Political News

జగన్ నడపలేరు, ఎన్నికలకు సిద్ధం కండి: చంద్రబాబు

ఏపీలో జన రంజక పాలన సాగుతోందని వైసీపీ నేతలు చెబుతోన్న సంగతి తెలిసిందే. కరోనా మహమ్మారి పంజా విసురుతున్న రోజుల్లోనూ సంక్షేమ పథకాలు అందిస్తున్న గొప్ప ప్రభుత్వం తమదని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఇది చూసి ఓర్వలేకే ప్రభుత్వంపై టీడీపీ బురదజల్లుతోందని, ప్రజా సంక్షేమ పథకాలకు టీడీపీ అడ్డుపడుతోందని విమర్శిస్తున్నారు.

చంద్రబాబు మరోసారి సీఎం కావడం కల అని, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా టీడీపీకి మరోసారి ఘోర పరాభవం తప్పదని మంత్రి కొడాలి నాని అన్నారు. మరోవైపు, 15 నెలల వైసీపీ పాలనపై ప్రజలు విసిగిపోయి ఉన్నారని ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు.

గంటకు రూ.9 కోట్లు అప్పు చేస్తూ జగన్ రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టేస్తున్నారని విమర్శించారు. త్వరలోనే ఎన్నికలు రావడం ఖాయమని, ఏ క్షణంలో ఎన్నికలు వచ్చిన ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని టీడీపీ శ్రేణులకు పిలుపిచ్చారు.

ఉచిత విద్యుత్ నగదు బదిలీ పథకాన్ని అడ్డుకుంటామని చంద్రబాబు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రైతుల పొలాల్లోని మోటర్లకు స్మార్ట్ మీటర్లు బిగించాలన్న నిర్ణయాన్ని తప్పుబట్టారు. స్మార్ట్ మీటర్ల వల్ల మెట్ట ప్రాంత, రాయలసీమ ప్రాంత రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందన్నారు.

జగన్ అసమర్థ పాలనలో రాష్ట్ర ప్రతిష్ట పాతాళానికి పడిపోయిందని విమర్శించారు. 15 నెలల పాలనలో జగన్ ప్రభుత్వం రెండుసార్లు కరెంటు ఛార్జీలను పెంచింని, ఈ పథకంతో 18 లక్షల రైతుల జీవితాలతో చెలగాటమాడాలనుకుంటోందని మండిపడ్డారు.

తన హయాంలో ఒక్కసారి కూడా కరెంటు ఛార్జీలు పెంచలేదని, వైసీపీ చెప్పేదొకటి చేసేదొకటి అని ఎద్దేవా చేశారు. టీడీపీ హయాంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్‌లో అగ్రస్థానంలో ఉన్న ఏపీ ఇపుడు జగన్ పాలనలో అడ్రస్ లేకుండా పోయిందని దుయ్యబట్టారు.

This post was last modified on September 5, 2020 4:50 pm

Share

Recent Posts

పోటీకి సిద్ధంకండి… పొత్తు సంగతి నేను చూసుకుంటాను

స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యకర్తలు, నాయకులకు కీలక…

1 hour ago

తిరుమలలో ‘రోబోట్‌ డాగ్‌’… వాటి కదలికలపై నిఘా!

తిరుమల అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతోపాటు, భక్తుల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు టీటీడీ ఆధునిక సాంకేతిక…

2 hours ago

అప్పట్లో చిరు ఏడాదికి నాలుగు సినిమాలు చేసినా గొడవే

ఇప్పుడు పెద్ద హీరోల నుంచి ఏడాదికో సినిమా వస్తే ఆశ్చర్యపోయే పరిస్థితి ఉంది. ఒక్క ప్రభాస్‌ను పక్కన పెడితే.. అల్లు…

9 hours ago

దీపికా విషయంలో సందీప్ వంగానే కరెక్ట్

ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న స్పిరిట్ షూటింగ్ మొదలుకాక ముందు హాట్ టాపిక్ గా మారింది…

10 hours ago

హృద‌య విదార‌కం… టీచ‌ర్ దెబ్బ‌కు ప్రాణం వ‌దిలిన పిల్లాడు

పిల్ల‌ల విష‌యంలో త‌ల్లిదండ్రులైనా, ఉపాధ్యాయులైనా ఎంత సున్నితంగా వ్య‌వ‌హ‌రించాలో చెప్పే ఉదంత‌మిది. విద్యార్థుల‌ను క్ర‌మ‌శిక్ష‌ణ‌లో పెట్టాల‌ని, వారిలో భ‌యం పెంచాల‌ని…

11 hours ago

యాక్సిడెంట్ కేసులో జనసేన ఎంపీ తనయుడు

హైదరాబాద్ మాదాపూర్ ఇనార్బిట్ మాల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో భారతి అనే 26 ఏళ్ల యువతి మృతి చెందిన…

12 hours ago