Political News

తెలిసి చేసినా.. తెలియ‌క చేసినా.. జ‌గ‌న్‌దే భారం!

రాజ‌కీయాల్లో హ‌త్య‌లు ఉండ‌వు. ఆత్మ‌హ‌త్యలే ఉంటాయి. ఎవ‌రు తీసుకున్న గోతిలో వారే ప‌డుతుంటారు. సొంత నిర్ణ‌యాలు అన్ని సంద‌ర్భాల్లోనూ క‌లిసి రావు. ఇప్పుడు ఈ ప‌రిస్థితే.. వైసీపీలోనూ ఎదుర‌వుతోంది. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు.. సామాజిక వ‌ర్గాల‌ను ఓన్ చేసుకున్న వైసీపీ అధినేత‌.. వారి సూచ‌న‌ల‌ను పాటిం చారు. వారు చెప్పిన మార్పులు కూడా చేశారు. కానీ, ఇప్పుడు ప‌రిస్థితి మారిపోయింది. తెలిసి నిర్ణ‌యం తీసుకుంటున్నారో.. తెలియ‌క‌ నిర్ణ‌యం తీసుకుంటున్నారో తెలియ‌దు కానీ.. కీల‌క‌మైన నాయ‌కుల‌ను ప‌క్క‌న పెడుతున్నారు.

ఎస్సీ సామాజిక వ‌ర్గం త‌న‌దేనంటారు. కానీ, వారిలోనూ కీలక‌మైన సిట్టింగుల‌ను ప‌క్క‌న పెడుతున్నారు. ఉదాహ‌ర‌ణ‌కు.. సింగ‌న‌మ‌ల నియోజ‌క‌వ‌ర్గంలో మంచి పేరున్న జొన్న‌ల‌గ‌డ్డ ప‌ద్మావ‌తిని త‌ప్పించారు. నిజానికి ఆమె క‌రోనా స‌మ‌యంలో చేసిన సేవ‌కు కేంద్రం నుంచి అవార్డు అందుకున్నారు. గ్రామీణ స్థాయిలో మంచి పేరు కూడా ఉంది. పోనీ.. అక్ర‌మాలు చేశార‌నే విమ‌ర్శ‌లు ఉన్నాయ‌ని అంటే.. అవి లేనివారు అంటూ లేరు. కానీ, ప్ర‌జాబ‌లం రూపంలో తీసుకుంటే జొన్న‌ల‌గ‌డ్డ‌కే మొగ్గు క‌నిపిస్తోంది.

ఇక‌, బీసీ సామాజిక వ‌ర్గంలో ఎప్ప‌టి నుంచో పార్టీకి అండ‌గా ఉన్న‌.. జంగా కృష్ణ‌మూర్తిని రోడ్డున ప‌డేశార‌నే వాద‌న ఉంది. నిజానికి ఆయ‌న టికెట్ కోరుకున్నారు. అయితే.. సానుకూలంగా ఆయ‌న‌ను ఒప్పించి ఉంటే వేరేగా ఉండేది. కానీ, బ‌ల‌మైన నాయ‌కుడిని ప‌క్క‌న పెట్టారు. ఈయ‌న ప్ర‌భావం ఖ‌చ్చితంగా ఉంటుందని అంటున్నారు. ఇక‌, ఎస్సీ సామాజిక వ‌ర్గంలో మంచి పేరున్న మంత్రి నాగార్జున‌ను కూడా సీటు మార్చారు. కానీ, వేమూరులో ఆయ‌న పేరు తెలియ‌నివారు లేరు. కానీ, ఇప్పుడు కొత్త ఇంచార్జ్‌ను పెట్టారు. ఇక్క‌డ కూడా రాంగ్ ఈక్వేష‌న్ అంటున్నారు.

బ్రాహ్మణ‌ సామాజిక వ‌ర్గానికి చెందిన మ‌ల్లాది విష్ణును త‌ప్పించారు. కానీ, ఈయ‌న రెండో సారి గెలిచేందుకు అవ‌కాశం ఉంది. అయినా.. ఆయ‌న‌ను త‌ప్పించ‌డం ఆ వ‌ర్గంలో ప్ర‌భావం చూపుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 7-8 శాతం ఓటు బ్యాంకు బ్రాహ్మ‌ణులు ఉన్నారు. వీరి ప్ర‌భావం కూడా వైసీపీపై ప‌డితే.. ఎంతో కొంత ఓటు బ్యాంకు గ‌ల్లంతేన‌ని అంటున్నారు. ఇక‌, యాద‌వ సామాజిక వ‌ర్గంలో బ‌ల‌మైన నాయ‌కుడిగా పేరున్న కొలుసు పార్థ‌సార‌థిని గాలికి వ‌దిలేశారు. ఇలా చెప్ప‌కొంటూ.. పోతే.. సామాజిక వ‌ర్గాల‌ను ఉద్ధ‌రిస్తున్నామ‌న్న జ‌గ‌న్‌.. కీల‌క నేత‌ల‌ను వ‌దులుకుంటే.. ముక్కు మొహం తెలియ‌ని నాయ‌కుల‌కు టికెట్‌లు ఇస్తే.. వైనాట్ 175 ఎలా సాధ్యం అన్న‌ది కీల‌క ప్ర‌శ్న.

This post was last modified on February 16, 2024 6:03 pm

Share

Recent Posts

మోహన్ బాబుని మిస్ చేసిన మహేష్ బాబు

ఇంకో నాలుగు రోజుల్లో విడుదల కాబోతున్న శ్రీనివాస మంగాపురం మీద సినిమా కంటే ఎక్కువగా మహేష్ బాబు ఆ మూవీ…

16 minutes ago

మహేష్ మల్టీప్లెక్స్‌లో సినిమాలు చూసిన విజయ్

ఈ రోజుల్లో పెద్ద స్టార్లు థియేటర్లకు వచ్చి సినిమాలు చూడడం అన్నది దాదాపు అసాధ్యంగా మారిపోయింది. మిడ్ రేంజ్ హీరోలు…

36 minutes ago

జ‌న‌సేన ఎమ్మెల్యే రిటైర్మెంట్ ప్ర‌క‌టిస్తారా ..?

తిరుప‌తి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి విజ‌యం సాధించిన జ‌న‌సేన నాయ‌కుడు, సీనియ‌ర్ నేత ఆర‌ణి శ్రీనివాసులు రాజ‌కీయ భ‌విష్య‌త్తుపై ఆస‌క్తిక‌ర…

2 hours ago

రకుల్ సినిమాల్లోకి వచ్చింది కారు కోసమే

కొందరు నటనలోకి రావాలని ముందే ఒక లక్ష్యం పెట్టుకుని పని చేస్తారు. కొందరు అనుకోకుండా ఈ రంగంలోకి అడుగు పెడతారు.…

2 hours ago

హెచ్చరికలతో సరిపెడితే ఎలా బాబు గారు

టీడీపీ అధినేత చంద్ర‌బాబు వైఖ‌రి.. పార్టీ నాయ‌కులకు బాగా క‌లిసి వ‌స్తోంద‌న్న‌వాద‌న వినిపిస్తోంది. ఇప్ప‌టికి రెండు సంవ‌త్స‌రాలుగా చంద్ర‌బాబు.. త‌మ్ముళ్ల‌కు…

3 hours ago

పార్టీ సమస్యలు పట్టించుకోండి సీఎం సార్

తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు ఎప్పటికప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్నాయి. గ్రాండ్ ఓల్డ్ పార్టీలో ఈ తరహా పరిస్థితులు కొత్తేమీ…

5 hours ago