ఏపీ ప్రభుత్వానికి న్యాయస్థానాల్లో వరుసగా ఎదురు దెబ్బలు తగలడంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఇటు ఏపీ హైకోర్టుతోపాటు అటు దేశపు అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టులోనూ చాలా సందర్భాల్లో జగన్ సర్కారుకు చుక్కెదురవడంపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.
అమరావతి భూకుంభకోణం వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ మాజీ అడ్వకేట్ జనరల్ దుమ్మాలపాటి శ్రీనివాస్ పై చర్యలు తీసుకోవడంపై హైకోర్టు స్టే విధించింది ఈ వ్యవహారంపై చర్చ జరుగుతుండగానే వైసీపీ ప్రభుత్వానికి హైకోర్టులో మరో ఎదురుదెబ్బ తగిలింది.
అమరావతి భూముల వ్యవహారంలో ఇన్ సైడర్ ట్రేడింగ్ పై వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ తదుపరి చర్యలను నిలిపేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది.
అమరావతి భూముల వ్యవహారంలో ఇన్ సైడర్ ట్రేడింగ్ ఆరోపణల నేపథ్యంలో గత ప్రభుత్వ నిర్ణయాలన్నీంటిని పునఃసమీక్షించాలంటూ వైసీపీ ప్రభుత్వం ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది. రాజధాని భూముల వ్యవహారంపై దర్యాప్తు కోసం సిట్ ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి సబ్ కమిటీ నివేదికను అందజేసింది. ఈ క్రమంలో ఏర్పడిన సిట్కు ప్రభుత్వం ప్రత్యేక అధికారాలు ఇచ్చింది. పోలీస్ స్టేషన్కు ఉన్న అధికారాలను సిట్కు ఇవ్వడం న్యాయబద్దం కాదని, ఈ సిట్ విచారణ నిలిపివేయాలని టీడీపీ నేతలు వర్ల రామయ్య, ఆలపాటి రాజాలు హైకోర్టును ఆశ్రయించారు. ఒక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను పునఃసమీక్షించే అధికారం మరో ప్రభుత్వానికి లేదని, ఇదంతా దురుద్దేశంతో చేస్తున్నారని పిటిషన్ లో పేర్కొన్నారు.
ఆ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు సిట్ తదుపరి చర్యలు ఆపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలోనే 2 రోజుల వ్యవధిలో ప్రభుత్వానికి 2 ఎదురుదెబ్బలు తగిలాయన్న చర్చ జరుగుతోంది.
This post was last modified on September 16, 2020 1:52 pm
ఒక కథ ఒక చోటి నుంచి ఇంకో చోటికి ప్రయాణం చేయడం.. ఎవరికో అనుకున్న కథ ఇంకెవరికో సెట్ కావడం…
బీజేపీ సీనియర్ నాయకుడు, ఘోషా మహల్ ఎమ్మెల్యే, వివాదాలకు కేంద్రంగా ఉన్న రాజా సింగ్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు.…
కేవలం సినిమాలో వినోదం ఉంటే సరిపోదని.. ప్రమోషన్లను కూడా సినిమా థీమ్కు తగ్గట్లు సరదాగా డిజైన్ చేసి ప్రేక్షకుల దృష్టిని…
భారతదేశంలో 5G సేవలు చాలా వేగంగా విస్తరిస్తున్నాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం, మొత్తం 776 జిల్లాల్లో…
‘మిర్చి’ సినిమా ఇంటర్వెల్ బ్యాంగ్లో ‘నా ఫ్యామిలీ సేఫ్’ అంటూ ప్రభాస్ చెప్పే డైలాగ్ ఎంత పాపులరో కొత్తగా చెప్పాల్సిన…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడును గురువారం తెలంగాణకు చెందిన సీనియర్ మోస్ట్ రాజకీయ నేత, మాజీ మంత్రి…