ఏపీలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఈ సందర్భంగా వలంటీర్ల వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా వివాదంగా మారింది. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వలంటీర్లను ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే వలంటీర్లను దూరం పెట్టింది. అయితే.. వారితో పార్టీ కార్యక్రమాలు చేయించుకుంటున్నారు. వారికి ఇచ్చే రెమ్యునరేషన్ను రూ.20 వేలకు పెంచారు. ఈ మొత్తాన్ని అభ్యర్థులే ఇచ్చి.. వారితో ఈ రెండు నెలలు పనిచేయించుకోవాలని కూడా పార్టీ అనధికారికంగా సూచించింది.
ఇప్పుడు వలంటీర్లు ఇలానే చేస్తున్నారు. అయితే.. అనూహ్యంగా చిత్తూరు జిల్లాలో 33 మంది వలంటీర్లను ప్రభుత్వం రాత్రికి రాత్రే విధుల నుంచి తొలగించింది. ఇది ఇప్పడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. వీరిలో చిత్తూరు కార్పొరేషన్ లో 18 మంది, పలమనేరు మున్సిపాలిటీలో 12 మంది, గుడిపాల మండపంలో ముగ్గురు ఉన్నారు. ప్రభుత్వం అప్పగించిన పనులను సక్రమంగా చేయలేదన్న కారణంగానే వీరిని తొలగించినట్టు అధికారులు చెపుతున్నారు.
అయితే.. వలంటీర్ల తొలగింపు రాజకీయంగా వివాదం సృష్టించింది. టీడీపీ సహా జనసేన, ఇతర విపక్ష పార్టీల నేతలు మండిపడుతున్నారు. నిష్పక్షపాతంగా పని చేస్తున్న వాలంటీర్లను తొలగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీకి అనుకూలంగా వ్యవహరించని వాలంటీర్లపై కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. అయితే.. దీనిపై వైసీపీ నేతల నుంచి ఎలాంటి ప్రకటనా రాలేదు. ఇదిలావుంటే.. ప్రస్తుతం వలంటీర్ల వ్యవస్థ దాదాపు రద్దయినట్టేనని అధికారులు చెబుతున్నారు. వచ్చే నెల 1 వ తేదీన సచివాలయ సిబ్బందే పింఛన్లు పంపిణీ చేస్తారని వెల్లడించారు.
This post was last modified on March 18, 2024 2:07 pm
ఏపీ సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. వైసీపీ హయాంలో వేధింపులకు గురై.. దాదాపు ఐదేళ్లపాటు సస్పెన్షన్ లో ఉన్న…
కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశ పెట్టిన బడ్జెట్లో ప్రధానంగా నాలుగు యాంగిల్స్ కనిపించాయి. ఈ విషయాన్ని బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర…
ఇప్పుడంతా డిజిటల్ మయం. ప్రతిదీ హార్డ్ డిస్కుల్లోకి వెళ్ళిపోతుంది. చిన్న డేటాతో మొదలుపెట్టి వందల జిబి డిమాండ్ చేసే సినిమా…
సినిమాల పరంగా బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్కు ‘మిస్టర్ పర్ఫెక్షనిస్ట్’ అని పేరుంది. కానీ వ్యక్తిగా తాను పర్ఫెక్ట్…
తెలంగాణలో శనివారం ఒక్కసారిగా పెను కలకలమే రేగింది. శుక్రవారం రాత్రి హైదరాబాద్ లోని ఓ హోటల్ లో జరిగినట్లుగా భావిస్తున్న…
కేంద్రం ప్రవేశ పెట్టిన 2025-26 వార్షిక బడ్జెట్పై ఏపీ సీఎం, కేంద్రంలోని ఎన్డీయే సర్కారు భాగస్వామి చంద్రబాబు హర్షం వ్యక్తం…