Political News

నాకే టికెట్.. లేకుంటే వాళ్లు ఉరేసుకుంటారు-జలీల్ ఖాన్

బీకాంలో ఫిజిక్స్ కామెంట్‌తో అప్పట్లో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోయారు టీడీపీ మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్. టీడీపీ ముస్లిం మైనారిటీ నేతల్లో బాగా పేరున్న ఈయన.. కొన్నేళ్ల నుంచి అంత యాక్టివ్‌గా లేరు. 2019 ఎన్నికల్లో జలీల్ పక్కకు తప్పుకుని తన కూతురు షబానాకు టికెట్ ఇప్పించుకున్నారు. ఐతే ఆ ఎన్నికల్లో వెల్లంపల్లి శ్రీనివాస్ చేతిలో ఓటమి పాలైంది షబానా.

ఐతే ఈసారి ఎన్నికల్లో తనే పోటీ చేయాలని అనుకుంటున్నారు జలీల్ ఖాన్. కానీ పొత్తులో భాగంగా జనసేన కోసం టీడీపీ ఈ సీటును త్యాగం చేయొచ్చనే వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో జలీల్ ఖాన్ మీడియాతో మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ చేశారు. తనకు టికెట్ ఇవ్వకపోతే ముస్లిం మైనారిటీలు ఉరేసుకుంటారని ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం.

“విజయవాడ వెస్ట్ క్యాండిడేట్ నేనే. నేనే నిలుచుంటా. గెలిచేది నేనే. అడగడానికి అందరూ అడుగుతారు సీట్లు. కానీ గెలిచే స్థోమత ఉండాలి. ప్రజల్లో మంచి విలువలు ఉండాలి. క్యారెక్టర్ ఉండాలి. ఇవన్నీ ఉన్న వాళ్లు సర్వే రిపోర్ట్‌లో ఎవరొస్తే వాళ్లకే టికెట్ ఇస్తారు. ఇది మాత్రం తెలుగుదేశం సీట్. తెలుగుదేశం పార్టీకే ఇవ్వాలి. తెలుగుదేశం ఉంటేనే గెలవగలగతాం. వేరే వాళ్లు వస్తుంటారు. వెళ్తుంటారు. అడగడంలో తప్పు లేదు. సర్వే రిపోర్టును బట్టి గెలిచే వ్యక్తికి నాయకుడు టికెట్ ఇస్తారు. సీటు ఇవ్వకుంటే ఉరి వేసుకుంటారు మా వాళ్లు. ముస్లిం మైనారిటీలంతా సిద్ధంగా ఉన్నారు ఉరి వేసుకోవడానికి. వాయిస్ ఆఫ్ ద పీపుల్ జలీల్ ఖాన్ అంటారు విజయవాడ వెస్ట్‌లో. ఇప్పటికే నేను ఆపి ఉంచాను. లేకుంటే ఇప్పటికే ఇద్దరు ముగ్గురు ఉరి వేసుకునేవాళ్లు’’ అని జలీల్ ఖాన్ పేర్కొన్నారు.

This post was last modified on February 1, 2024 2:13 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

33 minutes ago

‘నీట్’ గా పేపర్ అమ్మేశారట!

నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…

36 minutes ago

భగీరథ్ కేసు వాదించేది వైసీపీ ఎంపీనే

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.…

2 hours ago

కేరళం ‘సీల్డ్ కవర్’ తెరచుకునేదెన్నడో..?

దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…

2 hours ago

ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్న మోదీ వ్యాఖ్యలు

యావత్తు ప్రపంచాన్ని కరోనా చుట్టుముట్టిన తరుణంలో లాక్ డౌన్ అంటే ఏమిటో… ఎలా ఉంటుందో చూశాం. ఇప్పుడు కరోనా లాంటి…

5 hours ago

ఒక్క ఓటుతో గెలిస్తే ఓటేయొద్దా…?

తమిళ రాజకీయాల్లో వరుసబెట్టి ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తమిళనాడు అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ఫలితాలు వెలువడిన దగ్గర నుంచి రోజుకో…

6 hours ago