Political News

ఇద్దరు అభ్యర్ధులను ఎంపికచేశారా ?

రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున పోటీచేయబోయే ఇద్దరు నేతలకు కేసీయార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. నల్గొండ పార్లమెంటు సీటు నుండి కొంచర్ల కృఫ్ణారెడ్డి, చేవెళ్ళ లోక్ సభకు కాసాని జ్ఞానేశ్వర్ ను ఎంపిక చేసినట్లు తెలిసింది. ఇప్పటికి విడతలవారీగా కేసీయార్ ఆరుగురు అభ్యర్ధులను ఫైనల్ చేశారు. మొత్తం 17 నియోజకవర్గాల్లో 6 గురిని ఫైనల్ చేసిన కేసీయార్ తాజాగా మరో రెండుస్ధానాల్లో కూడా ఖరారు చేసినట్లు పార్టీ వర్గాల సమాచారం. అలాగే బీఆర్ఎస్-బీఎస్పీతో పొత్తుకుదిరింది.

పొత్తులో భాగంగా మహబూబ్ నగర్ జిల్లాలోని నాగర్ కర్నూలు సీటును బీఎస్పీకి వదిలేశారు. ఈ సీటులో బీఎస్పీ అభ్యర్ధిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీచేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మిగిలిన 16 నియోజకవర్గాల్లో అభ్యర్ధులను ఎంపికచేయాల్సిన అవసరం ఏర్పడింది. ఇందులో ఆరుగురిని ఫైనల్ చేసిన కేసీయార్ మరో ఇద్దరిని రెడీచేసినట్లు తెలుస్తోంది. అంటే ఇంకా 8 సీట్లలో అభ్యర్ధులను ఎంపిక చేయాలి. అయితే ఎంపీలుగా పోటీచేయటానికి చాలామంది సీనియర్లు ఇష్టపడంటలేదు. కేసీయార్ మాట్లాడినా సీనియర్లు వెనకాడుతున్నారు.

చేవెళ్ళ ఎంపీ రంజిత్ రెడ్డికి కేసీయార్ టికెట్ ఇస్తే పోటీకి నిరాకరించారు. దాంతోనే ఎంపీలుగా పోటీచేయటానికి చాలామంది సీనియర్లు వెనకాడుతున్నారన్న విషయం అర్ధమైపోయింది. చేవెళ్ళ నుండి పోటీచేయబోయే అభ్యర్ధిని ఫైనల్ చేయటానికి సమావేశానికి రమ్మని రంజిత్ రెడ్డిని కేసీయార్ కబురుచేసినా రాలేదు. అలాగే నల్గొండ పార్లమెంటు సీటు పరిధిలోని నేతలతో కేసీయార్ నిర్వహించిన సమీక్షలో గుత్తా అమిత్ రెడ్డి కూడా హాజరుకాలేదు. మొన్నటివరకు నల్గొండ టికెట్ కావాలని పట్టుబట్టిన శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కొడుకు అమిత్ రెడ్డి ఇపుడు ఎందుకు వెనక్కు తగ్గారన్నది అర్ధంకావటంలేదు.

గుత్తా అమిత్ రెడ్డి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో భేటీ అయ్యారనే ప్రచారం బాగా జరుగుతోంది. ప్రచారం నిజమే అయితే తొందరలోనే గుత్తా అమిత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరి హస్తంపార్టీ అభ్యర్ధిగా పోటీచేసే అవకాశాన్ని కొట్టిపారేసేందుకు లేదు. అదే జరిగితే తండ్రేమో బీఆర్ఎస్ లో కొడుకేమో కాంగ్రెస్ లో ఉన్నట్లవుతుంది. అంటే తండ్రి, కొడుకులు మాట్లాడుకోకుండానే కొడుకు కాంగ్రెస్ లో చేరుతారా ? అలాగని చెప్పినా ఎవరైనా నమ్ముతారా ? చూస్తుంటే రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ మెజారిటీ సిట్లు గెలిచి గుత్తా కూడా ఎంపీగా గెలిస్తే సుఖేందర్ రెడ్డి కూడా కాంగ్రెస్ లోకి వచ్చేయటం ఖాయమని అర్ధమవుతోంది.

Satya

Recent Posts

సిట్ అదుపులో CI నాగరాజు

ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ…

10 minutes ago

వెంటిలేటర్ పై ఉన్న పద్మనాభం గుర్తు లేరా జగన్?

వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రెడ్డి ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నారు.…

30 minutes ago

ఓడిన చోటే గెలిచి చూపించింది

శాకుంతలం విడుదలై డిజాస్టరైనప్పుడు దాని ఫలితానికి బాధ్యుడు దర్శకుడు గుణశేఖర్ అయినప్పటికీ టైటిల్ రోల్ పోషించిన సమంత కూడా విమర్శలను…

2 hours ago

చిరు లీక్ చేశాడు… నందిని కన్ఫమ్ చేసింది

మెగాస్టార్ చిరంజీవి సినిమా రహస్యాలను లీక్ చేయడంలో ఫేమస్ అన్న సంగతి తెలిసిందే. ‘ఆచార్య’ సినిమా టైటిల్‌ను అనుకోకుండా రివీల్…

3 hours ago

జగన్.. బాలయ్య సాయం కోరిన వేళ..!

వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి… టీడీపీ ఎమ్మెల్యే, టాలీవుడ్ అగ్ర నటుడు నందమూరి…

3 hours ago

డీఎస్సీపై గగ్గోలు… నీట్‌పై మౌనం..?

"ఏనుగు పోతుంటే చూడరు.. చీమ కుడితే గగ్గోలు పెడతారు" అనే సామెత రాజకీయాలకు కూడా సరిగ్గా సరిపోతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి.…

4 hours ago