Political News

చంద్ర‌బాబు నోట‌.. స‌ర్వేల మాట‌.. ఎంత జోష్‌గా అంటే!

టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఇప్ప‌టికి రాష్ట్ర వ్యాప్తంగా అనేక స‌భ‌ల్లో పాల్గొన్నారు. అనేక ప్ర‌సంగాలు కూడా చేశారు. దాదాపు ఈ షెడ్యూల్ వ‌చ్చిన త‌ర్వాత ఆయ‌న 54 స‌భ‌ల్లో పాల్గొన్నారు. ఉమ్మ‌డిగా మూడు స‌భ‌ల్లో పాల్గొన్నారు. అయితే..ఎప్పుడూ కూడా.. ఆయ‌న నోటి నుంచి స‌ర్వేల మాట రాలేదు. కానీ, తొలిసారి పెడ‌న‌లో నిర్వ‌హించిన ప్ర‌జాగ‌ళం ఉమ్మ‌డి పార్టీల స‌భ‌లో చంద్ర బాబు స‌ర్వేల మాట ఎత్తారు. మొత్తం 11 స‌ర్వేలు త‌మ‌కే అనుకూలంగా తీర్పు చెప్పాయ‌ని అన్నారు. రాష్ట్రంలో షెడ్యూల్‌కు ముందు.. త‌ర్వాత జ‌రిగిన స‌ర్వేల్లో 11 సంస్థ‌లు కూట‌మి గెలుస్తుంద‌ని చెప్పాయ‌ని వ్యాఖ్యానించారు.

“కూట‌మి గెలుపున‌కు ఇంత‌కంటే.. ఇంకేం కావాలి. ప్ర‌జ‌లు కూట‌మి త‌ర‌ఫునే ఉన్నారు. రాష్ట్రంలో దుష్ట పాల‌న పోవాల‌నే కోరుకుంటున్నారు. అందుకే కూట‌మికి 11 స‌ర్వేలు అనుకూలంగా వ‌చ్చాయి. ఎవ‌రూ భ‌య‌ప‌డాల్సిన అవ‌స‌రం లేదు. ఎవ‌రూ ఆలోచించాల్సి అవ‌స‌రం లేదు. కూట‌మి దే విజ‌యం. ఇంత‌క‌న్నా చెప్పేది లేదు” అని చంద్ర‌బాబు చాలా జోరుగా వ్యాఖ్యానించారు. ఈ స‌మ‌యంలో ఆయ‌న ముఖం వెలిగిపోయింది. పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో కూట‌మి 17 నుంచి 23 స్థానాలు గెలుస్తుంద‌ని స‌ర్వేలు చెప్పిన‌ట్టు తెలిపారు. ఇక‌, జ‌గ‌న్ పాల‌న‌పై చంద్ర‌బాబు విమ‌ర్శ‌లు గుప్పించారు.

జ‌గ‌న్ ప్ర‌భుత్వంలో అన్ని వ‌ర్గాలు న‌ష్ట‌పోయాయ‌ని చంద్ర‌బాబు అన్నారు. ఎస్సీ, ఎస్టీల‌ను, బీసీల‌ను అడ్డంగా ముంచేశాడ‌ని అన్నారు. మ‌హిళ‌ల‌ను తీవ్రంగా ఇబ్బందులుపెట్టార‌ని.. అన్నారు. అలాంటి వారికే మంత్రి ప‌ద‌వులు ఇచ్చార‌ని చంద్ర‌బాబు దుయ్య‌బ‌ట్టారు. ప్ర‌తి ప‌నికీ లెక్క‌గ‌ట్టి.. స్థానిక ఎమ్మెల్యే(జోగి ర‌మేష్) దోచుకున్నాడ‌ని వ్యాఖ్యానించారు. “నా ఇంటిపైకే దాడి చేయడానికి వ‌చ్చాడు. ఈయ‌న మంత్రి. దాడులు చేసేవారు.. లంచాలు మేసేవారికి ప‌ద‌వులు ఇచ్చిన‌.. జ‌గ‌న్‌.. ఈ రాష్ట్రానికి సీఎం. ఆయ‌నో దౌర్భగ్య ముఖ్య‌మంత్రి” అని చంద్ర‌బాబు నిప్పులు చెరిగారు.

కూట‌మి పార్టీలుగా రావాల్సిన అవ‌స‌రం రాష్ట్రంలో క‌ల్పించింది జ‌గ‌నేన‌ని చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు. “ఒక దుష్టుడిని త‌రిమి కొట్ట‌డానికి రాముడు అంత‌టి వాడే.. అంద‌రినీ క‌లుపుకొని తాను త‌గ్గి పోరాటం చేసి.. రావ‌ణాసురుడిని అంతం చేశాడు. అలానే మేం కూడా.. చేతులు క‌లిపాం. ప్ర‌జ‌ల కోసం. రాష్ట్రం కోసం.. క‌ల‌సి క‌ట్టుగా ముందుకు వ‌చ్చాం. ప్ర‌జ‌లు ఆశీర్వ‌దిస్తున్నారు. ఈ ఫ‌లితం స‌ర్వేల్లోనే తేలిపోయింది. ఇక‌, మిగిలింది ఎన్నిక‌లే” అని చంద్ర‌బాబు ప్ర‌క‌టించారు.

Satya

Recent Posts

ప‌వ‌న్‌-లోకేష్‌… బాధ్య‌త పంచుకున్నారు!

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌, మంత్రి నారా లోకేష్‌లు.. కూట‌మి ప్ర‌భుత్వంలో కీల‌క రోల్ పోషిస్తున్న విష‌యం తెలిసిందే.…

45 minutes ago

మ్యాజిక్ చేయడానికి బుల్లితెరకు వెళ్తున్నారు

రెగ్యులర్ గా టాలీవుడ్ ని ఫాలో అయ్యేవాళ్ళకు మ్యాజిక్ అంటే వెంటనే గుర్తొచ్చే కాంబినేషన్ గౌతమ్ తిన్ననూరి - అనిరుద్…

51 minutes ago

స్పందించిన బన్నీ… సర్దుకుంటాయా అన్నీ

మెగా ఫ్యాన్స్, ఐకాన్ స్టార్ అభిమానుల మధ్య బయటికి కనిపించని కోల్డ్ వార్ జరుగుతూనే ఉంటుంది. హీరోలు వాళ్ళు వాళ్ళు…

2 hours ago

ప్యారడైజ్ కొత్త ముహూర్తం ఫిక్సయ్యిందా

ప్యాన్ ఇండియా సినిమాలకు వాయిదాలు మంచి నీళ్లు తాగినంత సులభంగా మారిపోయాయి. రెండు కన్నా తక్కువ డేట్లు మార్చుకుని థియేటర్లకు…

3 hours ago

రేపు విశాఖకు వైఎస్ జగన్

వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం విశాఖపట్నంలో పర్యటించనున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్…

3 hours ago

కొత్త ‘పెద్ది’ త్వరగా వచ్చేయాలి

అంతర్గత వర్గాల నుంచి వినిపిస్తున్న సమాచారం కనక నిజమయ్యే పక్షంలో రామ్ చరణ్ అభిమానులకు అది గుడ్ న్యూస్ కానుంది.…

5 hours ago