ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష పార్టీలను మించి అధికార పార్టీకి తలనొప్పిగా మారారు ఎంపీ రఘురామ కృష్ణంరాజు. వైసీపీ నుంచే ఎంపీగా గెలిచిన ఆయన ఏడాది తిరిగేసరికి పార్టీ రెబల్గా మారిపోయారు. గత కొన్ని నెలలుగా అధికార పార్టీని ఇరుకున పెట్టేలా విమర్శలు, ప్రశ్నలు, ఆరోపణలతో ఆయన చెలరేగిపోతున్నారు. వాటికి సమాధానం చెప్పలేక వైకాపా నేతలు సతమతం అయిపోతున్నారు.
తాజాగా ఆయన అమరావతి రైతుల తరఫున మాట్లాడుతూ.. అధికార పార్టీకి సవాళ్లు విసురుతున్న సంగతి తెలిసిందే. తనను రాజీనామా చేయమంటున్న వైకాపా నేతలకు బదులిస్తూ.. అమరావతి నుంచి రాజధానిని తరలించడంపై తాను రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేస్తానని, తాను గెలిస్తే రాజధానికి అమరావతిలోనే కొనసాగిస్తారా అని ఆయన సవాలు విసిరిన సంగతి తెలిసిందే. దీనికి మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. రఘురామకృష్ణరాజు రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్తే వెళ్లనివ్వండని, ఆయన రాజీనామాతో పార్టీకి ఏం సంబంధం.. అదేమైనా రిఫరెండమా.. అని బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు.
ఈ నేపథ్యంలో రఘురామ మరోసారి స్పందించారు. అమరావతిపై రిఫరెండంగా ఎన్నిక జరిగితే.. కనీసం లక్ష ఓట్ల మెజార్టీతో విజయం సాధిస్తానని రఘురామరాజు ధీమా వ్యక్తం చేశారు.మరోసారి ఈ విషయంలో తాను సవాల్ చేస్తున్నానని, అధికార పార్టీ నేతలు స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. సీఎం జగన్ రమ్మంటేనే తాను వైసీపీలోకి వచ్చానని, తమ మధ్య విభేదాలకు కారణం ఇతరులకు తెలియదని ఆయనన్నారు. రాజీనామాపై మంత్రి బొత్స సత్యనారాయణ లాంటి మంత్రులు ప్రకటనలు చేయడం సరికాదని ఆయనన్నారు.
This post was last modified on September 14, 2020 12:50 pm
రాజమండ్రిలో నిర్వహించిన కూటమి పార్టీల(జనసేన-బీజేపీ-టీడీపీ) ఎన్నికల ప్రచార సభ 'ప్రజాగళం'లో చంద్రబాబు పాల్గొన లేక పోయారు. ఆయన వేరే సభలో…
మాములుగా కమెడియన్లు హీరోలు కావడం గతంలో ఎన్నో చూశాం. చూస్తున్నాం. కానీ మధ్యవయసు దాటిన క్యారెక్టర్ ఆర్టిస్టులు కథానాయకులుగా మారడం…
ఏపీలో డబుల్ ఇంజన్ సర్కారు రానుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమే కేంద్రంలోనూ…
ఆంధ్రప్రదేశ్లో కొన్ని వారాల నుంచి ఎన్నికల కమిషన్ కొరఢా ఝళిపిస్తూ ఉంది. ఎన్నికల సమయంలో తమ పరిధి దాటి వ్యవహరిస్తున్న…
కుర్ర హీరోల్లో వేగంగా మార్కెట్ పడిపోయిన వాళ్ళలో రాజ్ తరుణ్ పేరు మొదటగా చెప్పుకోవాలి. కెరీర్ ప్రారంభంలో కుమారి 21…
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. గత ఏడాది ఏపీలో జగన్ సర్కారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి చట్టం. ఇప్పుడీ చట్టం ఎన్నికల ముంగిట…