Political News

బీసీలు శాసించే స్థాయికి రావాలి: పవన్

జయహో బీసీ సభలో పాల్గొన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం, జనసేన కూటమి అధికారంలోకి వచ్చిన మొదటి మూడు నెలల్లో బీసీ డిక్లరేషన్ అమలు చేస్తామని పవన్ అన్నారు. 2019లో వైసీపీ వెన్నంటి ఉన్న బీసీలను జగన్ దెబ్బ కొట్టాడని ఆరోపించారు. బీసీల గర్జన పేరుతో ఏలూరులో ప్రత్యేకమైన సభ నిర్వహించి చాలా హామీలు ఇచ్చారని, బీసీలకు 15 వేల కోట్ల రూపాయలు కేటాయిస్తామని చెప్పి గాలికొదిలేశారని ఆరోపించారు.

బడ్జెట్లో మూడో వంతు బీసీలకు కేటాయిస్తామని చెప్పి పూర్తిగా విస్మరించారని పవన్ దుయ్యబట్టారు. వైసీపీ పాలనలో దాదాపు 23 నుంచి 26 వేల మంది బీసీలపై కేసులు పెట్టారని మండిపడ్డారు. గుంటూరు జిల్లాలో అమర్నాథ్ గౌడ్ అనే బీసీ యువకుడిని వైసీపీ నేతలు పెట్రోల్ పోసి తగులబెట్టారని ఆరోపించారు. బీసీ సోదరులు ఒకసారి పునరాలోచించుకోవాలని, గుడ్డిగా గనుక వైసీపీ నాయకులు వెనకేసుకు వస్తే ఇబ్బంది పడతారని అన్నారు.

ఎస్సీ,ఎస్టీల పరిరక్షణ చట్టం మాదిరి వైసీపీ పాలనలో బీసీలకు కూడా ప్రత్యేక రక్షణ చట్టం అవసరం అని చెప్పారు. ఆ చట్టాన్ని ఈ డిక్లరేషన్ లో తెచ్చారని, దానికి తన మద్దతు ఉంటుందని తెలిపారు. జనసేనకు సంబంధించినంత వరకు బీసీలకు సంబంధించి రామ్ మనోహర్ లోహియా గారి సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటామని అన్నారు. బీసీ కులాలు యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయికి రావాలని అన్నారు. బీసీ కులాలు భారతదేశపు సంస్కృతీసంప్రదాయాలకు వెన్నెముక అని, బీసీ కులాలు లేని సమాజం, బీసీ కులాలు లేని భారతదేశాన్ని ఊహించుకోలేమన్నారు.

This post was last modified on March 5, 2024 9:33 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

మిరల్ రిపోర్ట్ ఏంటి

నిన్న ఎలాగూ కొత్త తెలుగు సినిమాలు లేవనే కారణంగా మిరల్ అనే డబ్బింగ్ మూవీని రిలీజ్ చేశారు. ప్రేమిస్తేతో టాలీవుడ్…

4 hours ago

త్రివిక్రమ్ కోసం స్రవంతి ప్రయత్నాలు

గుంటూరు కారం విడుదలై అయిదు నెలలు పూర్తి కావొస్తున్నా త్రివిక్రమ్ శ్రీనివాస్ కొత్త సినిమా ఇప్పటిదాకా మొదలుకాలేదు. అసలు పూర్తి…

6 hours ago

టీడీపీలో 92 గెలుపు గుర్రాలు.. అధికారం ఖాయ‌మే!

బీజేపీ, జ‌న‌సేన‌లతో కూట‌మి క‌ట్టిన టీడీపీ ఏపీలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో పోరాటం చేసిన విష‌యం తెలిసిందే. పోలింగ్ శాతం పెరిగిన…

7 hours ago

గురుశిష్యులతో రామ్ చరణ్ సింగిల్ ప్లాన్

గేమ్ ఛేంజర్ దెబ్బకు ఏకంగా మూడు సంవత్సరాలకు పైగా దానికే కేటాయించాల్సి వచ్చిన రామ్ చరణ్ శంకర్ మీద ఉన్న…

7 hours ago

జగన్ విమానం ఖర్చు అంతుంటుందా ?

ఎన్నికల సమరం ముగియడంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుటుంబంతో కలిసి విదేశాలకు విహారయాత్రకు వెళ్లారు. జగన్ విదేశీ పర్యటనకు…

8 hours ago

ప్రేక్షకుల అటెండెన్సుకి ఎవరిది బాధ్యత

చాంతాడంత కారణాలు చెప్పుకుని జనం థియేటర్లకు రావడం లేదని ఎంత బాధ పడినా వాస్తవిక పరిస్థితిని అర్థం చేసుకుంటే కనక…

9 hours ago