Political News

ర‌ఘురామ స‌వాల్.. ల‌క్ష ఓట్ల మెజారిటీతో గెలుస్తా

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్ర‌తిప‌క్ష పార్టీల‌ను మించి అధికార పార్టీకి త‌ల‌నొప్పిగా మారారు ఎంపీ ర‌ఘురామ ‌కృష్ణంరాజు. వైసీపీ నుంచే ఎంపీగా గెలిచిన ఆయ‌న ఏడాది తిరిగేస‌రికి పార్టీ రెబల్‌గా మారిపోయారు. గ‌త కొన్ని నెల‌లుగా అధికార పార్టీని ఇరుకున పెట్టేలా విమ‌ర్శ‌లు, ప్ర‌శ్న‌లు, ఆరోప‌ణ‌ల‌తో ఆయ‌న చెల‌రేగిపోతున్నారు. వాటికి స‌మాధానం చెప్ప‌లేక వైకాపా నేత‌లు స‌త‌మ‌తం అయిపోతున్నారు.

తాజాగా ఆయ‌న అమ‌రావ‌తి రైతుల త‌ర‌ఫున మాట్లాడుతూ.. అధికార పార్టీకి స‌వాళ్లు విసురుతున్న సంగ‌తి తెలిసిందే. త‌న‌ను రాజీనామా చేయ‌మంటున్న వైకాపా నేత‌ల‌కు బ‌దులిస్తూ.. అమ‌రావ‌తి నుంచి రాజ‌ధానిని త‌ర‌లించ‌డంపై తాను రాజీనామా చేసి ఎన్నిక‌ల్లో పోటీ చేస్తాన‌ని, తాను గెలిస్తే రాజ‌ధానికి అమ‌రావ‌తిలోనే కొన‌సాగిస్తారా అని ఆయ‌న స‌వాలు విసిరిన సంగ‌తి తెలిసిందే. దీనికి మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ స్పందించారు. రఘురామకృష్ణరాజు రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్తే వెళ్లనివ్వండని, ఆయన రాజీనామాతో పార్టీకి ఏం సంబంధం.. అదేమైనా రిఫరెండమా.. అని బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు.

ఈ నేప‌థ్యంలో ర‌ఘురామ మ‌రోసారి స్పందించారు. అమరావతిపై రిఫరెండంగా ఎన్నిక జరిగితే.. కనీసం లక్ష ఓట్ల మెజార్టీతో విజయం సాధిస్తానని రఘురామరాజు ధీమా వ్యక్తం చేశారు.మ‌రోసారి ఈ విష‌యంలో తాను స‌వాల్ చేస్తున్నాన‌ని, అధికార పార్టీ నేత‌లు స్పందించాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. సీఎం జగన్ రమ్మంటేనే తాను వైసీపీలోకి వచ్చానని, తమ మధ్య విభేదాలకు కారణం ఇత‌రుల‌కు తెలియ‌ద‌ని ఆయ‌న‌న్నారు. రాజీనామాపై మంత్రి బొత్స సత్యనారాయణ లాంటి మంత్రులు ప్రకటనలు చేయడం సరికాదని ఆయ‌న‌న్నారు.

This post was last modified on September 14, 2020 12:50 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పవన్, ఫాన్స్ ఉన్నారు… హైప్ వస్తుందిలే

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి కేవలం ఎనిమిది నెలల్లో మూడో సినిమా రాబోతోంది. గత ఏడాది రెండు నెలల…

2 hours ago

డెవిల్ పాట మీద బూతు వివాదం

కాదేది బూతుకు అనర్హం అన్నారో సినీ కవి. కొందరు దీన్ని నిజం చేసే పనిలో ఉన్నారు. ఇటీవలే కన్నడ ప్యాన్…

4 hours ago

40 ఏళ్ల బంధాన్ని తెంచుకుంటున్నారా?

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆ పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. దీనిపై ఇటీవలి…

5 hours ago

టికెట్ రేట్ల పెంపు లేదు… అయినా హ్యాపీనే

తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు జిఓ కోసం ఎదురు చూసిన మైత్రి సంస్థకు చివరికి అది జరిగే సూచనలు లేకపోవడంతో…

5 hours ago

SRH ఈ హెచ్చరికలు వినాల్సిందే..

'ద హండ్రెడ్' వేలంలో పాకిస్థాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్‌ను సన్‌రైజర్స్ లీడ్స్ కొనుగోలు చేయడం ఊహించని వివాదానికి దారితీస్తోంది. ఈ…

7 hours ago

మీరు కాల్చండి.. నేను చూసుకుంటా. అని ఎవరన్నారు?

రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ స్థాయిలో కూడా సంచలనంగా మారిన మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ పార్టీ వ్యవహారం…

11 hours ago