తెలుగు సినీ రంగంలో తనకంటూ ప్రత్యేక స్థాయిని సంపాయించుకున్న మెగాస్టార్ కు తాజాగా కేంద్ర ప్రభుత్వం ‘పద్మవిభూషణ్’ వంటి దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారాన్ని అందించింది. దీనిని పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం ఆయనతో పాటు.. పద్మ అవార్డులు సొంతం చేసుకున్నవారిని తాజాగా ఘనంగా సత్కరించింది. ఈ సందర్భంగా చోటు చేసుకున్న ఓ ఘటన ఇటు తెలంగాణ రాజకీయాల్లోనూ సినీ వర్గాల్లోనేకాకుండా..అటు ఏపీలోనూ చర్చనీయాంశం అయింది. ‘ఒక చిరంజీవి ఇద్దరు ముఖ్యమంత్రులు’ ట్యాగ్తో దీనిపై సోషల్ మీడియాలోనూ చర్చసాగుతోంది.
ఏంటి విషయం?
ఈ ఏడాది పద్మ అవార్డులు పొందిన తెలుగు వారికి తెలంగాణ ప్రభుత్వం ఘన సత్కారం చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ సత్కార కార్యక్రమం ఆసాంతం కనుల పండువగా సాగింది. ఆహ్లాదంగా, హుందాగా కూడా నిర్వహించారు. ముఖ్యంగా సీఎం ననే భేషజాన్ని పక్కన పెట్టి, తన హై ప్రొఫైల్, ప్రొటోకాల్ వంటివాటిని కూడా పక్కన పెట్టి.. చాలా వినమ్రంగా, ఎంతో మర్యాద పూర్వకంగా సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరించారు. కళాకారులకు మరింత గౌరవాన్ని ఇనుమడించేలా ఆయన వ్యవహరించారు. ప్రధానంగా మెగాస్టార్ చిరంజీవి సీఎం రేవంత్కు నమస్కారం చేసినప్పుడు ప్రతిగా సీఎం రేవంత్ అంతే విధేయతతో ప్రతినమస్కారం చేశారు. ఇది ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వైరల్ అవుతోంది.
ఏపీలో ఏం జరిగిందంటే..
ఇదే మెగాస్టార్ చిరంజీవి.. గత 2022లో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను కూడా కలిశారు. అప్పట్లో ఏపీ ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో 35 పై ఆయనతో చిరంజీవి చర్చించారు. దీనికి సంబంధించిన వీడియో, ఫొటోలు అప్పట్లో ఇలానే వైరల్ అయ్యాయి. కాగా, అప్పట్లో జీవో 35 ద్వారా.. ఏపీ ప్రభుత్వం సినిమాలపై ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. కొత్త సినిమాలకు అప్పటి వరకు ఉన్న టికెట్లు ధరలు పెంచుకునే అవకాశం, బెనిఫిట్ షోలు ప్రదర్శించే అవకాశం, ఒకేసారి ఎక్కువ ధియేటర్లలో ఆడించుకునే అవకాశానికి కళ్లెం వేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అప్పట్లో ఈ విషయం పెద్ద చర్చనీయాంశం..అదేసమయంలో వివాదాస్పదం అయ్యాయి.
This post was last modified on February 5, 2024 6:42 pm
స్టార్ హీరోలు ఎవరికైనా అభిమానులుంటారు. కానీ వాళ్ళతో ఒక ప్రణాళికాబద్ధమైన సంబంధాన్ని ఏర్పరుచుకోవడం అందరి వల్ల కాదు. సీనియర్లలో చిరంజీవి…
ఎల్లుండి విడుదల కాబోతున్న స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే సినిమా క్రేజ్ చూసి ట్రేడ్ షాకవుతోంది. ఈ సిరీస్…
ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిపై మరో మహిళా ట్రైనీ ఐపీఎస్ లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన వ్యవహారం ఇరు తెలుగు…
దివంగత ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభకు టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ హాజరు కావడంపై టీడీపీ అధినేత చంద్రబాబు సీరియస్…
టాలీవుడ్ విలక్షణ నటుడు దగ్గుబాటి రానా ఇంతకుముదులా వరుసగా సినిమాలు చేయడం లేదు. హీరోగా అయితే సినిమాలు పూర్తిగా ఆపేశాడు. విలన్,…
2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ఇచ్చిన హామీల్లో ఒకటైన మెగా డీఎస్సీ నిర్ణీత కాల వ్యవధిలోనే ముగిసింది. 16,347 మంది…