Political News

2 రోజుల వ్యవధిలో ప్రభుత్వానికి 2 ఎదురుదెబ్బలు

ఏపీ ప్రభుత్వానికి న్యాయస్థానాల్లో వరుసగా ఎదురు దెబ్బలు తగలడంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఇటు ఏపీ హైకోర్టుతోపాటు అటు దేశపు అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టులోనూ చాలా సందర్భాల్లో జగన్ సర్కారుకు చుక్కెదురవడంపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.

అమరావతి భూకుంభకోణం వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ మాజీ అడ్వకేట్ జనరల్ దుమ్మాలపాటి శ్రీనివాస్ పై చర్యలు తీసుకోవడంపై హైకోర్టు స్టే విధించింది ఈ వ్యవహారంపై చర్చ జరుగుతుండగానే వైసీపీ ప్రభుత్వానికి హైకోర్టులో మరో ఎదురుదెబ్బ తగిలింది.

అమరావతి భూముల వ్యవహారంలో ఇన్ సైడర్ ట్రేడింగ్ పై వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ తదుపరి చర్యలను నిలిపేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది.

అమరావతి భూముల వ్యవహారంలో ఇన్ సైడర్ ట్రేడింగ్ ఆరోపణల నేపథ్యంలో గత ప్రభుత్వ నిర్ణయాలన్నీంటిని పునఃసమీక్షించాలంటూ వైసీపీ ప్రభుత్వం ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది. రాజధాని భూముల వ్యవహారంపై దర్యాప్తు కోసం సిట్ ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి సబ్ కమిటీ నివేదికను అందజేసింది. ఈ క్రమంలో ఏర్పడిన సిట్‌కు ప్రభుత్వం ప్రత్యేక అధికారాలు ఇచ్చింది. పోలీస్ స్టేషన్‌కు ఉన్న అధికారాలను సిట్‌కు ఇవ్వడం న్యాయబద్దం కాదని, ఈ సిట్‌ విచారణ నిలిపివేయాలని టీడీపీ నేతలు వర్ల రామయ్య, ఆలపాటి రాజాలు హైకోర్టును ఆశ్రయించారు. ఒక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను పునఃసమీక్షించే అధికారం మరో ప్రభుత్వానికి లేదని, ఇదంతా దురుద్దేశంతో చేస్తున్నారని పిటిషన్ లో పేర్కొన్నారు.

ఆ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు సిట్ తదుపరి చర్యలు ఆపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలోనే 2 రోజుల వ్యవధిలో ప్రభుత్వానికి 2 ఎదురుదెబ్బలు తగిలాయన్న చర్చ జరుగుతోంది.

This post was last modified on September 16, 2020 1:52 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

నందమూరి హీరోలకు నెంబర్ 2 గండం

అదేంటో కాకతాళీయంగా జరిగినా పరిశ్రమకు సంబంధించిన కొన్ని విషయాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. ఇటీవలే విడుదలైన అఖండ తాండవం 2 ఆశించిన…

1 hour ago

ఆర్జీవీ మీద ఇంత గౌరవమా?

రామ్ గోపాల్ వ‌ర్మ అంటే ఒక‌ప్పుడు ఇండియన్ సినిమాలోనే ఒక ట్రెండ్ సెట్ట‌ర్. శివ‌, రంగీలా, స‌త్య‌, కంపెనీ, స‌ర్కార్…

3 hours ago

ఈ సంక్రాంతికైనా జనంలోకి జగన్ వస్తారా?

రాష్ట్ర రాజ‌కీయాల్లో మార్పు స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. ప్ర‌జ‌ల నాడిని ప‌ట్టుకునే దిశ‌గా పార్టీలు అడుగులు వేస్తున్నాయి. స‌హ‌జంగా అధికారంలో ఉన్న‌పార్టీలు…

6 hours ago

‘పార్టీ మారినోళ్లు రెండూ కానోల్లా?’

తెలంగాణ‌లో తాజాగా జ‌రిగిన పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ ఘ‌న విజ‌యం ద‌క్కించుకుంద‌ని.. ఇది 2029 వ‌ర‌కు కొన‌సాగుతుంద‌ని.. అప్పుడు…

8 hours ago

కూటమి కట్టక తప్పదేమో జగన్

వ్య‌క్తిగ‌త విష‌యాలే..  జ‌గ‌న్‌కు మైన‌స్ అవుతున్నాయా? ఆయ‌న ఆలోచ‌నా ధోర‌ణి మార‌క‌పోతే ఇబ్బందులు త‌ప్ప‌వా? అంటే.. అవున‌నే సంకేతాలు పార్టీ…

10 hours ago

ఎవ‌రికి ఎప్పుడు `ముహూర్తం` పెట్టాలో లోకేష్ కు తెలుసు

టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేత‌ల‌ను ఉద్దేశించి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…

13 hours ago