తెలుగు సినీ రంగంలో తనకంటూ ప్రత్యేక స్థాయిని సంపాయించుకున్న మెగాస్టార్ కు తాజాగా కేంద్ర ప్రభుత్వం ‘పద్మవిభూషణ్’ వంటి దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారాన్ని అందించింది. దీనిని పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం ఆయనతో పాటు.. పద్మ అవార్డులు సొంతం చేసుకున్నవారిని తాజాగా ఘనంగా సత్కరించింది. ఈ సందర్భంగా చోటు చేసుకున్న ఓ ఘటన ఇటు తెలంగాణ రాజకీయాల్లోనూ సినీ వర్గాల్లోనేకాకుండా..అటు ఏపీలోనూ చర్చనీయాంశం అయింది. ‘ఒక చిరంజీవి ఇద్దరు ముఖ్యమంత్రులు’ ట్యాగ్తో దీనిపై సోషల్ మీడియాలోనూ చర్చసాగుతోంది.
ఏంటి విషయం?
ఈ ఏడాది పద్మ అవార్డులు పొందిన తెలుగు వారికి తెలంగాణ ప్రభుత్వం ఘన సత్కారం చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ సత్కార కార్యక్రమం ఆసాంతం కనుల పండువగా సాగింది. ఆహ్లాదంగా, హుందాగా కూడా నిర్వహించారు. ముఖ్యంగా సీఎం ననే భేషజాన్ని పక్కన పెట్టి, తన హై ప్రొఫైల్, ప్రొటోకాల్ వంటివాటిని కూడా పక్కన పెట్టి.. చాలా వినమ్రంగా, ఎంతో మర్యాద పూర్వకంగా సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరించారు. కళాకారులకు మరింత గౌరవాన్ని ఇనుమడించేలా ఆయన వ్యవహరించారు. ప్రధానంగా మెగాస్టార్ చిరంజీవి సీఎం రేవంత్కు నమస్కారం చేసినప్పుడు ప్రతిగా సీఎం రేవంత్ అంతే విధేయతతో ప్రతినమస్కారం చేశారు. ఇది ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వైరల్ అవుతోంది.
ఏపీలో ఏం జరిగిందంటే..
ఇదే మెగాస్టార్ చిరంజీవి.. గత 2022లో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను కూడా కలిశారు. అప్పట్లో ఏపీ ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో 35 పై ఆయనతో చిరంజీవి చర్చించారు. దీనికి సంబంధించిన వీడియో, ఫొటోలు అప్పట్లో ఇలానే వైరల్ అయ్యాయి. కాగా, అప్పట్లో జీవో 35 ద్వారా.. ఏపీ ప్రభుత్వం సినిమాలపై ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. కొత్త సినిమాలకు అప్పటి వరకు ఉన్న టికెట్లు ధరలు పెంచుకునే అవకాశం, బెనిఫిట్ షోలు ప్రదర్శించే అవకాశం, ఒకేసారి ఎక్కువ ధియేటర్లలో ఆడించుకునే అవకాశానికి కళ్లెం వేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అప్పట్లో ఈ విషయం పెద్ద చర్చనీయాంశం..అదేసమయంలో వివాదాస్పదం అయ్యాయి.
This post was last modified on February 5, 2024 6:42 pm
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…