Political News

జనసేన వాహనంపై టీడీపీ అధినేత

వారాహి అన‌గానే ఠ‌క్కున గుర్తుకు వ‌చ్చేది జ‌న‌సేన‌, ప‌వ‌న్ క‌ల్యాణ్‌లు మాత్ర‌మే. గ‌త ఏడాది జూన్‌లో ఈ వారాహి వాహ‌నాన్ని ప‌వ‌న్ ప్ర‌చారంలోకి తీసుకువ‌చ్చారు. ఈ వాహ‌నం శ‌త్రు దుర్బేధ్యం. పైగా విశాలంగా ఉండి.. నాయ‌కులు ప్ర‌సంగించేందుకు వీలుగా ఉంటుంది. వాహ‌నానికి చుట్టూ మైకులు ఉంటాయి. అదేవిధంగా లైటింగ్ కూడా ఉంటుంది. ఇక‌, పంక్ఛ‌ర్ ఫ్రీ టైర్లు, 100 కిలోల బ‌లంతో కొట్టినా ప‌గిలిపోని అద్దాలు వంటివి ఈ వాహ‌నం ప్ర‌త్యేక‌త‌లు. అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కు ప‌వ‌న్ మాత్ర‌మే ఈ వాహ‌నాన్ని వినియోగిస్తూ వ‌చ్చారు.

కానీ, తొలిసారి టీడీపీ అధినేత చంద్ర‌బాబు వారాహి వాహ‌నాన్ని వినియోగించారు. బీజేపీ-టీడీపీ-జ‌న‌సేన పార్టీలు కూట‌మిగా ఏర్ప‌డిన త‌ర్వాత‌.. నిర్వ‌హించిన ఉమ్మ‌డి రెండో స‌భ‌ను ఉమ్మ‌డి ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలోని నిడ‌ద‌వోలులో బుధ‌వారం రాత్రి నిర్వ‌హించారు. దీనికి ముందు త‌ణుకులో కూడా నిర్వ‌హించినా.. అక్క‌డ‌కు వారాహి వాహ‌నం రాలేదు. దీనికి ప‌ర్మిష‌న్ ఇవ్వ‌లేద‌ని స‌మాచారం. దీంతో నిడ‌ద‌వోలులో నిర్వ‌హించిన ఉమ్మ‌డి పార్టీల స‌భ‌లో వారాహి వాహ‌నం ప్ర‌త్యేకంగా క‌నిపించింది. తొలిసారి మాజీ సీఎం చంద్ర‌బాబు ఈ వాహ‌నంపైకి ఎక్కి మురిసిపోయారు.

“వారాహి వాహ‌నం పేరు విన‌డం.. వీడియోలు.. ఫొటోల్లో చూడ‌డ‌మే త‌ప్ప‌.. ప్ర‌త్య‌క్షంగా ఈ వాహ‌నాన్ని చూసింది లేదు. ప‌వ‌న్ క‌ల్యాణ్ నాకు అనేక మార్లు ఈ వాహ‌నం గురించి వివ‌రించారు. ప్ర‌త్యేక‌త‌లు చాలానే ఉన్నాయ‌ని చెప్పారు. కానీ, ఇప్పుడే ప్ర‌త్య‌క్షంగా చూస్తున్నా. వాహ‌నం చాలా బాగుంది” అని చంద్ర‌బాబు ఆనందం వ్య‌క్తం చేశారు. ఇక‌, ఈ వాహ‌నంపై ముగ్గురు నాయ‌కులు ప్ర‌సంగించారు. బీజేపీ నుంచి ఆ పార్టీ ఏపీ చీఫ్ పురందేశ్వ‌రి నిడ‌ద‌వోలు స‌భ‌లో పాల్గొన్నారు. ఇక‌, ప‌వ‌న్ అటు త‌ణుకు, ఇటు నిడ‌ద‌వోలు స‌భ‌ల్లోనూ పాల్గొని ప్ర‌సంగించారు. మూడు పార్టీల‌తోనే అభివృద్ది అని.. డ‌బుల్ ఇంజ‌న్ స‌ర్కారుతో రాష్ట్రం ప‌రుగులు పెడుతుంద‌ని నాయ‌కులు తేల్చి చెప్పారు.

This post was last modified on April 11, 2024 9:52 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

కూటమి ఎమ్మెల్యేల ప్రశ్నలే ఘాటుగా ఉన్నాయి

అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలకు వైసీపీ డుమ్మా కొట్టిన విష‌యం తెలిసిందే. త‌మ‌కు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదా ఇస్తే త‌ప్ప‌.. స‌భ‌కు…

6 minutes ago

రామాయణానికి నాలుగు వేల కోట్లు ఎలా?

ఇండియన్ సినిమా స్థాయి ఎంత పెరిగినా సరే.. ఇప్పటికీ వెయ్యి కోట్ల బడ్జెట్ అంటేనే చాలా ఎక్కువ. అలాంటిది రామాయణం…

21 minutes ago

ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం: బయటపడుతున్న నిజాలు

జార్ఖండ్‌లో జరిగిన ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. రాంచీ నుండి ఢిల్లీకి రోగిని తరలిస్తుండగా చత్రా…

2 hours ago

వెంకటేష్ వదులుకుంటే మంచి నిర్ణయమే

ఇంకో ముప్పై నాలుగు రోజుల్లో మలయాళం దృశ్యం 3 విడుదల కానుంది. ఈ భాగంతో కథకు ముగింపు ఇవ్వబోతున్నారు. కొడుకు…

3 hours ago

పునర్విక ప్రాణాలకు లోకేష్ అండ

మంత్రి నారా లోకేష్ తన సహృదయత చాటుకున్నారు. ఎస్‌ఎంఏ టైప్–1 అనే అరుదైన జన్యు వ్యాధితో పోరాడుతున్న కర్నూలుకు చెందిన…

3 hours ago

తారక్ ‘డ్రాగన్’ కోసం మరో హీరో ?

జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న డ్రాగన్ (ప్రచారంలో ఉన్న టైటిల్) షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ కు…

6 hours ago