Political News

ఏపీకి రాజధాని శాపం? చంద్రబాబు చెప్పిందే జరిగితే?

టీడీపీ అధినేత.. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీ రాజధాని అమరావతి స్థానే.. మూడు రాజధానుల ఏర్పాటును ఆయన తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. మూడు రాజధానులపై ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి వాదనలు సైతం సబబుగానే కనిపిస్తాయి. ఇలాంటివేళ.. చంద్రబాబు చేసిన వ్యాఖ్యల్ని పరిగణలోకి తీసుకుంటే మాత్రం.. ఏపీ ప్రజలకు రానున్న రోజుల్లో రాజధాని అంటూ ఒకప్రాంతం పర్మినెంట్ గా ఉండదా? అన్న సందేహం కలుగక మానదు.

బాబు హయాంలో అమరావతిని రాజధానిగా ఏర్పాటు చేయటం.. ప్రధాని మోడీ శంకుస్థాపన చేయటం తెలిసిందే. గత ఏడాది అధికారంలోకి వచ్చిన జగన్ సర్కారు.. రాజధానిగా ఉన్న అమరావతిని శాసన రాజధానిగా పరిమితం చేస్తూ.. విశాఖ.. కర్నూలులో రాజధానులు ఏర్పాటు చేయాలని నిర్ణయించటం తెలిసిందే. దీనిపై తాజాగా బాబు మాట్లాడుతూ.. రేపొద్దున మరో ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రాజధానిని నాలుగైదు ముక్కలు చేస్తానంటే ఏం చేస్తారు? అప్పుడు కూడా ప్రాంతాల మధ్య సమంగా డెవలప్ చేయటానికే అంటే ఏం మాట్లాడతారు?అంటూ ప్రశ్నించారు.

ముఖ్యమంత్రులు మారినప్పుడల్లా.. రాజధానిని మారిస్తే.. రాష్ట్ర ప్రయోజనాలు ఏం కావాలి? అని ప్రశ్నించారు. రేపు మరో రాష్ట్రం తమ రాజధానిని నాలుగైదు ముక్కలుగా చేయాల్సి వస్తే పరిస్థితి ఏమిటన్న మాటను కేంద్రాన్ని ప్రశ్నించాలని తన ఎంపీలను కోరారు. రాజకీయ ప్రయోజనాల కోసం జగన్ ప్రభుత్వం ఆడుతున్న మూడు ముక్కలాటను నిలదీయాల్సిన అవసరం ఉందన్నారు.

బాబు మాటల్ని పరిగణలోకి తీసుకుంటే.. అధికారంలోకి వచ్చే ప్రభుత్వాలు రాజధానుల్ని మార్చేలా నిర్ణయం తీసుకుంటే పరిస్థితి ఏమిటి? అన్నది పెద్ద ప్రశ్న. ఇక.. ఏపీలో ఒకటిగా ఉన్న రాజధాని మూడుగా మారాయి. రేపొద్దున కొత్తగా వచ్చే మరో ప్రభుత్వం.. రాజధానిని మారుస్తూ నిర్ణయం తీసుకుంటే ఏం కావాలి? అదే జరిగితే.. ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని శాపం ఉందన్న మాట నిజం కావటమే కాదు.. ఒక పెద్ద రాజధాని నగరం లేని లోటు ఏపీని వెంటాడుతూనే ఉంటుందని చెప్పక తప్పదు.

This post was last modified on September 14, 2020 9:49 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

2 hours ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

2 hours ago

ఎంగేజ్మెంట్ తర్వాత ఆమె చేతికి రింగ్ లేదేంటి?

టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…

2 hours ago

కాసేపు క్లాస్ రూములో విద్యార్థులుగా మారిన చంద్రబాబు, లోకేష్

పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…

2 hours ago

పవన్ కల్యాణ్ హీరోగా… టీడీపీ ఎమ్మెల్యే నిర్మాతగా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…

4 hours ago

రష్యా vs ఉక్రెయిన్ – ఇండియా ఎవరివైపో చెప్పిన మోడీ

ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…

4 hours ago