Political News

చింత‌మ‌నేనిపై సానుభూతి.. గెలిస్తే గిఫ్ట్‌తో బాబు రెడీ

ఈ సారి దెందులూరు ఎమ్మెల్యేగా చింత‌మ‌నేని ప్రభాక‌ర్ గెలుపు ఖాయ‌మా? అది తెలిసే చంద్ర‌బాబు ఆయ‌న‌కు స్పెష‌ల్ గిఫ్ట్ ఇస్తా అన్నారా? అంటే రాజ‌కీయ వ‌ర్గాల నుంచి అవున‌నే స‌మాధానాలే వినిపిస్తున్నాయి. 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో చింత‌మ‌నేని గెలిచేందుకు మెరుగైన అవ‌కాశాలున్నాయ‌ని విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు. ఇక్క‌డ మ‌రోసారి టీడీపీ జెండా ఎగ‌ర‌డం ఖాయ‌మ‌ని చెబుతున్నారు. దూకుడైన రాజ‌కీయ నాయ‌కుడిగా పేరు తెచ్చుకున్న చింత‌మ‌నేనికి.. ఇచ్చిన మాట త‌ప్ప‌ర‌నే పేరుంది.

టీడీపీ నుంచి రెండు సార్లు దెందులూరు ఎమ్మెల్యేగా గెలిచిన చింత‌మ‌నేనికి 2019లో ప‌రాజ‌యం ఎదురైంది. అప్పుడు వైసీపీ అభ్య‌ర్థి కొఠారు అబ్బ‌య్య చౌద‌రి చేతిలో చింత‌మ‌నేని ఓడిపోయారు. ఈ ఓట‌మి నుంచి కోలుకునేందుకు కాస్త స‌మ‌యం తీసుకున్న ఆయ‌న‌.. తిరిగి వెంట‌నే నియోజ‌క‌వ‌ర్గంలో యాక్టివ్ అయ్యారు. అక్క‌డ టీడీపీ క్యాడ‌ర్ ప‌క్క‌దారి ప‌ట్ట‌కుండా చూసుకున్నారు. ప్ర‌జల్లో ఉంటూ టీడీపీ ఓటు బ్యాంకు దెబ్బ‌తిన‌కుండా జాగ్ర‌త్త వ‌హించారు. ఇప్పుడు ఎన్నిక‌ల నేప‌థ్యంలో చింత‌మ‌నేని విజ‌యంపై ధీమాతో ఉన్నార‌ని స‌మాచారం.

మ‌రోసారి వైసీపీ నేత అబ్బ‌య్య చౌద‌రిని ఢీ కొడుతున్న చింత‌మ‌నేని గెలిచి రివేంజ్ తీసుకోవాల‌నే టార్గెట్ పెట్టుకున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ వేవ్‌తో అబ్బ‌య్య గెలిచారు కానీ ఆయ‌న క‌ష్ట‌మేమీ లేద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. ఇక గెలిచిన త‌ర్వాత అబ్బ‌య్య ప్ర‌జ‌ల్లోకి ఎక్కువ‌గా రాలేద‌నే విమ‌ర్శ‌లున్నాయి. స‌మ‌స్య‌ల‌ను ప‌ట్టించుకోలేద‌ని అంటున్నారు. దీంతో గ్రౌండ్ లెవ‌ల్‌లో ప‌రిస్థితి చూస్తే చింత‌మ‌నేనిపై ప్ర‌జ‌ల‌కు సానుభూతి క‌లుగుతోంద‌ని తెలిసింది. ఆయ‌న‌పై మ‌ళ్లీ జ‌నాద‌ర‌ణ పెరిగింద‌ని ఈ సారి విజ‌యం ప‌క్కా అని చెబుతున్నారు. స‌ర్వేల ద్వారా బాబుకు ఇదే తెలిసింద‌ని, అందుకే ఈ సారి చింత‌మ‌నేని గెలిస్తే గిఫ్ట్ ఇస్తాన‌ని ప్ర‌క‌టించార‌ని టాక్‌. గ‌తంలో టీడీపీ ప్ర‌భుత్వ హ‌యాంలో చింత‌మ‌నేని విప్‌గా ప‌ని చేసిన సంగ‌తి తెలిసిందే.

This post was last modified on April 11, 2024 2:28 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

వరప్రసాదుకి పోలికలు అవసరం లేదు

మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…

1 hour ago

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

6 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

6 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

6 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

7 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

9 hours ago