Political News

బాబు కొట్టిన సిక్సర్

వైసీపీ అధినేత, సీఎం జ‌గ‌న్‌ను తొలిసారి టీడీపీ అధినేత చంద్ర‌బాబు డిఫెన్స్‌లో ప‌డేశారా? చంద్ర‌బాబు చేసిన కీల‌క ప్ర‌క‌ట‌న త‌ర్వాత జ‌గ‌న్ ఒకింత ఆలోచ‌న‌లో ప‌డ్డారా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. వాస్త‌వానికి ప్ర‌స్తుత ఎన్నిక‌ల స‌మ‌యం లో చంద్ర‌బాబు అనేక విష‌యాల‌ను ప్ర‌స్తావిస్తున్నారు. ప్ర‌జాగ‌ళం పేరుతో ఆయ‌న ఎన్నిక‌ల ప్ర‌చారం చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో రాష్ట్ర వ్యాప్తంగా ప‌ర్య‌టిస్తూ.. ప‌లు అంశాల‌ను చ‌ర్చిస్తున్నారు. ఘాటు విమ‌ర్శ‌లు కూడా చేస్తున్నారు. ఇదే స‌మయంలో రెండు కీల‌క అంశాల‌ను ప్ర‌స్తావించారు. కూట‌మి(జ‌న‌సేన‌-బీజేపీ-టీడీపీ) అధికారంలోకి వ‌స్తే.. రైతును రాజును చేస్తామ‌న్నారు.

అంతేకాదు.. రైతుల‌కు ఇప్ప‌టి వ‌ర‌కు రుణాల‌ను ఒకే ఒక్క సంత‌కంతో తీసేస్తామ‌ని చంద్ర‌బాబు ప్ర‌క‌టించారు. నిజానికి ఇది సంచ‌ల‌న ప్ర‌క‌టనే అయినా.. వైసీపీ నుంచి కానీ.. జ‌గ‌న్ నుంచి కానీ పెద్ద‌గా దీనిపై రియాక్ష‌న్ రాలేదు. ప్ర‌జ‌ల్లో మాత్రం చ‌ర్చ జ‌రుగుతోంది. చంద్ర‌బాబు ఇంత పెద్ద హామీ ఇచ్చాక వైసీపీలో అయినా.. చ‌ర్చ జ‌రుగుతుంద‌ని అనుకున్నా జ‌ర‌గ‌లేదు. ఇక‌, రెండోది ఇప్ప‌టి వ‌ర‌కు సామాజిక భ‌ద్ర‌తా పింఛ‌ను కింద ఇస్తున్న రూ.3000ల‌ను రూ.4000ల‌కు పెంచుతామ‌ని చంద్ర‌బాబు చెప్పారు. అంతేకాదు.. ఏప్రిల్‌(జ‌గ‌న్ అధికారంలో ఉన్న కాలం)-జూన్ మ‌ధ్య నుంచే దీనిని పెంచి ఇస్తామ‌ని చంద్ర‌బాబు ప్ర‌క‌టించారు.

అయిన‌ప్ప‌టికీ.. జ‌గ‌న్‌లో కానీ.. వైసీపీలో కానీ.. ఎలాంటి తొట్రుపాటు క‌నిపించ‌లేదు. పైగా ఎదురు దాడి చేశారు. 3000 చొప్పున ఇస్తుంటేనే రాష్ట్రాన్ని శ్రీలంక చేస్తున్నార‌ని యాగీ పెట్టిన చంద్ర‌బాబు ఇప్పుడు రూ.4000 ఇస్తామ‌ని ప్ర‌క‌టించార‌ని.. దీనిని ఎలా న‌మ్మాల‌ని సీఎం జ‌గ‌న్ రెండు రోజుల కింద‌ట క‌నిగిరి స‌భ‌లో ప్ర‌శ్నించారు. క‌ట్ చేస్తే.. ఉగాది సంద‌ర్భంగా చంద్ర‌బాబు చేసిన మ‌రో కీల‌క ప్ర‌క‌ట‌న మాత్రం వైసీపీలో క‌ల‌క‌లం రేపుతోంది. ఇది సీఎం జ‌గ‌న్‌ను డిఫెన్సులో ప‌డేసింద‌నే వాద‌న వినిపిస్తోంది. ఈ విష‌యంలో వెంట‌నే స్పందించ‌డం కూడా గ‌మ‌నార్హం. దీనిని బ‌ట్టి.. చంద్ర‌బాబు ప్ర‌క‌ట‌న‌.. తొలిసారి వైసీపీని షేక్ చేస్తోంద‌ని అంటున్నారు.

