Political News

ర‌ఘురామ స‌వాల్.. ల‌క్ష ఓట్ల మెజారిటీతో గెలుస్తా

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్ర‌తిప‌క్ష పార్టీల‌ను మించి అధికార పార్టీకి త‌ల‌నొప్పిగా మారారు ఎంపీ ర‌ఘురామ ‌కృష్ణంరాజు. వైసీపీ నుంచే ఎంపీగా గెలిచిన ఆయ‌న ఏడాది తిరిగేస‌రికి పార్టీ రెబల్‌గా మారిపోయారు. గ‌త కొన్ని నెల‌లుగా అధికార పార్టీని ఇరుకున పెట్టేలా విమ‌ర్శ‌లు, ప్ర‌శ్న‌లు, ఆరోప‌ణ‌ల‌తో ఆయ‌న చెల‌రేగిపోతున్నారు. వాటికి స‌మాధానం చెప్ప‌లేక వైకాపా నేత‌లు స‌త‌మ‌తం అయిపోతున్నారు.

తాజాగా ఆయ‌న అమ‌రావ‌తి రైతుల త‌ర‌ఫున మాట్లాడుతూ.. అధికార పార్టీకి స‌వాళ్లు విసురుతున్న సంగ‌తి తెలిసిందే. త‌న‌ను రాజీనామా చేయ‌మంటున్న వైకాపా నేత‌ల‌కు బ‌దులిస్తూ.. అమ‌రావ‌తి నుంచి రాజ‌ధానిని త‌ర‌లించ‌డంపై తాను రాజీనామా చేసి ఎన్నిక‌ల్లో పోటీ చేస్తాన‌ని, తాను గెలిస్తే రాజ‌ధానికి అమ‌రావ‌తిలోనే కొన‌సాగిస్తారా అని ఆయ‌న స‌వాలు విసిరిన సంగ‌తి తెలిసిందే. దీనికి మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ స్పందించారు. రఘురామకృష్ణరాజు రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్తే వెళ్లనివ్వండని, ఆయన రాజీనామాతో పార్టీకి ఏం సంబంధం.. అదేమైనా రిఫరెండమా.. అని బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు.

ఈ నేప‌థ్యంలో ర‌ఘురామ మ‌రోసారి స్పందించారు. అమరావతిపై రిఫరెండంగా ఎన్నిక జరిగితే.. కనీసం లక్ష ఓట్ల మెజార్టీతో విజయం సాధిస్తానని రఘురామరాజు ధీమా వ్యక్తం చేశారు.మ‌రోసారి ఈ విష‌యంలో తాను స‌వాల్ చేస్తున్నాన‌ని, అధికార పార్టీ నేత‌లు స్పందించాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. సీఎం జగన్ రమ్మంటేనే తాను వైసీపీలోకి వచ్చానని, తమ మధ్య విభేదాలకు కారణం ఇత‌రుల‌కు తెలియ‌ద‌ని ఆయ‌న‌న్నారు. రాజీనామాపై మంత్రి బొత్స సత్యనారాయణ లాంటి మంత్రులు ప్రకటనలు చేయడం సరికాదని ఆయ‌న‌న్నారు.

This post was last modified on September 14, 2020 12:50 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

క‌విత న‌న్ను ప‌దికోట్లు అడిగారు: పాల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ప్ర‌జాశాంతి పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు, ప్ర‌ముఖ సువార్తీకుడు కేఏ పాల్‌.. తాజాగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణ ర‌క్ష‌ణ సేన‌(టీఆర్ఎస్‌) పార్టీ…

48 minutes ago

మ‌మ‌త ప‌రిస్థితి.. ఏపీకి పాఠం అవుతుందా?!

త‌మ్ముడు త‌మ్ముడే.. రాజ‌కీయం రాజ‌కీయ‌మే.. బీజేపీ విష‌యంలో ఇది అక్ష‌రాలా నిజం. త‌న‌కు అవ‌కాశం లేనంత సేపూ.. ఆ పార్టీ…

3 hours ago

‘అడ్డంకులెన్నైనా.. ఆకివీడు రామాలయ నిర్మాణం ఆగదు’

ఏపీలో మతపరమైన వివాదాలకు కేంద్రంగా మారిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో ఆదివారం ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది.…

4 hours ago

కెపాసిటీ లేకే ర‌జినీ సినిమా వ‌దిలేశా

సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్ హీరోగా లోక‌నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్ నిర్మించే సినిమా ద‌ర్శ‌కుడి ఎంపిక విష‌యంలో ఎంత త‌ల‌నొప్పి ఎదురైందో…

5 hours ago

తొలిసారి బాల‌య్య‌తో అనిరుధ్‌?

టాలీవుడ్లో ఇప్ప‌టికే ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ లాంటి అగ్ర క‌థానాయ‌కుల‌తో పాటు నాని, విజ‌య్…

6 hours ago

పవన్ వచ్చాక పిఠాపురంలో ఏం చేశారు?

ఉమ్మ‌డి తూర్పు గోదావ‌రి జిల్లాలోని పిఠాపురం నియోజ‌కవ‌ర్గం నుంచి తొలిసారి పోటీ చేసిన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ 2024…

7 hours ago