Political News

ఏపీ స‌హ‌కారం లేదు: కేంద్రం ఫైర్

తాము చేప‌ట్టాల‌ని భావించిన కీల‌క ప్రాజెక్టుకు ఏపీ ప్ర‌భుత్వం నుంచి స‌రైన స‌హ‌కారం అంద‌డం లేద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. విభ‌జ‌న చ‌ట్టంలోని కీల‌క‌మైన హామీగా ఉన్న విశాఖ రైలు జోన్ ప్రాజెక్టు విష‌యంపై రైల్వే శాఖ మంత్రి అశ్వినీకుమార్ వైష్ణ‌వ్ ఈ మేరకు వ్యాఖ్యానించారు. విశాఖ రైలు జోన్ ప్రాజెక్టుకు 53 ఎక‌రాల భూమి అవ‌స‌ర‌మ‌ని ఆయ‌న తెలిపారు. ఈ విష‌యాన్ని 2019 నుంచి చెబుతున్నా..ఏపీ ప్ర‌భుత్వం ప‌ట్ట‌న‌ట్టే వ్య‌వ‌హ‌రిస్తోంద‌న్నారు. అందుకే ఈ ప్రాజెక్టు ముందుకు సాగ‌డం లేద‌న్నారు.

విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుకు సంబంధించి డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు రెడీగా ఉంద‌న్న అశ్వినీ కుమార్‌.. భూమి త‌మ‌కు అప్ప‌గిస్తే.. ప‌నులు త‌క్ష‌ణమే ప్రారంభిస్తామ‌ని చెప్పారు. ఈ విష‌యంలో ఇప్ప‌టికైనా ఏపీ ప్ర‌భుత్వం స్పందించాల‌న్నారు. మ‌రోవైపు తెలంగాణ ప్ర‌భుత్వం త‌మ‌కు స‌హ‌క‌రిస్తోంద‌ని మంత్రి కితాబిచ్చారు. రాష్ట్ర ప్ర‌భుత్వ స‌హ‌కారంతో తెలంగాణ‌లో 100 శాతం రైల్వే లైన్ల‌ను విద్యుదీక‌రించిన‌ట్టు తెలిపారు. అదేవిధంగా ఫ్లై ఓట‌ర్లు, అండ‌ర్ పాస్ బ్రిడ్జిల‌ను కూడా నిర్మించిన‌ట్టు చెప్పారు. ఈ త‌ర‌హాలో రాష్ట్రాలు స‌హ‌క‌రించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అన్నారు.

ఇక‌, ప్ర‌స్తుత మ‌ధ్యంతర బ‌డ్జెట్‌పై మంత్రి మాట్లాడుతూ.. ఒక్క ఏపీకే 9 వేల కోట్ల రూపాయ‌ల‌కు పైగా.. ప్ర‌భుత్వం రైల్వేల‌కు నిధులు కేటాయించింద‌ని తెలిపారు.గ‌త యూపీఏ పాల‌నలో 2009 నుంచి 2014 వ‌ర‌కు 900 కోట్ల‌రూపాయ‌లు కేటాయిస్తే.. త‌మ ప్ర‌భుత్వం మాత్రం వేలాది కోట్ల‌రూపాయ‌ల‌ను కేటాయిస్తూ.. దేశ‌వ్యాప్తంగా రైళ్ల‌ను ఆధునీక‌రిస్తోంద‌ని తెలిపారు. త్వ‌ర‌లోనే న‌మో వందే భార‌త్ రైళ్ల‌ను దేశ‌వ్యాప్తంగా ప్ర‌వేశ పెట్ట‌నున్న‌ట్టు వివ‌రించారు. “అభివృద్ధి అనేది మా చేతుల్లోనే లేదు.. రాష్ట్రాలు కూడా స‌మ‌క‌రించాలి” అని ప‌రోక్షంగా ఏపీని ఉద్దేశించి ఆయ‌న వ్యాఖ్యానించారు.

This post was last modified on February 1, 2024 11:01 pm

Share

Recent Posts

రామాయణ, వారణాసి… ఓ క్లారిటీ వస్తుందా?

రామాయణం.. తరతరాలుగా ప్రతీ ఇంటితోనూ విడదీయరాని బంధం ఉన్న ఒక గొప్ప ఎమోషన్. అయితే ఈ కథను ఇండియన్ సినిమా…

6 hours ago

చెల్లెలిపై కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు

క‌లిసి రాజ‌కీయం చేయ‌క‌పోయినా వైఎస్సార్సీపీ, బీఆర్ఎస్ పార్టీల మ‌ధ్య కొన్ని పోలిక‌లు క‌నిపిస్తున్నాయి. అటు ఏపీలో, ఇటు తెలంగాణ‌లో ఈ…

9 hours ago

చెన్నైలో చింటు మేనియా

సోష‌ల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటూ.. త‌న సినిమాల ఈవెంట్ల‌లో, ఇంట‌ర్వ్యూల్లో హాట్ హాట్ కామెంట్లు చేస్తుంటాడు ప్ర‌ముఖ తెలుగు…

9 hours ago

కనకరాజు లెక్కలు సేఫ్ గానే ఉన్నాయా?

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు'తో ఇప్పుడు తప్పకుండా హిట్ కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో 'గద్దలకొండ గణేష్'…

9 hours ago

బాగుంది ఆదివారం… థియేటర్లలో జన సందోహం

ఆదివారం రోజు అందులోనూ ప్రత్యేకంగా సాయంత్రం షోలకు ఆక్యుపెన్సీలు బాగుండటం సహజమే కానీ ఈవారం మాత్రం బయ్యర్లు ఆనందంతో మునిగిపోయేలా…

9 hours ago

కాలేజీలు కాదు… విద్యార్థుల ఖాతాల్లోకే ఫీజు రీయంబర్స్మెంట్ జమ?

తెలంగాణలో ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం అమలులో కీలక మార్పులు తెచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతుంది. కళాశాలలకు…

10 hours ago