Political News

ప‌దుల సంఖ్య‌లో వ‌లంటీర్ల‌ను తొలిగింపు

ఏపీలో ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లోకి వ‌చ్చింది. ఈ సంద‌ర్భంగా వ‌లంటీర్ల వ్య‌వ‌హారం రాష్ట్ర వ్యాప్తంగా వివాదంగా మారింది. ఇప్ప‌టికే కేంద్ర ఎన్నిక‌ల సంఘం వ‌లంటీర్ల‌ను ఎన్నిక‌ల విధుల‌కు దూరంగా ఉంచాల‌ని ఆదేశాలు జారీ చేసింది. దీంతో రాష్ట్ర ప్ర‌భుత్వం ఇప్ప‌టికే వ‌లంటీర్ల‌ను దూరం పెట్టింది. అయితే.. వారితో పార్టీ కార్య‌క్ర‌మాలు చేయించుకుంటున్నారు. వారికి ఇచ్చే రెమ్యునరేష‌న్‌ను రూ.20 వేల‌కు పెంచారు. ఈ మొత్తాన్ని అభ్య‌ర్థులే ఇచ్చి.. వారితో ఈ రెండు నెల‌లు ప‌నిచేయించుకోవాల‌ని కూడా పార్టీ అన‌ధికారికంగా సూచించింది.

ఇప్పుడు వ‌లంటీర్లు ఇలానే చేస్తున్నారు. అయితే.. అనూహ్యంగా చిత్తూరు జిల్లాలో 33 మంది వ‌లంటీర్లను ప్ర‌భుత్వం రాత్రికి రాత్రే విధుల నుంచి తొల‌గించింది. ఇది ఇప్ప‌డు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. వీరిలో చిత్తూరు కార్పొరేషన్ లో 18 మంది, పలమనేరు మున్సిపాలిటీలో 12 మంది, గుడిపాల మండపంలో ముగ్గురు ఉన్నారు. ప్రభుత్వం అప్పగించిన పనులను సక్రమంగా చేయలేదన్న కారణంగానే వీరిని తొలగించినట్టు అధికారులు చెపుతున్నారు.

అయితే.. వ‌లంటీర్ల తొల‌గింపు రాజ‌కీయంగా వివాదం సృష్టించింది. టీడీపీ స‌హా జ‌న‌సేన‌, ఇత‌ర‌ విపక్ష పార్టీల నేతలు మండిపడుతున్నారు. నిష్పక్షపాతంగా పని చేస్తున్న వాలంటీర్లను తొలగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీకి అనుకూలంగా వ్యవహరించని వాలంటీర్లపై కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. అయితే.. దీనిపై వైసీపీ నేత‌ల నుంచి ఎలాంటి ప్ర‌క‌ట‌నా రాలేదు. ఇదిలావుంటే.. ప్ర‌స్తుతం వలంటీర్ల వ్య‌వ‌స్థ దాదాపు ర‌ద్ద‌యిన‌ట్టేన‌ని అధికారులు చెబుతున్నారు. వ‌చ్చే నెల 1 వ తేదీన స‌చివాల‌య సిబ్బందే పింఛ‌న్లు పంపిణీ చేస్తార‌ని వెల్ల‌డించారు.

This post was last modified on March 18, 2024 2:07 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

హ‌ద్దులు దాటేసిన ష‌ర్మిల‌… మైలేజీ కోస‌మేనా?

రాజ‌కీయాల్లో విమ‌ర్శ‌లు చేయొచ్చు. ప్ర‌తివిమ‌ర్శ‌లు కూడా ఎదుర్కొన‌చ్చు. కానీ, ప్ర‌తి విష‌యంలోనూ కొన్ని హ‌ద్దులు ఉంటాయి. ఎంత రాజ‌కీయ పార్టీకి…

3 minutes ago

కూటమి పొత్తుపై ఉండవ‌ల్లికి డౌట‌ట‌… ఈ విష‌యాలు తెలీదా?

ఏపీలో బీజేపీ-టీడీపీ-జ‌న‌సేన పొత్తు పెట్టుకుని గ‌త 2024 ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికి 17 మాసాలుగా ఈ…

2 hours ago

కార్తి… అన్న‌గారిని భ‌లే వాడుకున్నాడే

తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఎంతో ఇష్ట‌మైన త‌మిళ స్టార్ ద్వ‌యం సూర్య‌, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద క‌మ‌ర్షియ‌ల్ హిట్ లేక…

2 hours ago

రూపాయి పతనంపై నిర్మలమ్మ ఏం చెప్పారంటే…

భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను ప్ర‌భావితం చేసేది.. `రూపాయి మార‌కం విలువ‌`. ప్ర‌పంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాల‌రుతోనే త‌మ‌తమ క‌రెన్సీ…

3 hours ago

జగన్ ‘చిన్న చోరీ’ వ్యాఖ్యలపై సీఎం బాబు రియాక్షన్ ఏంటి?

తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…

6 hours ago

మాయమైన నందమూరి హీరో రీ ఎంట్రీ

ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…

7 hours ago