Political News

ప‌దుల సంఖ్య‌లో వ‌లంటీర్ల‌ను తొలిగింపు

ఏపీలో ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లోకి వ‌చ్చింది. ఈ సంద‌ర్భంగా వ‌లంటీర్ల వ్య‌వ‌హారం రాష్ట్ర వ్యాప్తంగా వివాదంగా మారింది. ఇప్ప‌టికే కేంద్ర ఎన్నిక‌ల సంఘం వ‌లంటీర్ల‌ను ఎన్నిక‌ల విధుల‌కు దూరంగా ఉంచాల‌ని ఆదేశాలు జారీ చేసింది. దీంతో రాష్ట్ర ప్ర‌భుత్వం ఇప్ప‌టికే వ‌లంటీర్ల‌ను దూరం పెట్టింది. అయితే.. వారితో పార్టీ కార్య‌క్ర‌మాలు చేయించుకుంటున్నారు. వారికి ఇచ్చే రెమ్యునరేష‌న్‌ను రూ.20 వేల‌కు పెంచారు. ఈ మొత్తాన్ని అభ్య‌ర్థులే ఇచ్చి.. వారితో ఈ రెండు నెల‌లు ప‌నిచేయించుకోవాల‌ని కూడా పార్టీ అన‌ధికారికంగా సూచించింది.

ఇప్పుడు వ‌లంటీర్లు ఇలానే చేస్తున్నారు. అయితే.. అనూహ్యంగా చిత్తూరు జిల్లాలో 33 మంది వ‌లంటీర్లను ప్ర‌భుత్వం రాత్రికి రాత్రే విధుల నుంచి తొల‌గించింది. ఇది ఇప్ప‌డు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. వీరిలో చిత్తూరు కార్పొరేషన్ లో 18 మంది, పలమనేరు మున్సిపాలిటీలో 12 మంది, గుడిపాల మండపంలో ముగ్గురు ఉన్నారు. ప్రభుత్వం అప్పగించిన పనులను సక్రమంగా చేయలేదన్న కారణంగానే వీరిని తొలగించినట్టు అధికారులు చెపుతున్నారు.

అయితే.. వ‌లంటీర్ల తొల‌గింపు రాజ‌కీయంగా వివాదం సృష్టించింది. టీడీపీ స‌హా జ‌న‌సేన‌, ఇత‌ర‌ విపక్ష పార్టీల నేతలు మండిపడుతున్నారు. నిష్పక్షపాతంగా పని చేస్తున్న వాలంటీర్లను తొలగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీకి అనుకూలంగా వ్యవహరించని వాలంటీర్లపై కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. అయితే.. దీనిపై వైసీపీ నేత‌ల నుంచి ఎలాంటి ప్ర‌క‌ట‌నా రాలేదు. ఇదిలావుంటే.. ప్ర‌స్తుతం వలంటీర్ల వ్య‌వ‌స్థ దాదాపు ర‌ద్ద‌యిన‌ట్టేన‌ని అధికారులు చెబుతున్నారు. వ‌చ్చే నెల 1 వ తేదీన స‌చివాల‌య సిబ్బందే పింఛ‌న్లు పంపిణీ చేస్తార‌ని వెల్ల‌డించారు.

This post was last modified on March 18, 2024 2:07 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రెహమాన్ నిజంగా లైవ్ ఇస్తున్నారా

పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…

7 hours ago

4 ల‌క్ష‌ల క‌లెక్షన్… థియేట‌ర్‌కు 10 వేలు

తెలంగాణ‌లోని సింగిల్ థియేట‌ర్ల‌లో అద్దె విధానానికి స్వ‌స్తి ప‌లికి ప‌ర్సంటేజీ ప‌ద్ధ‌తిని తీసుకురావాల‌ని ఇక్క‌డి ఎగ్జిబిట‌ర్లు ఎప్ప‌ట్నుంచో డిమాండ్ చేస్తూ…

7 hours ago

స్నాక్ ప్యాకెట్లకు కలర్ కరువైంది

తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…

8 hours ago

సూపర్ నిర్ణయం… GO వచ్చినా పాత రేట్లే

తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…

10 hours ago

నానితో క్లాష్… మెగాస్టార్ ఒప్పుకోరేమో

అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…

10 hours ago

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

11 hours ago