Political News

విశాఖలో భారీ టైర్ల ప్లాంట్… రూ. 1240 కోట్ల పెట్టుబడి

ఏపికి శుభవార్తనే చెప్పాలి. విశాఖపట్నంలో అచ్యుతాపురం పారిశ్రామికవాడలో జపాన్ పారిశ్రామిక దిగ్గజం యోకోహామా ఓ టైర్ల ప్లాంటును ఏర్పాటు చేయటానికి రెడీ అయిపోయింది. యోకోహామా లో భాగమైన అలయన్స్ టైర్ గ్రూపు ప్లాంటు ఏర్పాటును దగ్గరుండి మరీ పర్యవేక్షించబోతోంది. సుమారు రూ. 1240 కోట్ల పెట్టుబడితో ఈ ప్లాంటు రెడీ చేయబోతున్నట్లు యోకోహామా ఇండియా ఛైర్మన్ నితిన్ మంత్రి స్వయంగా చెప్పారు. దాంతో టైర్ల ప్లాంటు ఏర్పాటు ఖాయమనే అనిపిస్తోంది.

వైజాగ్ పారిశ్రామికవాడలో ఏర్పాటు చేయబోతున్న ప్లాంటులో కొత్తగా 600 మందికి ఉద్యోగాలు ఇవ్వబోతున్నట్లు కూడా మంత్రి చెప్పారు. మనదేశంలోని గుజరాత్, తమిళనాడులో ఇఫ్పటికే రెండు ప్లాంట్లు పనిచేస్తున్నాయి. తమిళనాడు ప్లాంటుకు అనుబంధంగా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విభాగం కూడా ప్రత్యేకంగా ఉంది. అంటే వైజాగ్ లో ఏర్పాటు చేయబోయే ప్లాంటు మూడోదన్నమాట. ఇప్పటకే సుమారు ఈ కంపెనీ 5 వేలమందికి ప్రత్యక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించింది.

మూడో ప్లాంటు ఏర్పాటుకు అనువైన ప్రాంతాన్ని అన్వేషించటంలో భాగంగా వైజాగ్ ను గుర్తించినట్లు మంత్రి చెప్పారు. అయితే కరోనా వైరస్ కారణంగా దాదాపు ఐదుమాసాలు ఆలస్యమైందని కూడా చెప్పారు. విశాఖలో ఏర్పాటు చేయబోయే ప్లాంటు 2023కి ఉత్పత్తికి రెడీ అవుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం గుజరాత్, తమిళనాడులో ఉన్న ప్లాంట్ల ఏడాది ఉత్పత్తి సామర్ధ్యం 2.3 లక్షల టన్నులుంటుందని చెప్పారు. వైజాగ్ ప్లాంటు ఉత్పత్తి సామర్ధ్యం 20 వేల టన్నులుంటుందని అంచనా వేశారు.

తమ ప్లాంటులో తయారయ్యే టైర్లు ప్రధానంగా వ్యవసాయ ఉత్పత్తుల్లో వాడేవి, పారిశ్రామిక రంగంలో ఉపయోగించేవి, అటవీ ప్రాంతాల్లో ఉపయోగించే పద్దతుల్లో తయారవుతాయని చెప్పారు. ప్రస్తుత ప్లాంట్లలో తయారయ్యే టైర్లు 120 దేశాలకు ఎగుమతి అవుతున్నట్లు చెప్పారు.

This post was last modified on September 14, 2020 11:52 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజమౌళి, మహేష్ కొట్టుకోవడమేంటయ్యా

దర్శక ధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కలిసి సినిమా చేయాలని వాళ్లిద్దరి అభిమానులు ఎన్నో ఏళ్ల ముందు…

3 minutes ago

మున్నా మంచి స్ట్రాటజీ వాడుతున్నాడు

మాములుగా రీ రిలీజులు ఏవి ఆడతాయో ఏవి ఆడవో అంత ఈజీగా చెప్పలేని పరిస్థితి నెలకొంది. గత ఏడాది ఖలేజాని…

21 minutes ago

ఇలాంటిది వేరే మతంలో జరిగి ఉంటే?: పవన్

తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి అంశం జాతీయ స్థాయిలో దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆ టాపిక్ పై…

3 hours ago

చరణ్‌పై మచ్చ పడనివ్వని అల్లు శిరీష్

మెగా, అల్లు బంధం మీద ఎప్పటికప్పుడు రకరకాల ఊహాగానాలు, అనుమానాలు వస్తూనే ఉంటాయి. ఇరు కుటుంబాల మధ్య సంబంధాలు ఒకప్పట్లా…

5 hours ago

టీమిండియా సెమీస్ చేరాలంటే ఏం జరగాలి?

జింబాబ్వేపై వెస్టిండీస్ భారీ గెలుపు తర్వాత భారత్ సెమీస్ అవకాశాలు ఇప్పుడు పక్కా లెక్కల మీద ఆధారపడి ఉన్నాయి. నెట్…

5 hours ago

దురంధర్ టీమ్ భలే స్ట్రోక్ ఇచ్చింది

ప్రాణానికి ప్రాణం అనేది పాత సామెత. స్ట్రోకుకు స్ట్రోకు కొత్త ట్రెండ్. ఇటీవలే ఒక ఇంటర్నేషనల్ మ్యాగజైన్ కు చెందిన…

6 hours ago