Political News

2 రోజుల వ్యవధిలో ప్రభుత్వానికి 2 ఎదురుదెబ్బలు

ఏపీ ప్రభుత్వానికి న్యాయస్థానాల్లో వరుసగా ఎదురు దెబ్బలు తగలడంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఇటు ఏపీ హైకోర్టుతోపాటు అటు దేశపు అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టులోనూ చాలా సందర్భాల్లో జగన్ సర్కారుకు చుక్కెదురవడంపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.

అమరావతి భూకుంభకోణం వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ మాజీ అడ్వకేట్ జనరల్ దుమ్మాలపాటి శ్రీనివాస్ పై చర్యలు తీసుకోవడంపై హైకోర్టు స్టే విధించింది ఈ వ్యవహారంపై చర్చ జరుగుతుండగానే వైసీపీ ప్రభుత్వానికి హైకోర్టులో మరో ఎదురుదెబ్బ తగిలింది.

అమరావతి భూముల వ్యవహారంలో ఇన్ సైడర్ ట్రేడింగ్ పై వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ తదుపరి చర్యలను నిలిపేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది.

అమరావతి భూముల వ్యవహారంలో ఇన్ సైడర్ ట్రేడింగ్ ఆరోపణల నేపథ్యంలో గత ప్రభుత్వ నిర్ణయాలన్నీంటిని పునఃసమీక్షించాలంటూ వైసీపీ ప్రభుత్వం ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది. రాజధాని భూముల వ్యవహారంపై దర్యాప్తు కోసం సిట్ ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి సబ్ కమిటీ నివేదికను అందజేసింది. ఈ క్రమంలో ఏర్పడిన సిట్‌కు ప్రభుత్వం ప్రత్యేక అధికారాలు ఇచ్చింది. పోలీస్ స్టేషన్‌కు ఉన్న అధికారాలను సిట్‌కు ఇవ్వడం న్యాయబద్దం కాదని, ఈ సిట్‌ విచారణ నిలిపివేయాలని టీడీపీ నేతలు వర్ల రామయ్య, ఆలపాటి రాజాలు హైకోర్టును ఆశ్రయించారు. ఒక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను పునఃసమీక్షించే అధికారం మరో ప్రభుత్వానికి లేదని, ఇదంతా దురుద్దేశంతో చేస్తున్నారని పిటిషన్ లో పేర్కొన్నారు.

ఆ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు సిట్ తదుపరి చర్యలు ఆపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలోనే 2 రోజుల వ్యవధిలో ప్రభుత్వానికి 2 ఎదురుదెబ్బలు తగిలాయన్న చర్చ జరుగుతోంది.

This post was last modified on September 16, 2020 1:52 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

10 minutes ago

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

4 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

5 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

6 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

7 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

7 hours ago