అదే.. తాము(కూట‌మి) అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌.. వ‌లంటీర్ల‌ను కొన‌సాగిస్తామ‌ని చంద్ర‌బాబు చెప్ప‌డంతోపాటు.. ప్ర‌స్తుతం వలంటీర్ల‌కు ఇస్తున్న రూ.5000 పారితోషికాన్ని రూ.10000ల‌కు పెంచుతామ‌ని బ‌ల‌మైన హామీ ఇచ్చారు. అంతేకాదు.. ఈ పెంపు తాను అధికారంలోకి వ‌చ్చిన త‌క్ష‌ణ‌మే అమ‌లు చేస్తామ‌న్నారు. ఈ నేప‌థ్యంలో వ‌లంటీర్లు ఎవ‌రూ రాజీనామా చేయొద్ద‌ని పిలుపునిచ్చారు. దీంతో వైసీపీ ఈ విష‌యంలో ఒకింత షేక్ అయింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఎందుకంటే.. ఇప్ప‌టి వ‌ర‌కు వ‌లంటీర్లంటే.. త‌మ వారేన‌ని, తాము గీసిన దాట‌రని భావించిన వైసీపీ.. చంద్ర‌బాబు ప్ర‌క‌ట‌న రూ.10000ల త‌ర్వాత‌.. మాత్రం ఆత్మ ర‌క్ష‌ణ‌లో ప‌డింది. దీనిపై ఒక‌టి రెండు రోజుల్లోనే సీఎం జ‌గ‌న్ ప్ర‌క‌ట‌న చేయ‌నున్న‌ట్టు తెలుస్తోంది.

This post was last modified on April 10, 2024 11:19 am

Share
Show comments
Published by
satya

Recent Posts

దిల్ రాజు చేతిలో 18 కమిట్మెంట్లు

ఎక్కువ సినిమాలు తీస్తున్న నిర్మాణ సంస్థలు ఏవంటే మనకు వెంటనే గుర్తొచ్చే బ్యానర్లు సితార, మైత్రి, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ…

19 mins ago

అల్లు అర్జున్ వివాదం ఎక్కడి దాకా

ఎన్నికలు ముగిసిపోయి ఫలితాలు ఎలా ఉంటాయోననే ఆసక్తితో జనం ఎదురు చూస్తున్న వేళ కేవలం ఒక్క రోజు మద్దతు కోసం…

2 hours ago

కృష్ణమ్మా….ఎంత పని చేశావమ్మా

సినిమా చిన్నదైనా పెద్దదైనా ఫలితం ఎలా వచ్చినా థియేటర్ కు ఓటిటి మధ్య కనీస గ్యాప్ ఉండటం చాలా అవసరం.…

3 hours ago

భువనగిరి : గెలిస్తే ఒక లెక్క .. ఓడితే మరో లెక్క !

శాసనసభ ఎన్నికలలో అనూహ్యంగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి లోక్ సభ ఎన్నికలు పరీక్షగా నిలుస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో…

4 hours ago

ఒక‌రు తీర్థ యాత్ర‌లు.. మ‌రొక‌రు విదేశీ యాత్ర‌లు!

ఏపీలో ఎన్నిక‌లు ముగిసిన త‌ర్వాత‌.. ఒక‌వైపు తీవ్రమైన హింస చెల‌రేగిన విష‌యం తెలిసిందే. ఇదెలా ఉన్నా అధికార, ప్ర‌తిపక్ష నాయ‌కులు…

5 hours ago

పోలీసులు ఏంచేస్తున్నారు.. చంద్ర‌బాబు ఆవేద‌న‌

ఏపీలో జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల పోలింగ్ అనంత‌రం.. ప‌ల్నాడు, తిరుప‌తి, తాడిప‌త్రి ప్రాంతాల్లో చెల‌రేగిన హింస‌పై చంద్ర‌బాబు ఆవేద‌న వ్య‌క్తం…

5 hours ago