లోక్ సభ ఎన్నికల తర్వాత ఏ క్షణాన అయినా, పార్టీ పేరు మార్పు విషయమై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, భారత్ రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కీలక నిర్ణయం తీసుకోవచ్చునట.!
2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత, ‘పార్టీ పేరుని మార్చేయడమే మంచిది..’ అనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమయ్యింది. నిజానికి, ఆ ఎన్నికలకు ముందరే, ‘పార్టీ పేరుని మార్చేద్దాం.. తిరిగి తెలంగాణ రాష్ట్ర సమితి అనే పెట్టుకుందాం..’ అని కేసీయార్కి కొందరు పార్టీ కీలక నేతలు సూచన చేశారు.
అయితే, జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పే దిశగా తెలంగాణ రాష్ట్ర సమితిని భారత్ రాష్ట్ర సమితిగా మార్చిన కేసీయార్, తిరిగి తెలంగాణ రాష్ట్ర సమితి పేరుని తీసుకొచ్చేందుకు అంత సానుకూలత వ్యక్తం చేయలేదు.
కానీ, ఇప్పుడు పార్టీ పేరు మార్చక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే, ‘తెలంగాణ అంటే టీఆఆర్ఎస్.. టీఆర్ఎస్ అంటే తెలంగాణ.. పార్టీ పేరు నుంచి తెలంగాణ మాయమయ్యాక.. గులాబీ పార్టీని తమదిగా భావించలేకపోతున్నాం..’ అన్న భావన తెలంగాణ పల్లెల్లో గులాబీ పార్టీ సానుభూతి పరులనుంచే వ్యక్తమవుతోంది.
ఇప్పటికే, పేరు మార్పు విషయమై సాధ్యాసాధ్యాల పరిశీలన జరిగిందనీ, ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో వున్నందున, కాస్త వేచి చూద్దామని పార్టీ ముఖ్య నేతలకు కేసీయార్ సూచించారట.
పేరు మార్చితే గులాబీ పార్టీ ఫేటు మారుతుందా.? అంటే, మారే అవకాశాలైతే లేకపోలేదు. భారత్ రాష్ట్ర సమితి పేరుని గులాబీ శ్రేణులే ఓన్ చేసుకోలేని పరిస్థితిని కేసీయార్ ముందే అంచనా వేయకపోవడం వ్యూహాత్మక తప్పిదమే.! తెలంగాణ రాష్ట్ర సమితి.. ఇది తెలంగాణ ఇంటి పార్టీ అన్న భావన తెలంగాణ సమాజంలో ఖచ్చితంగా కలుగుతుంది.
This post was last modified on April 6, 2024 6:22 pm
మంచి నటన, చలాకీతనం, అందం అన్నీ ఉన్నా కార్తీ విషయంలో జరుగుతున్న పరిణామాలు అభిమానులను తెగ కలవరపెడుతున్నాయి. సరైన హిట్…
విశాఖపట్నంలో జరగనున్న కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ ఆశలు గల్లంతవుతున్నాయి. గతంలో ఉన్న పట్టు.. ఇప్పుడు లేకపోవడం.. గతంలో సాయిరెడ్డి వంటి…
టాలెంట్ ఎంత ఉన్నా సక్సెస్ విషయంలో పోరాడుతూనే ఉన్న హీరోల్లో సుహాస్ ఒకడు. కలర్ ఫోటోకు జాతీయ అవార్డు వచ్చినా…
పహల్గామ్ ఉగ్రదాడి విషయంలో భారత్కు అంతర్జాతీయ వేదికపై కీలక మద్దతు లభించింది. ఢిల్లీలో జరిగిన బ్రిక్స్ సదస్సులో ఆమోదించిన న్యూఢిల్లీ…
రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మక స్థానాల్లో గుంటూరు మేయర్ స్థానం ఒకటి. విజయవాడ, గుంటూరు కార్పొరేషన్లు అమరావతి రాజధాని పరిసరాల్లో ఉండటంతో…
వ్యూహాల కలిమి.. నాయకుల చెలిమి ఏ పార్టీకైనా అత్యంత అవసరం. ఈ విషయంలో వైసీపీ చేస్తున్న వ్వవహారం.. పార్టీని దుంపనాశనం…