Political News

ఒక్క సీటూ ఓడి పోవ‌ద్దు : ప‌వ‌న్ దిశానిర్దేశం

వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీకి సంబంధించి జ‌న‌సేన పార్టీ నాయ‌కుల‌కు ఆ పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ దిశానిర్దేశం చేశారు. “పొత్తులో భాగంగా తీసుకునే ప్ర‌తి సీటు వెనుక ఎవ‌రో ఒక‌రి త్యాగం ఉంటుంద‌ని.. కాబ‌ట్టి, ఏ ఒక్క‌సీటునూ ఓడిపోవ‌డానికి వీల్లేదు” అని ఆయ‌న అన్నారు. 2024 ఎన్నికల్లో జనసేన-టీడీపీ మిత్ర‌ప‌క్షం బలమైన ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయ‌నున్నాయ‌ని ఆయ‌న తెలిపారు. అయితే, ఈ విజయం తేలికగా రాద‌న్నారు. బలమైన పోరాటం అవసరమ‌ని, జ‌న సైనికులు దానికి సంసిద్ధంగా ఉండాల‌ని పిలుపునిచ్చారు.

“శత్రువు ఎన్ని మోసాలతో అయినా మళ్లీ అధికారంలోకి రావడానికి పన్నాగాలు పన్నుతాడు. జగన్ మోసాలను జయించి విజయం సాధించాలి. కచ్చితంగా వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి అసెంబ్లీలో జనసేన బలమైన ముద్ర వేయాలి” అని ప‌వ‌న్ వ్యాఖ్యానించారు. “నేను సైలెంటుగా ఉన్నాను… అంతా నిస్తేజంగా ఉందని జనసైనికులు, వీర మహిళలు అనుకోవద్దు. ప్రతి మౌనం వెనుక బలమైన వ్యూహం ఉంటుంది. వచ్చే ఎన్నికల్లో జనసేన పోటీ చేసే ప్రతి చోట కచ్చితంగా గెలుపు ఉండాలనే లక్ష్యంతోనే ప్రణాళికలు ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లో పోటీ చేసిన దగ్గర గెలిచి తీరాల్సిందే” అని అన్నారు.

జగన్ దుర్మార్గ ప్ర‌భుత్వం మళ్లీ వస్తే రాష్ట్రాన్ని రక్షించడం అసాధ్యమ‌ని ప‌వ‌న్ హెచ్చ‌రించారు. ఐదేళ్లలోనే రాష్ట్రం పరిస్థితి ఇంత దిగజారిపోతే.. మరోసారి జగన్ వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవ‌డానికి కూడా ఏమీ ఉండ‌ద‌న్నారు. పార్టీ గెలుపు కోసం అహర్నిశలు కష్టపడాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు. స్ధానిక సంస్ధల స్థాయి పదవులు నుంచి రాష్ట్ర స్థాయి పదవులు వరకు అందరికీ.. శ్రమకు తగిన గుర్తింపు ఉంటుందని భ‌రోసా ఇచ్చారు. ఎవరినీ మరిచిపోయేది లేదన్నారు. ఎవరికీ అన్యాయం జరగదని తెలిపారు. పడిన ప్రతీ కష్టానికీ తగిన గౌరవం ఇచ్చే బాధ్యత తాను తీసుకుంటాన‌ని ప‌వ‌న్ వ్యాఖ్యానించారు

This post was last modified on February 5, 2024 10:09 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

అనిరుధ్ మీద హైదరాబాదీల ప్రేమ

మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…

2 hours ago

వేరే రాష్ట్రం నుంచి స్విగ్గీ ఏంటయ్యా ప్రభాస్?

తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్‌లో షూటింగ్స్…

3 hours ago

తిరుమల లడ్డూ వివాదం: 45 రోజుల్లో నిజాలు బహిర్గతం

ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…

3 hours ago

ప్రేక్షకుల మూడ్ ఇలా ఉందేంటి

ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…

5 hours ago

స్నేహితుడి కోసం… రాజీ పడని పవన్?

ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్‌తో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ సినిమాల‌కు టాటా చెప్పేస్తాడ‌ని గ‌త ఏడాది ఓ ప్ర‌చారం జ‌రిగింది.…

5 hours ago

దృశ్యం-3… జార్జ్ కుట్టి దాచిన సీక్రెటేంటి?

ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…

7 hours ago