ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష పార్టీలను మించి అధికార పార్టీకి తలనొప్పిగా మారారు ఎంపీ రఘురామ కృష్ణంరాజు. వైసీపీ నుంచే ఎంపీగా గెలిచిన ఆయన ఏడాది తిరిగేసరికి పార్టీ రెబల్గా మారిపోయారు. గత కొన్ని నెలలుగా అధికార పార్టీని ఇరుకున పెట్టేలా విమర్శలు, ప్రశ్నలు, ఆరోపణలతో ఆయన చెలరేగిపోతున్నారు. వాటికి సమాధానం చెప్పలేక వైకాపా నేతలు సతమతం అయిపోతున్నారు.
తాజాగా ఆయన అమరావతి రైతుల తరఫున మాట్లాడుతూ.. అధికార పార్టీకి సవాళ్లు విసురుతున్న సంగతి తెలిసిందే. తనను రాజీనామా చేయమంటున్న వైకాపా నేతలకు బదులిస్తూ.. అమరావతి నుంచి రాజధానిని తరలించడంపై తాను రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేస్తానని, తాను గెలిస్తే రాజధానికి అమరావతిలోనే కొనసాగిస్తారా అని ఆయన సవాలు విసిరిన సంగతి తెలిసిందే. దీనికి మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. రఘురామకృష్ణరాజు రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్తే వెళ్లనివ్వండని, ఆయన రాజీనామాతో పార్టీకి ఏం సంబంధం.. అదేమైనా రిఫరెండమా.. అని బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు.
ఈ నేపథ్యంలో రఘురామ మరోసారి స్పందించారు. అమరావతిపై రిఫరెండంగా ఎన్నిక జరిగితే.. కనీసం లక్ష ఓట్ల మెజార్టీతో విజయం సాధిస్తానని రఘురామరాజు ధీమా వ్యక్తం చేశారు.మరోసారి ఈ విషయంలో తాను సవాల్ చేస్తున్నానని, అధికార పార్టీ నేతలు స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. సీఎం జగన్ రమ్మంటేనే తాను వైసీపీలోకి వచ్చానని, తమ మధ్య విభేదాలకు కారణం ఇతరులకు తెలియదని ఆయనన్నారు. రాజీనామాపై మంత్రి బొత్స సత్యనారాయణ లాంటి మంత్రులు ప్రకటనలు చేయడం సరికాదని ఆయనన్నారు.
This post was last modified on September 14, 2020 12:50 pm
ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…
ఏపీ మాజీ సీఎం జగన్ తన పాలనలో ప్రజా పర్యటనల సందర్భంగా పరదాలు లేనిదే అడుగు బయటపెట్టరు అన్న టాక్…
ఏడాది కిందట అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ళల పెళ్లి జరిగింది. సన్నిహితుల మధ్య కొంచెం సింపుల్గా పెళ్లి చేసుకుంది ఈ…
విరాట్ కోహ్లీ సెంచరీ కొట్టాడంటే టీమిండియా గెలిచినట్టే అని ఒక నమ్మకం ఉంది. కానీ రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో…
ఎప్పుడూ లేనిది ఒక పెద్ద హీరోకు తెలంగాణ టికెట్ రేట్ల పెంపు బాగా ఆలస్యమయ్యింది. జూబ్లీ హిల్స్ ఎన్నికల ప్రచారంలో…
నందమూరి బాలకృష్ణ-బోయపాటి శ్రీనుల కలయికలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ‘అఖండ’లో ప్రగ్యా జైశ్వాల్ కథానాయికగా నటించిన సంగతి తెలిసిందే.…