Political News

వైసీపీలో కొత్త భ‌యం.. రంగంలోకి అధిష్టానం!

ఏపీ అధికార పార్టీ వైసీపీలో కొత్త భ‌యం ప‌ట్టుకుంది. ఔను ఇది నిజ‌మే. గ‌త 15 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా మారిన రాజ‌కీయ ప‌రిణామాల‌పై వ‌చ్చిన నివేదిక‌లు, అందిన స‌మాచారం నేప‌థ్యంలో వైసీపీ ఇప్పుడు ఆత్మ ర‌క్ష‌ణ‌లో ప‌డింది. దీనికికార‌ణం.. త‌మ‌కు ఎవ‌రో ప్ర‌త్యేకంగా శ‌త్రువులు రాలేదు. త‌మ వారే త‌మ‌కు శ‌త్రువులుగా మారుతుండ‌డ‌మే! ఆశ్చ‌ర్యంగా అనిపించినా.. ఇది నిజ‌మేన‌ని ఐప్యాక్ టీం తాజాగా వెల్ల‌డించింది.

విష‌యం ఏంటంటే.. మార్పులు మంచిదే.. ఎన్నిక‌ల్లో గెలుపు గుర్రం ఎక్కేందుకే… అంటూ.. ఎడా పెడా నాయ‌కుల‌ను పార్టీ అధిష్టానం మార్చేసింది. ఇది రాజ‌కీయ వ్యూహాలు.. ఎన్నిక‌ల‌ వ్యూహాల్లో భాగ‌మైతే కావొచ్చు. పార్టీ బ‌లోపేతానికి, వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకునేందుకు ఒక అవ‌కాశం అయితే కావొచ్చు. కానీ, పార్టీ వ్యూహాలు ఎలా ఉన్నా.. క్షేత్ర‌స్థాయిలో నాయ‌కుల ఆలోచ‌న‌లు మాత్రం భిన్నంగా ఉన్నాయి. దీంతో అధిష్టానం చేసిన మార్పుల‌ను క్షేత్ర‌స్థాయిలో కేడ‌ర్ అర్ధం చేసుకోవ‌డం లేదు.

తాజాగా ఒక‌సారి 11, త‌ర్వాత 23, మ‌ళ్లీ 19, త‌ర్వాత 9 నియోజ‌క‌వ‌ర్గాలు(అసెంబ్లీ, పార్ల‌మెంటు)కు సంబంధించి నాయ‌కుల‌ను మార్చుతూ.. చేర్చుతూ పార్టీ అధిష్టానం జాబితాలు విడుద‌ల చేసింది. దీనిలో టికెట్లు ద‌క్క‌ని వారు కొంద‌రు.. ఉంటే.. నియోజ‌క‌వ‌ర్గాల మార్పు అయిన వారు ఎక్కువ‌గా ఉన్నారు. ఇలా నియోజ‌క‌వ‌ర్గాల్లో మార్పు జ‌రిగిన వారికే ఇప్పుడు అస‌లు సిస‌లు ప‌రీక్ష ఎదుర‌వుతోంది. నిన్న మొన్న‌టి వ‌ర‌కు ఓ నాయ‌కుడి వెంట తిరిగిన కేడ‌ర్‌.. ఇప్పుడు కొత్త‌నేత‌కు అలవాటు ప‌డ‌డం.. ఆయ‌న‌తో తిర‌గ‌డం అంతా అయోమ‌యంగా ఉంది.

ఈయ‌న ఏం చేస్తాడో తెలియ‌దు. అంటూ.. కేడ‌ర్ క్షేత్ర‌స్థాయిలో వ్యాఖ్యానిస్తోంది. అంతేకాదు.. కొత్త నేత‌ల‌కు .. మార్చిన నియోజ‌క‌వ‌ర్గాల్లో కేడ‌ర్‌ను ప‌రిచ‌యం చేసుకునే స‌మ‌యం కూడా లేకుండా పోయింది. దీనికితోడు టికెట్ ఆశించిన వారికి అవ‌కాశం లేక‌పోవ‌డంతో మెజారిటీ నాయ‌కులు ఎస్కేప్ అయ్యారు. కొత్త నేత‌ల‌కు స‌హ‌క‌రించేదిలేద‌ని.. పోన్ల ద్వారా త‌మ తమ వ‌ర్గాల‌కు సందేశాలు పంపుతున్నారు. దీంతో మార్పులు జ‌రిగిన నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ కేడ‌ర్ స్త‌బ్ద‌త‌గా ఉంది. ఈ ప‌రిణామాల‌ను ఊహించిన వైసీపీ అధిష్టానం చ‌ర్య‌ల‌కు దిగింది. బుజ్జ‌గింపుల‌కు తెర‌దీసింది. నామినేటెడ్ ప‌ద‌వులు ఇస్తామ‌ని కూడా చెబుతోంది. మ‌రి ఈ వ్యూహాలు ఏమేర‌కు ప‌నిచేస్తాయో చూడాలి.

Satya

Recent Posts

చివరికి స్మశానాలను కూడా వదలలేదు

అవినీతికి అడ్డూ అదుపు లేకుండా పోతోంది. తెలంగాణలో అవినీతి మరింతగా రాజ్యమేలుతోందని చెప్పక తప్పదు. రాష్ట్రంలో వరుసగా వెలుగు చూస్తున్న ఘటనలే…

13 minutes ago

పిల్లోడు యాక్సిడెంట్ చేయడం సహజం: జగన్

మాజీ సీఎం జగన్ మీడియా ముందుకు వస్తే చాలు…ఆయన నోటి నుంచి ఏం ఆణిముత్యాలు రాలుతాయో అని టీడీపీ, జనసేనకు…

1 hour ago

ఏనుగు ఇంతలా పగబట్టేసిందా

పాము పగబట్టడం విన్నాం... మనిషిపై మరో మనిషి పగబట్టడడమూ చూశాం. కానీ ఓ ఏనుగు పగబట్టడం... అది కూడా ఏళ్ల…

1 hour ago

భారత్ బోర్డర్లో దొరికిన అమెరికా మాజీ సైనికుడు… పెద్ద కుట్రేనా?

యూపీలోని మహారాజ్‌గంజ్ జిల్లా నేపాల్ సరిహద్దులో సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్‌బీ) బలగాలకు ఒక విదేశీయుడు పట్టుబడటం దేశవ్యాప్తంగా కలకలం…

3 hours ago

బహదూర్ పోరాటం ఎలా జరిగింది

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా సినిమా ఫలితాన్ని తేల్చి చెప్పేది బాక్సాఫీస్ వసూళ్లే. అవి ఎంత ఘనంగా వచ్చాయనే దాన్ని బట్టే…

3 hours ago

వంద కోట్ల ఆస్తి… పీకే సంచలన అఫిడవిట్!

రాజకీయ వ్యూహకర్త నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆస్తుల వివరాలు ఇప్పుడు పాలిటిక్స్ లో హాట్…

4 hours ago