ఏపీ అధికార పార్టీ వైసీపీ సంచలన నిర్ణయం తీసుకుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేయబోరన్న వార్తల నేపథ్యంలో విశాఖ జిల్లా గాజువాక నియోజకవర్గానికి మంత్రి గుడివాడ అమర్నాథ్ను ఇంచార్జ్గా నియమించింది. ఈయనకే దాదాపు టికెట్ ఇవ్వనున్నారు. అసెంబ్లీ నియోజకవర్గాలకు కొత్త ఇంఛార్జిల నియామకంలో భాగంగా కొత్త జాబితాను విడుదల చేసింది. తాజా జాబితాలో ప్రస్తుత మంత్రి గుడివాడ అమర్ నాథ్ ను గాజువాక ఇంఛార్జిగా నియమించారు. ఈయనకు ఇప్పటిదాకా ఏ నియోజకవర్గం కేటాయించకపోవడంతో గుడివాడ భవిష్యత్తు ఏంటనే ఆసక్తి అందరిలో నెలకొంది.
తాజాగా ఆ ఉత్కంఠకు తెరదించుతూ గుడివాడ అమర్ కు సీఎం జగన్ గాజువాక స్థానాన్ని కేటాయించారు. వీరితో పాటు చిలకలూరి పేట అసెంబ్లీ స్థానానికి కావటి మనోహర్ నాయుడు, కర్నూలు పార్లమెంటు స్థానం ఇంఛార్జిగా బీవీ రామయ్యను నియమించారు. ఇంకా కర్నూలు మేయర్గా సత్యనారాయణమ్మను ఎంపిక చేశారు. ప్రస్తుతం అనకాపల్లి నుంచి గుడివాడ అమర్ నాథ్ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. నియోజకవర్గ ఇంఛార్జిల ప్రక్షాళనలో భాగంగా ఆ స్థానాన్ని భరత్ కుమార్ కు కేటాయించడంతో.. గుడివాడ అమర్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేదానిపై ఆసక్తి నెలకొంది.
అటు అధిష్ఠానం నుంచి కూడా చాలా రోజులుగా స్పష్టత లేకపోవడంతో గుడివాడ అమర్ రాజకీయ భవిష్యత్తు ఏంటనే దానిపై రకరకాల వ్యాఖ్యానాలు మొదలయ్యాయి. ఇటీవల అనకాపల్లి సభలో సీఎం జగన్ పాల్గొన్న సందర్భంగా గుడివాడ అమర్నాథ్ తనకున్న ఇబ్బందులను సీఎం ముందే వెల్లడిస్తూ… వచ్చే ఎన్నికల్లో ఎక్కడ నుంచి పోటీ చేస్తారంటూ చాలామంది తనను ప్రశ్నిస్తున్నారని గుడివాడ అమర్ ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో అదే సభలో గుడివాడ అమర్ కు సీఎం జగన్ స్పష్టమైన హామీ ఇచ్చారు.
భరత్, అమర్ ఇద్దరు తన తమ్ముళ్ళే అని.. వచ్చే ఎన్నికల్లో మంత్రి అమర్నాథ్ ని తన గుండెల్లో పెట్టుకుంటానని సీఎం భరోసా ఇచ్చారు. తాజాగా అమర్ ను గాజువాక ఇంఛార్జిగా నియమించారు. అయితే.. నిన్న మొన్నటి వరకుఇక్కడ నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారని అందరూ అనుకున్నారు. అందుకే.. ఈ విషయంలో వైసీపీ ఆచితూచి వ్యవహరించింది. అయితే.. తాజాగా పవన్ తిరుపతి లేదా భీమవరం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. దీంతో వైసీపీ తాజాగా నిర్ణయం ప్రకటిస్తూ.. గుడివాడకు పెద్దపీట వేసింది.
This post was last modified on March 13, 2024 10:12 am
కడప ఎంపీ, వైసీపీ అధినేత జగన్ సోదరుడు వైఎస్ అవినాష్ రెడ్డి గృహాల్లో ఈడీ సోదాలతో మాజీ మంత్రి వైఎస్…
తెలుగు సినిమా పుట్టిన తర్వాత ఎందరో లెజెండ్స్ ప్రేక్షకుల హృదయాల మీద చెరిగిపోని సంతకం చేశారు. చిత్తూరు నాగయ్య నుంచి…
అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ ఇలా తీసింది మూడు సినిమాలే అయినా ప్యాన్ ఇండియా లెవెల్ లో పాపులారిటీ…
ఈ సంవత్సరం మన శంకరవరప్రసాద్ గారుతో మూడు వందల కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న మెగాస్టార్ చిరంజీవి వచ్చే…
ఒక్కోసారి మనం తీసుకునే నిర్ణయాలు పక్కవాళ్ళకు మేలు చేస్తాయి. ఇండస్ట్రీలో కూడా ఇది సర్వ సాధారణం. కాకపోతే ఈ ప్రయోజనం…
కేంద్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. జంతర్ మంతర్ దెబ్బకు కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయడం తెలిసిందే.…