Political News

ప‌దుల సంఖ్య‌లో వ‌లంటీర్ల‌ను తొలిగింపు

ఏపీలో ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లోకి వ‌చ్చింది. ఈ సంద‌ర్భంగా వ‌లంటీర్ల వ్య‌వ‌హారం రాష్ట్ర వ్యాప్తంగా వివాదంగా మారింది. ఇప్ప‌టికే కేంద్ర ఎన్నిక‌ల సంఘం వ‌లంటీర్ల‌ను ఎన్నిక‌ల విధుల‌కు దూరంగా ఉంచాల‌ని ఆదేశాలు జారీ చేసింది. దీంతో రాష్ట్ర ప్ర‌భుత్వం ఇప్ప‌టికే వ‌లంటీర్ల‌ను దూరం పెట్టింది. అయితే.. వారితో పార్టీ కార్య‌క్ర‌మాలు చేయించుకుంటున్నారు. వారికి ఇచ్చే రెమ్యునరేష‌న్‌ను రూ.20 వేల‌కు పెంచారు. ఈ మొత్తాన్ని అభ్య‌ర్థులే ఇచ్చి.. వారితో ఈ రెండు నెల‌లు ప‌నిచేయించుకోవాల‌ని కూడా పార్టీ అన‌ధికారికంగా సూచించింది.

ఇప్పుడు వ‌లంటీర్లు ఇలానే చేస్తున్నారు. అయితే.. అనూహ్యంగా చిత్తూరు జిల్లాలో 33 మంది వ‌లంటీర్లను ప్ర‌భుత్వం రాత్రికి రాత్రే విధుల నుంచి తొల‌గించింది. ఇది ఇప్ప‌డు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. వీరిలో చిత్తూరు కార్పొరేషన్ లో 18 మంది, పలమనేరు మున్సిపాలిటీలో 12 మంది, గుడిపాల మండపంలో ముగ్గురు ఉన్నారు. ప్రభుత్వం అప్పగించిన పనులను సక్రమంగా చేయలేదన్న కారణంగానే వీరిని తొలగించినట్టు అధికారులు చెపుతున్నారు.

అయితే.. వ‌లంటీర్ల తొల‌గింపు రాజ‌కీయంగా వివాదం సృష్టించింది. టీడీపీ స‌హా జ‌న‌సేన‌, ఇత‌ర‌ విపక్ష పార్టీల నేతలు మండిపడుతున్నారు. నిష్పక్షపాతంగా పని చేస్తున్న వాలంటీర్లను తొలగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీకి అనుకూలంగా వ్యవహరించని వాలంటీర్లపై కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. అయితే.. దీనిపై వైసీపీ నేత‌ల నుంచి ఎలాంటి ప్ర‌క‌ట‌నా రాలేదు. ఇదిలావుంటే.. ప్ర‌స్తుతం వలంటీర్ల వ్య‌వ‌స్థ దాదాపు ర‌ద్ద‌యిన‌ట్టేన‌ని అధికారులు చెబుతున్నారు. వ‌చ్చే నెల 1 వ తేదీన స‌చివాల‌య సిబ్బందే పింఛ‌న్లు పంపిణీ చేస్తార‌ని వెల్ల‌డించారు.

This post was last modified on March 18, 2024 2:07 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

26 minutes ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

4 hours ago

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

8 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

8 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

10 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

10 hours ago