీంతో ఈసారి గెలుపు ఆయనకు అనివార్యంగా మారడంతో ఆఖరి అస్త్రాన్ని బయటకు తీశాడు. అదే బ్రహ్మాస్త్రంగా భావిస్తున్నాడు.
నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నది. మేనమామ నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి 1994 ఎన్నికల్లో టీడీపీ నుండి గెలిచి చంద్రబాబు మంత్రి వర్గంలో ఏకంగా ఐదు శాఖలకు మంత్రిగా పనిచేశాడు. 1999లో గెలిచి రెండో సారి మంత్రి అయ్యాడు.
2004, 2009లలో ఆదాల ప్రభాకర్ రెడ్డి చేతిలో, 2014, 2019లలో కాకాణి గోవర్దన్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యాడు. 2014లో ఓడినా ఆయనను ఎమ్మెల్సీ చేసి చంద్రబాబు మంత్రిగా తీసుకున్నారు. అయినా 2019లో ఓటమి తప్పలేదు. నాలుగు ఓటముల నేపథ్యంలో ఈసారి ఆయన కోడలు శృతికి టికెట్ ఇవ్వాలని భావించారు. కాకలు తీరిన కాకాణిని ఢీకొట్టడం ఆమెతో కాదని చివరికి సోమిరెడ్డికే టికెట్ ఇచ్చారు.
రెండు దశాబ్దాల వరస ఓటముల నేపథ్యంలో ఆయన ప్రజలపై సెంటిమెంటును ప్రయోగిస్తున్నారు. ‘నాకు ఇవే చివరి ఎన్నికలు. దయచేసి నాకు మద్దతిచ్చి గెలిపించండి’ అని సోమిరెడ్డి వేడుకుంటున్నారు. పార్టీని వీడిన నేతల ఇళ్లకు వెళ్లి తనకు సహకరించాలని కోరుకుంటున్నారు. మరి ఆయన సెంటిమెంట్ సర్వేపల్లి జనం కరిగిపోతారా ? వేచిచూడాలి.
This post was last modified on April 28, 2024 7:18 pm
ఏపీ సీఎం చంద్రబాబు ఏ చిన్న అవకాశాన్నీ వదలట్లేదా? అంటే.. ఔననే సమాధానమే వస్తోంది. పెట్టుబడులకు ఎక్కడ అవకాశం ఉంటే..…
ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో శాసన సభను బాయ్కాట్ చేసిన వైసీపీ ప్రజాప్రతినిధులు శాసన మండలిలో మాత్రం చిందులు తొక్కుతున్నారు.…
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…