Political News

ఏపీకి ఫిక్సెడ్ రాజధాని అన్నది ఉండదా?

టీడీపీ అధినేత.. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీ రాజధాని అమరావతి స్థానే.. మూడు రాజధానుల ఏర్పాటును ఆయన తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. మూడు రాజధానులపై ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి వాదనలు సైతం సబబుగానే కనిపిస్తాయి. ఇలాంటివేళ.. చంద్రబాబు చేసిన వ్యాఖ్యల్ని పరిగణలోకి తీసుకుంటే మాత్రం.. ఏపీ ప్రజలకు రానున్న రోజుల్లో రాజధాని అంటూ ఒకప్రాంతం పర్మినెంట్ గా ఉండదా? అన్న సందేహం కలుగక మానదు.

బాబు హయాంలో అమరావతిని రాజధానిగా ఏర్పాటు చేయటం.. ప్రధాని మోడీ శంకుస్థాపన చేయటం తెలిసిందే. గత ఏడాది అధికారంలోకి వచ్చిన జగన్ సర్కారు.. రాజధానిగా ఉన్న అమరావతిని శాసన రాజధానిగా పరిమితం చేస్తూ.. విశాఖ.. కర్నూలులో రాజధానులు ఏర్పాటు చేయాలని నిర్ణయించటం తెలిసిందే. దీనిపై తాజాగా బాబు మాట్లాడుతూ.. రేపొద్దున మరో ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రాజధానిని నాలుగైదు ముక్కలు చేస్తానంటే ఏం చేస్తారు? అప్పుడు కూడా ప్రాంతాల మధ్య సమంగా డెవలప్ చేయటానికే అంటే ఏం మాట్లాడతారు? అంటూ ప్రశ్నించారు.

ముఖ్యమంత్రులు మారినప్పుడల్లా.. రాజధానిని మారిస్తే.. రాష్ట్ర ప్రయోజనాలు ఏం కావాలి? అని ప్రశ్నించారు. రేపు మరో రాష్ట్రం తమ రాజధానిని నాలుగైదు ముక్కలుగా చేయాల్సి వస్తే పరిస్థితి ఏమిటన్న మాటను కేంద్రాన్ని ప్రశ్నించాలని తన ఎంపీలను కోరారు. రాజకీయ ప్రయోజనాల కోసం జగన్ ప్రభుత్వం ఆడుతున్న మూడు ముక్కలాటను నిలదీయాల్సిన అవసరం ఉందన్నారు.

బాబు మాటల్ని పరిగణలోకి తీసుకుంటే.. అధికారంలోకి వచ్చే ప్రభుత్వాలు రాజధానుల్ని మార్చేలా నిర్ణయం తీసుకుంటే పరిస్థితి ఏమిటి? అన్నది పెద్ద ప్రశ్న. ఇక.. ఏపీలో ఒకటిగా ఉన్న రాజధాని మూడుగా మారాయి. రేపొద్దున కొత్తగా వచ్చే మరో ప్రభుత్వం.. రాజధానిని మారుస్తూ నిర్ణయం తీసుకుంటే ఏం కావాలి? అదే జరిగితే.. ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని శాపం ఉందన్న మాట నిజం కావటమే కాదు.. ఒక పెద్ద రాజధాని నగరం లేని లోటు ఏపీని వెంటాడుతూనే ఉంటుందని చెప్పక తప్పదు.

This post was last modified on September 11, 2020 3:00 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

1 hour ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

4 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

7 hours ago

జగన్ ఇలానే ఉండాలంటూ టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

10 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

10 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

13 hours ago