రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున పోటీచేయబోయే ఇద్దరు నేతలకు కేసీయార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. నల్గొండ పార్లమెంటు సీటు నుండి కొంచర్ల కృఫ్ణారెడ్డి, చేవెళ్ళ లోక్ సభకు కాసాని జ్ఞానేశ్వర్ ను ఎంపిక చేసినట్లు తెలిసింది. ఇప్పటికి విడతలవారీగా కేసీయార్ ఆరుగురు అభ్యర్ధులను ఫైనల్ చేశారు. మొత్తం 17 నియోజకవర్గాల్లో 6 గురిని ఫైనల్ చేసిన కేసీయార్ తాజాగా మరో రెండుస్ధానాల్లో కూడా ఖరారు చేసినట్లు పార్టీ వర్గాల సమాచారం. అలాగే బీఆర్ఎస్-బీఎస్పీతో పొత్తుకుదిరింది.
పొత్తులో భాగంగా మహబూబ్ నగర్ జిల్లాలోని నాగర్ కర్నూలు సీటును బీఎస్పీకి వదిలేశారు. ఈ సీటులో బీఎస్పీ అభ్యర్ధిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీచేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మిగిలిన 16 నియోజకవర్గాల్లో అభ్యర్ధులను ఎంపికచేయాల్సిన అవసరం ఏర్పడింది. ఇందులో ఆరుగురిని ఫైనల్ చేసిన కేసీయార్ మరో ఇద్దరిని రెడీచేసినట్లు తెలుస్తోంది. అంటే ఇంకా 8 సీట్లలో అభ్యర్ధులను ఎంపిక చేయాలి. అయితే ఎంపీలుగా పోటీచేయటానికి చాలామంది సీనియర్లు ఇష్టపడంటలేదు. కేసీయార్ మాట్లాడినా సీనియర్లు వెనకాడుతున్నారు.
చేవెళ్ళ ఎంపీ రంజిత్ రెడ్డికి కేసీయార్ టికెట్ ఇస్తే పోటీకి నిరాకరించారు. దాంతోనే ఎంపీలుగా పోటీచేయటానికి చాలామంది సీనియర్లు వెనకాడుతున్నారన్న విషయం అర్ధమైపోయింది. చేవెళ్ళ నుండి పోటీచేయబోయే అభ్యర్ధిని ఫైనల్ చేయటానికి సమావేశానికి రమ్మని రంజిత్ రెడ్డిని కేసీయార్ కబురుచేసినా రాలేదు. అలాగే నల్గొండ పార్లమెంటు సీటు పరిధిలోని నేతలతో కేసీయార్ నిర్వహించిన సమీక్షలో గుత్తా అమిత్ రెడ్డి కూడా హాజరుకాలేదు. మొన్నటివరకు నల్గొండ టికెట్ కావాలని పట్టుబట్టిన శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కొడుకు అమిత్ రెడ్డి ఇపుడు ఎందుకు వెనక్కు తగ్గారన్నది అర్ధంకావటంలేదు.
గుత్తా అమిత్ రెడ్డి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో భేటీ అయ్యారనే ప్రచారం బాగా జరుగుతోంది. ప్రచారం నిజమే అయితే తొందరలోనే గుత్తా అమిత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరి హస్తంపార్టీ అభ్యర్ధిగా పోటీచేసే అవకాశాన్ని కొట్టిపారేసేందుకు లేదు. అదే జరిగితే తండ్రేమో బీఆర్ఎస్ లో కొడుకేమో కాంగ్రెస్ లో ఉన్నట్లవుతుంది. అంటే తండ్రి, కొడుకులు మాట్లాడుకోకుండానే కొడుకు కాంగ్రెస్ లో చేరుతారా ? అలాగని చెప్పినా ఎవరైనా నమ్ముతారా ? చూస్తుంటే రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ మెజారిటీ సిట్లు గెలిచి గుత్తా కూడా ఎంపీగా గెలిస్తే సుఖేందర్ రెడ్డి కూడా కాంగ్రెస్ లోకి వచ్చేయటం ఖాయమని అర్ధమవుతోంది.
This post was last modified on March 12, 2024 10:52 am
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…
ఒక పెద్ద సినిమాలో రాముడి పాత్రను పోషించడం ఏ నటుడికైనా అరుదైన అవకాశమే. దాన్ని లైఫ్ టైం ఛాన్స్లాగే ఫీలవుతారు ఎవ్వరైనా. ‘ఆదిపురుష్’ ఫలితం…
వైసీపీ అధినేత, తన బ్రదర్ జగన్పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్…