Political News

2 రోజుల వ్యవధిలో ప్రభుత్వానికి 2 ఎదురుదెబ్బలు

ఏపీ ప్రభుత్వానికి న్యాయస్థానాల్లో వరుసగా ఎదురు దెబ్బలు తగలడంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఇటు ఏపీ హైకోర్టుతోపాటు అటు దేశపు అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టులోనూ చాలా సందర్భాల్లో జగన్ సర్కారుకు చుక్కెదురవడంపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.

అమరావతి భూకుంభకోణం వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ మాజీ అడ్వకేట్ జనరల్ దుమ్మాలపాటి శ్రీనివాస్ పై చర్యలు తీసుకోవడంపై హైకోర్టు స్టే విధించింది ఈ వ్యవహారంపై చర్చ జరుగుతుండగానే వైసీపీ ప్రభుత్వానికి హైకోర్టులో మరో ఎదురుదెబ్బ తగిలింది.

అమరావతి భూముల వ్యవహారంలో ఇన్ సైడర్ ట్రేడింగ్ పై వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ తదుపరి చర్యలను నిలిపేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది.

అమరావతి భూముల వ్యవహారంలో ఇన్ సైడర్ ట్రేడింగ్ ఆరోపణల నేపథ్యంలో గత ప్రభుత్వ నిర్ణయాలన్నీంటిని పునఃసమీక్షించాలంటూ వైసీపీ ప్రభుత్వం ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది. రాజధాని భూముల వ్యవహారంపై దర్యాప్తు కోసం సిట్ ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి సబ్ కమిటీ నివేదికను అందజేసింది. ఈ క్రమంలో ఏర్పడిన సిట్‌కు ప్రభుత్వం ప్రత్యేక అధికారాలు ఇచ్చింది. పోలీస్ స్టేషన్‌కు ఉన్న అధికారాలను సిట్‌కు ఇవ్వడం న్యాయబద్దం కాదని, ఈ సిట్‌ విచారణ నిలిపివేయాలని టీడీపీ నేతలు వర్ల రామయ్య, ఆలపాటి రాజాలు హైకోర్టును ఆశ్రయించారు. ఒక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను పునఃసమీక్షించే అధికారం మరో ప్రభుత్వానికి లేదని, ఇదంతా దురుద్దేశంతో చేస్తున్నారని పిటిషన్ లో పేర్కొన్నారు.

ఆ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు సిట్ తదుపరి చర్యలు ఆపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలోనే 2 రోజుల వ్యవధిలో ప్రభుత్వానికి 2 ఎదురుదెబ్బలు తగిలాయన్న చర్చ జరుగుతోంది.

This post was last modified on September 16, 2020 1:52 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

శ్యామ్ సింగ రాయ్ దర్శకుడి కొత్త ట్యాక్సీ

కొందరు డైరెక్టర్లు నిదానమే ప్రధానం సూత్రం పాటిస్తారు. నెంబర్ కన్నా నాణ్యత ముఖ్యమని ఆ దిశగా స్క్రిప్ట్ కోసమే సంవత్సరాలు…

23 mins ago

అల్లరోడికి అసలు పరీక్ష రేపే

వేసవిలో కీలక సమయం వచ్చేసింది. స్కూళ్ళు, కాలేజీలకు పూర్తి స్థాయి సెలవులు ఇచ్చేశారు. జనాలు థియేటర్లకు వెళ్లేందుకు మంచి ఆప్షన్ల…

1 hour ago

స‌మ‌యం మించి పోయింది.. సేనానీ: ఎన్నిక‌ల సంఘం

ఏపీలో త‌లెత్తిన ఎన్నిక‌ల  గుర్తు ర‌గ‌డ మ‌రో మ‌లుపు తిరిగింది. జ‌న‌సేన‌కు కేటాయించిన ఎన్నికల గుర్తు గాజు గ్లాసును స్వ‌తంత్ర…

2 hours ago

క్రిష్‌కు ఇది సమ్మతమేనా?

టాలీవుడ్ దర్శకుల్లో క్రిష్ జాగర్లమూడిది డిఫరెంట్ స్టైల్. ‘గమ్యం’ లాంటి సెన్సేషనల్ మూవీతో మొదలుపెట్టి ఆయన వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ…

2 hours ago

వరలక్ష్మితో రూమ్ బుక్ చేయనా అన్నాడట

ప్రస్తుతం తమిళ, తెలుగు భాషల్లో మోస్ట్ వాంటెడ్ లేడీ ఆర్టిస్టుల్లో వరలక్ష్మి శరత్ కుమార్ ఒకరు. ఆమె ఓవైపు లీడ్…

3 hours ago

ఇదేం ట్విస్ట్ వీరమల్లూ?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లోనే అత్యధిక బడ్జెట్లో, భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ‘హరిహర వీరమల్లు’ సినిమా గురించి జనాలు…

4 hours ago