Political News

నితీష్ కుమార్ కు ఇవే చివరి ఎన్నికలు: పీకే

బీజేపీకి మద్దతు పలుకుతూ ఎన్డీఏ కూటమిలో బీహార్ సీఎం నితీష్ కుమార్ చేరడం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ వ్యవహారంపై గతంలో బీహార్ సీఎం నితీష్ కుమార్ తో కలిసి పని చేసిన రాజకీయ వ్యూహకర్త, ఐ ప్యాక్ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ కీలక వ్యాఖ్యలు చేశారు. నితీష్ కుమార్ కు ఇవే చివరి ఎన్నికలని, ఆ తర్వాత ఆయన రాజకీయాల్లో కనపడరని పీకే జోస్యం చెప్పారు. నితీష్ కుమార్ పచ్చి మోసగాడని, సీఎం పదవి దక్కించుకునేందుకు ఏమైనా చేస్తాడని దుయ్యబట్టారు.

2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో జేడీయూకు 20 కన్నా ఎక్కువ సీట్లు రావని జ్యోస్యం చెప్పారు పీకే. నితీష్ ఏ కూటమిలో చేరినా అంతకుమించి సీట్లు దక్కించుకోలేరని, ఒకవేళ 20 కంటే ఎక్కువ సీట్లు నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ గెలుచుకుంటే తాను తన వృత్తిని వదిలేస్తానని ఛాలెంజ్ చేశారు. ఇక, బీజేపీతో నితీష్ మిత్ర బంధం ఎక్కువ రోజులు కొనసాగదని, గట్టిగా చెప్పాలంటే 2025 శాసనసభ ఎన్నికల వరకు బీజేపీతో పొత్తు కొనసాగక పోవచ్చని అన్నారు. సీఎం సీటు కాపాడుకునేందుకు నితీష్ కుమార్ ఏమైనా చేస్తారని, అందుకే బీహార్ ప్రజలు నితీష్ ను తిరస్కరిస్తున్నారని అన్నారు.

నితీష్ తో జతకట్టడం వల్ల బీజేపీకే నష్టం ఎక్కువ అని చెప్పుకొచ్చారు. నితీష్ తో పొత్తు లేకుండా ఒంటరిగా పోటీ చేస్తే బిజెపి మరిన్ని సీట్లు గెలుచుకుని బలమైన స్థితిలో ఉండేదని అన్నారు. మరి, పీకే కామెంట్లపై నితీష్ కుమార్ స్పందన ఏవిధంగా ఉంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది.

This post was last modified on January 30, 2024 12:50 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఒకవేళ జగన్ వస్తే రాజధాని మారుతుందా?

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తికి చ‌ట్ట‌బద్ధ‌త క‌ల్పించే ల‌క్ష్యంతో గ‌త నెల 28న ఏపీ అసెంబ్లీ ప్ర‌త్యేకంగా భేటీ అయి.. దీనిపై…

5 minutes ago

మలయాళంలో రేవంత్ సినిమా ఎలా నడుస్తోంది?

అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…

4 hours ago

ఆ సీక్వెల్… నా వల్ల కాదు బాబోయ్

అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…

6 hours ago

నాడూ మూడే!… నేడూ మూడే!

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…

10 hours ago

మోడీ ముందు జ‌గ‌న్ మ‌రింత‌ ప‌లుచ‌న‌!

ప్ర‌స్తుతం ఎవ‌రు ఔన‌న్నా.. కాద‌న్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజ‌కీయాల‌కు కూడా ప్ర‌ధాని మోడీ పెద్ద‌దిక్కుగా మారారన్నది వాస్త‌వం. ఆయ‌న‌ను…

11 hours ago

రాముడి పాత్ర వద్దన్న రణబీర్

ఒక పెద్ద సినిమాలో రాముడి పాత్రను పోషించడం ఏ నటుడికైనా అరుదైన అవకాశమే. దాన్ని లైఫ్ టైం ఛాన్స్‌లాగే ఫీలవుతారు ఎవ్వరైనా. ‘ఆదిపురుష్’ ఫలితం…

11 hours ago