జనసేన నాయకుడు, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం అనకాపల్లి జిల్లాలో పర్యటిస్తున్న ఆయన.. వచ్చే ఎన్నికల వరకు కూడా అక్కడే ఉంటానని చెప్పేశారు. అంతేకాదు.. వైసీపీ ఎలా గెలుస్తుందో కూడా చూస్తానని వ్యాఖ్యానించారు. “ఇక్కడే ఉంటా.. వైసీపీ ఎలా గెలుస్తుందో చూస్తా!” అని చెప్పడం గమనార్హం. అంతేకాదు.. రాష్ట్రంలో రాక్షస పాలన పోయే విధంగా జనసేన – టీడీపీ కూటమి ముందుకు సాగుతాయని అన్నారు.
తాజాగా అనకాపల్లి జిల్లా అచ్చుతాపురం మండలంలో పర్యటించిన ఆయన స్థానిక జనసేన, టీడీపీ నాయకులతో భేటీ అయ్యారు. స్థానిక రాజకీయాలపై ఆయన చర్చించారు. అనంతరం ఆయన వైసీపీ పై విమర్శలు గుప్పించారు. “వైసీపీ పాలనలో దాడులు పెరిగిపోయాయి. రాబోయే ఎన్నికల్లో జగన్ పాలనకు చరమగీతం పాడేందుకు జనసేన- టీడీపీ నేతలు సిద్ధంగా ఉండాలి. రెండు పార్టీల్లోని నేతలు జగన్ ప్రభుత్వ తప్పిదాలపై ప్రశ్నించాలి. ప్రతి ఇంటికీ వెళ్లి వైసీపీ దరిద్రపు పాలనను ప్రచారం చేయాలి. అనకాపల్లి జిల్లాలో సమస్యలపైనే ఎక్కువగా దృష్టి పెడుతున్నా. వచ్చే ఎన్నికల వరకు ఎక్కడికి వెళ్లను” అని నాగ బాబు అన్నారు.
ఎంపీ సీటుపైనే దృష్టి
కాగా.. గత ఎన్నికల్లో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని నరసాపురం పార్లమెంటు స్థానం నుంచి జనసేన టికెట్పై పోటీ చేసిన నాగబాబు.. వచ్చే ఎన్నికల్లో అనకాపల్లిని ఎంచుకున్నట్టు తెలిసింది. నరసాపురం నుంచి వైసీపీ టికెట్పై గెలిచిన రఘురామకృష్ణరాజు.. టీడీపీ తరఫున ఇక్కడ నుంచి పోటీ చేయనున్న దరిమిలా.. ఆ సీటును వదిలేసిన నాగబాబు.. కాపు సామాజిక వర్గం సహా శెట్టిబలిజ సామాజిక వర్గం, మత్య్సకారులు ఎక్కువగా ఉన్న అనకాపల్లి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని తెలిసింది. ఈ క్రమంలోనే ఆయన పార్లమెంటు నియోజకవర్గంలో తిష్టవేశారు. గత 20 రోజులుగా ఆయన మూడు సార్లు ఇక్కడ పర్యటించడం గమనార్హం. అయితే.. పార్టీ టికెట్పై మాత్రం ఎలాంటి క్లారిటీ రాలేదు. కానీ, నాగబాబు అనకాపల్లి పార్లమెంటు నుంచి పోటీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
This post was last modified on February 16, 2024 10:17 pm
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…