హైదరాబాద్ నుంచి భారత వాణిజ్య రాజ్యధానికి రోజూ వేల మంది వివిధ రకాలుగా ప్రయాణిస్తారు. అత్యంత వేగంగా అక్కడికి చేరుకోవాలంటే విమాన ప్రయాణాన్నే ఆశ్రయించాలి. కానీ విమానంలో వెళ్లినంత వేగంగా హైదరాబాద్ నుంచి ముంబయికి రైల్లో ప్రయాణిస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి? ఇదెలా సాధ్యం అనిపిస్తోందా? కేంద్ర ప్రభుత్వ ప్రణాళికలు అనుకున్నట్లుగా అమలైతే కొన్నేళ్లలో ఇది సాధ్యపడొచ్చు.
ఈ రెండు నగరాల మధ్య బుల్లెట్ ట్రైన్ తీసుకురావాలని మోడీ సర్కారు నిర్ణయించడం విశేషం. దేశవ్యాప్తంగా ఏడు కొత్త బుల్లెట్ రైళ్లు ప్రవేశ పెట్టేందుకు కేంద్రం ప్రణాళికలు రూపొందించింది. ఇందులో హైదరాబాద్-ముంబయి మార్గం కూడా ఉండటం విశేషం. ఈ రెండు నగరాల మధ్య 711 కిలోమీటర్ల దూరం బుల్లెట్ ట్రైన్ కోసం స్పెషల్ ట్రాక్ నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
దీంతో పాటు చెన్నై-మైసూరు (435 కిలోమీటర్లు), ఢిల్లీ-వారణాసి (865), ముంబయి-నాగ్పూర్ (753), ఢిల్లీ-అహ్మదాబాద్ (886), ఢిల్లీ-అమృత్సర్ (459), వారణాసి-హౌడా (760) మార్గాల్లోనూ బుల్లెట్ ట్రైన్లు తీసుకురావాలన్నది కేంద్రం తాజా ప్రతిపాదన. ఈ ఏడు ప్రాజెక్టుల మొత్తం అంచనా వ్యయం రూ.10 లక్షల కోట్లు కావడం విశేషం. ఈ ఏడు కొత్త నడవాలకు సంబంధఇంచి సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)లను సిద్ధం చేయాలని జాతీయ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ను కేంద్రం ఆదేశించింది.
దేశంలోనే తొలి బుల్లెట్ రైలు ప్రాజెక్టు ముంబయి-అహ్మదాబాద్ మధ్య నడిపేందుకు ఇప్పటికే కేంద్రం పనులు ప్రారంభించింది. ఈ రెండు నగరాల మద్య 508.17 కిలోమీటర్లు ట్రాక్ నిర్మిస్తున్నారు. 2023 డిసెంబర్లో ఈ రైలును ఆరంభించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఐతే భూసేకరణ సమస్యలు, కోవిడ్, ఇతర ఇబ్బందుల కారణంగా ఈ ప్రాజెక్టు ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది.
This post was last modified on September 15, 2020 1:44 pm
మాములుగా రీ రిలీజులు ఏవి ఆడతాయో ఏవి ఆడవో అంత ఈజీగా చెప్పలేని పరిస్థితి నెలకొంది. గత ఏడాది ఖలేజాని…
తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి అంశం జాతీయ స్థాయిలో దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆ టాపిక్ పై…
మెగా, అల్లు బంధం మీద ఎప్పటికప్పుడు రకరకాల ఊహాగానాలు, అనుమానాలు వస్తూనే ఉంటాయి. ఇరు కుటుంబాల మధ్య సంబంధాలు ఒకప్పట్లా…
జింబాబ్వేపై వెస్టిండీస్ భారీ గెలుపు తర్వాత భారత్ సెమీస్ అవకాశాలు ఇప్పుడు పక్కా లెక్కల మీద ఆధారపడి ఉన్నాయి. నెట్…
ప్రాణానికి ప్రాణం అనేది పాత సామెత. స్ట్రోకుకు స్ట్రోకు కొత్త ట్రెండ్. ఇటీవలే ఒక ఇంటర్నేషనల్ మ్యాగజైన్ కు చెందిన…
మెక్సికోలో అత్యంత ప్రమాదకరమైన డ్రగ్ మాఫియా డాన్ నెమెసియో రూబెన్ ఒసెగ్వెరా సెర్వంటెస్ అలియాస్ 'ఎల్ మెంచో' కథ ముగిసింది.…