జయహో బీసీ సభలో పాల్గొన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం, జనసేన కూటమి అధికారంలోకి వచ్చిన మొదటి మూడు నెలల్లో బీసీ డిక్లరేషన్ అమలు చేస్తామని పవన్ అన్నారు. 2019లో వైసీపీ వెన్నంటి ఉన్న బీసీలను జగన్ దెబ్బ కొట్టాడని ఆరోపించారు. బీసీల గర్జన పేరుతో ఏలూరులో ప్రత్యేకమైన సభ నిర్వహించి చాలా హామీలు ఇచ్చారని, బీసీలకు 15 వేల కోట్ల రూపాయలు కేటాయిస్తామని చెప్పి గాలికొదిలేశారని ఆరోపించారు.
బడ్జెట్లో మూడో వంతు బీసీలకు కేటాయిస్తామని చెప్పి పూర్తిగా విస్మరించారని పవన్ దుయ్యబట్టారు. వైసీపీ పాలనలో దాదాపు 23 నుంచి 26 వేల మంది బీసీలపై కేసులు పెట్టారని మండిపడ్డారు. గుంటూరు జిల్లాలో అమర్నాథ్ గౌడ్ అనే బీసీ యువకుడిని వైసీపీ నేతలు పెట్రోల్ పోసి తగులబెట్టారని ఆరోపించారు. బీసీ సోదరులు ఒకసారి పునరాలోచించుకోవాలని, గుడ్డిగా గనుక వైసీపీ నాయకులు వెనకేసుకు వస్తే ఇబ్బంది పడతారని అన్నారు.
ఎస్సీ,ఎస్టీల పరిరక్షణ చట్టం మాదిరి వైసీపీ పాలనలో బీసీలకు కూడా ప్రత్యేక రక్షణ చట్టం అవసరం అని చెప్పారు. ఆ చట్టాన్ని ఈ డిక్లరేషన్ లో తెచ్చారని, దానికి తన మద్దతు ఉంటుందని తెలిపారు. జనసేనకు సంబంధించినంత వరకు బీసీలకు సంబంధించి రామ్ మనోహర్ లోహియా గారి సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటామని అన్నారు. బీసీ కులాలు యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయికి రావాలని అన్నారు. బీసీ కులాలు భారతదేశపు సంస్కృతీసంప్రదాయాలకు వెన్నెముక అని, బీసీ కులాలు లేని సమాజం, బీసీ కులాలు లేని భారతదేశాన్ని ఊహించుకోలేమన్నారు.
కొన్ని సినిమాలకు బాక్సాఫీస్ దగ్గర పరిస్థితులు కలిసొచ్చి యావరేజ్ కంటెంట్తోనే ఇరగాడేస్తుంటాయి. రివ్యూలు, టాక్ అంతంతమాత్రంగా ఉన్నా సరే.. సినిమాకు…
జూన్ 19 విడుదల కాబోతున్న మా ఇంటి బంగారం కౌంట్ డౌన్ మొదలైపోయింది. కేవలం నాలుగు రోజుల సమయం మాత్రమే…
కథానాయికగా పరిచయం అయింది తమిళంలోనే అయినా.. తెలుగులోనే ఎక్కువ సినిమాలు చేసి గుర్తింపు సంపాదించింది నివేథా పెతురాజ్. మెంటల్ మదిలో,…
ఒకప్పుడు అమెరికా అధ్యక్షుడు హోదాలో ఉన్న వ్యక్తి నోటి నుంచి ఒక మాట వస్తే.. అదో నిజమన్నట్లుగా ఉండేది. అలాంటి…
ఢిల్లీలో 'జాతీయ సమగ్రత కోసం సేన ప్రస్థానం' పేరుతో 3 రోజుల పాటు సభలను నిర్వహించాలని జనసేన నిర్ణయించిన సంగతి…
కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ)గా ఏర్పడి ఉద్యమాలు చేస్తున్న ఈ పార్టీ.. దేశవ్యాప్తంగా విస్తరించే ప్రణాళికలు అమలు చేస్తోంది. కొన్ని రోజుల…