Political News

వైరల్ పిక్ : ఒక చిరంజీవి.. ఇద్ద‌రు ముఖ్య‌మంత్రులు!

తెలుగు సినీ రంగంలో త‌న‌కంటూ ప్ర‌త్యేక స్థాయిని సంపాయించుకున్న మెగాస్టార్ కు తాజాగా కేంద్ర ప్ర‌భుత్వం ‘ప‌ద్మ‌విభూష‌ణ్‌’ వంటి దేశ రెండో అత్యున్న‌త పౌర పుర‌స్కారాన్ని అందించింది. దీనిని పుర‌స్క‌రించుకుని తెలంగాణ ప్ర‌భుత్వం ఆయ‌న‌తో పాటు.. ప‌ద్మ అవార్డులు సొంతం చేసుకున్న‌వారిని తాజాగా ఘ‌నంగా స‌త్క‌రించింది. ఈ సంద‌ర్భంగా చోటు చేసుకున్న ఓ ఘ‌ట‌న ఇటు తెలంగాణ రాజ‌కీయాల్లోనూ సినీ వ‌ర్గాల్లోనేకాకుండా..అటు ఏపీలోనూ చ‌ర్చ‌నీయాంశం అయింది. ‘ఒక చిరంజీవి ఇద్ద‌రు ముఖ్య‌మంత్రులు’ ట్యాగ్‌తో దీనిపై సోష‌ల్ మీడియాలోనూ చ‌ర్చ‌సాగుతోంది.

ఏంటి విష‌యం?

ఈ ఏడాది ప‌ద్మ అవార్డులు పొందిన తెలుగు వారికి తెలంగాణ ప్ర‌భుత్వం ఘ‌న స‌త్కారం చేసింది. ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన ఈ స‌త్కార కార్య‌క్ర‌మం ఆసాంతం క‌నుల పండువ‌గా సాగింది. ఆహ్లాదంగా, హుందాగా కూడా నిర్వ‌హించారు. ముఖ్యంగా సీఎం న‌నే భేష‌జాన్ని ప‌క్క‌న పెట్టి, త‌న హై ప్రొఫైల్, ప్రొటోకాల్ వంటివాటిని కూడా ప‌క్క‌న పెట్టి.. చాలా విన‌మ్రంగా, ఎంతో మ‌ర్యాద పూర్వ‌కంగా సీఎం రేవంత్ రెడ్డి వ్య‌వ‌హ‌రించారు. క‌ళాకారుల‌కు మ‌రింత గౌర‌వాన్ని ఇనుమ‌డించేలా ఆయ‌న వ్య‌వ‌హ‌రించారు. ప్ర‌ధానంగా మెగాస్టార్ చిరంజీవి సీఎం రేవంత్‌కు న‌మ‌స్కారం చేసిన‌ప్పుడు ప్ర‌తిగా సీఎం రేవంత్ అంతే విధేయ‌త‌తో ప్ర‌తిన‌మ‌స్కారం చేశారు. ఇది ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వైర‌ల్ అవుతోంది.

ఏపీలో ఏం జ‌రిగిందంటే..

ఇదే మెగాస్టార్ చిరంజీవి.. గ‌త 2022లో ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌ను కూడా క‌లిశారు. అప్ప‌ట్లో ఏపీ ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చిన జీవో 35 పై ఆయ‌నతో చిరంజీవి చ‌ర్చించారు. దీనికి సంబంధించిన వీడియో, ఫొటోలు అప్ప‌ట్లో ఇలానే వైర‌ల్ అయ్యాయి. కాగా, అప్ప‌ట్లో జీవో 35 ద్వారా.. ఏపీ ప్ర‌భుత్వం సినిమాల‌పై ఆంక్ష‌లు విధించిన విష‌యం తెలిసిందే. కొత్త సినిమాల‌కు అప్ప‌టి వ‌ర‌కు ఉన్న టికెట్లు ధ‌ర‌లు పెంచుకునే అవ‌కాశం, బెనిఫిట్ షోలు ప్ర‌ద‌ర్శించే అవ‌కాశం, ఒకేసారి ఎక్కువ ధియేట‌ర్ల‌లో ఆడించుకునే అవ‌కాశానికి కళ్లెం వేసిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో అప్ప‌ట్లో ఈ విష‌యం పెద్ద చ‌ర్చ‌నీయాంశం..అదేస‌మ‌యంలో వివాదాస్పదం అయ్యాయి.

This post was last modified on February 5, 2024 6:42 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘పోకిరి’లో ఆ ట్రాక్ పూరి తీసేద్దామనుకుంటే..

టాలీవుడ్ ఆల్ టైం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్లలో ‘పోకిరి’ ఒకటి. 2006 వేసవిలో విడుదలైన ఈ చిత్రం అప్పటి కలెక్షన్లు,…

1 hour ago

ఇక రాంబాబు రానట్టే

సౌత్ ఇండియాలో మోస్ట్ అవైటెడ్ సీక్వెల్స్‌లో ఒకటైన ‘దృశ్యం-3’ ఇంకో పది రోజుల్లోపే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఏప్రిల్ 2కే…

2 hours ago

వెంకీ మాట విన‌క‌పోవ‌డంతోనే ఆ ఫ్లాప్

తెలుగు సినీ చ‌రిత్ర‌లోనే అత్యంత హైప్ మ‌ధ్య విడుద‌లైన చిత్రాల్లో.. దేవిపుత్రుడు ఒక‌టి. 2001 సంక్రాంతికి మృగ‌రాజు, న‌ర‌సింహ‌నాయుడు లాంటి…

4 hours ago

మూకుమ్మడిగా మహేష్ సినిమాలను పిండుతున్నారు

రీ రిలీజ్ ట్రెండ్ ఎక్కడికి వెళ్తుందో అర్థం కావడం లేదు. ఒక నోస్టాల్జియా ఫీలింగ్ ఇవ్వడం కోసం మొదలైన ఈ…

6 hours ago

సోషల్ మీడియా వేరే ప్రపంచం కాదే

ఈ వారం విడుదల కాబోతున్న వీరభద్రుడుకి హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశారు. దర్శకుడు ఆర్జె బాలాజీ కొన్ని…

11 hours ago

మోడీపై సీనియర్ నటుడి ఊహించ‌ని ఎలివేషన్

సినిమా వాళ్ల‌కు రాజ‌కీయ ఆస‌క్తులు, అభిమానాలు ఉండ‌డం కొత్త కాదు. అందులో త‌ప్పు కూడా లేదు. ఐతే ఎప్పుడూ రాజ‌కీయాల…

11 hours ago