Political News

సుప్రీం కోర్టులో చంద్రబాబుకు బిగ్ రిలీఫ్

ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ కేసులో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు బెయిల్ రద్దు పిటిషన్ వ్యవహారం సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్న సంగతి తెలిసిందే. ఆ పిటిషన్ పై ఈరోజు విచారణ జరగాల్సి ఉంది. అయితే, తాజాగా మరోసారి ఆ పిటిషన్ పై విచారణను వాయిదా వేస్తూ సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. మూడు వారాల తర్వాత ఆ పిటిషన్ పై తదుపరి విచారణ జరుపుతామని జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం తెలిపింది.

దర్యాప్తు అధికారులను చంద్రబాబు కుటుంబం బెదిరిస్తోందని, తక్షణమే ఆయన బెయిల్ రద్దు చేయాలని ఏపీ ప్రభుత్వ, సీఐడీ తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టును కోరారు. దానికి సంబంధించిన వివరాలతో కూడిన ఇంటర్ లొకేటరీ అప్లికేషన్ కూడా దాఖలు చేశామని కోర్టుకు విన్నవించారు. ఒక డైరీలో అధికారుల పేర్లు నమోదు చేస్తూ తామ అధికారంలోకి వచ్చిన వెంటనే వారిపై చర్యలు తీసుకుంటామని బెదిరిస్తున్నారని ప్రభుత్వ తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గీ ఆరోపించారు. దాంతోపాటు బెయిల్ రద్దు చేయడానికి అనేక కారణాలున్నాయని వాదనలు వినిపించారు.

ప్రభుత్వం తరఫున ముగ్గురు రోహిత్ కి వాదనలు వినిపించగా చంద్రబాబు తరఫున హరీష్ సాల్వే వాదనలు వినిపించారు. ప్రభుత్వం లేవనెత్తిన ప్రతి అంశానికి సమాధానం ఇస్తామని హరీష్ చెప్పారు. దీంతో రెండు వారాల లోపు కౌంటర్ దాఖలు చేయాలని, మూడు వారాల తర్వాత ఈ పిటిషన్ పై తదుపరి విచారణ జరుపుతామని కోర్టు తీర్పు చెప్పింది‌. సీట్ల పంపకం, పొత్తుల వ్యవహారం పై కీలక దశలో ఉన్న టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుకు కోర్టు తాజా తీర్పు భారీ ఊరట కలిగించిందని చెప్పవచ్చు.

This post was last modified on February 26, 2024 8:09 pm

Share

Recent Posts

ఆస్కార్ వెళ్లేంత గొప్పగా ఉందా ‘గోంధల్’

ఎన్ని నామినేషన్లు వెళ్లినా, మన వైపు నుంచి పెద్ది ఇరుముడి లాంటి బ్లాక్ బస్టర్లను పంపినా, ఆస్కార్ బరిలో మరాఠి…

11 minutes ago

అవతార్ పోలికంటే అతిశయోక్తి అవుతుందేమో

నిన్న చెన్నైలో జరిగిన ఒక సినిమా ఈవెంట్ కు అతిథిగా వచ్చిన దర్శకుడు సిబి చక్రవర్తి అట్లీని పొగిడే క్రమంలో…

14 minutes ago

సాయిరెడ్డి వెంట న‌డిచే రెడ్లు ఉన్నారా?

పార్టీ ఏదైనా.. నాయ‌కుడు ఎవ‌రైనా సొంత సామాజిక వ‌ర్గం అండ అయితే ఉండాలి. పోనీ.. అది లేక‌పోతే.. ప్ర‌జాబ‌లం అయినా…

15 minutes ago

దాయ్‌రాగా మారిన దిశా… బాగా లేటయ్యింది

ఎనిమిదేళ్ల క్రితం 2019లో తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన సంఘటన దిశాపై జరిగిన అఘాయిత్యం. ఒక వైద్య విదార్థినిని నలుగురు కరుడు…

4 hours ago

షర్మిల కూతురి పెళ్ళికి జగన్ డుమ్మా ?

వైయస్ కుటుంబంలో ఆస్తి తగాదాలు ఇంకా సమసిపోయినట్లు కనిపించడం లేదు. అన్నా చెల్లెళ్ళ మధ్య దూరం తరిగిన సూచనలు కానరావడం…

4 hours ago

ప్యారడైజ్ పోటీ నుండి తప్పుకున్న కీర్తి సురేష్

ప్యారడైజ్ మీద ఉన్న క్రేజ్ దృష్ట్యా దానికి పోటీగా నిలబడేందుకు పెద్ద సినిమాలు సాహసం చేయడం లేదు. అనుమాన పక్షి…

5 hours ago