కరోనా వ్యాక్సిన్ కోసం ప్రపంచవ్యాప్తంగా జనాలు ఎలా ఎదురు చూస్తున్నారో తెలిసిందే. వివిధ దేశాలు కోవిడ్ వ్యాక్సిన్ కోసం కొన్ని నెలలుగా ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. కొన్ని వ్యాక్సిన్లు త్వరలోనే మార్కెట్లోకి రాబోతున్నాయి.
ఐతే వాటి కంటే ముందే రష్యా తయారు చేసిన వ్యాక్సిన్ క్లినికల్ పరీక్షలన్నీ పూర్తి చేసుకుని ప్రభుత్వ అనుమతులు కూడా పొందింది. దీన్ని ఇంకొన్ని రోజుల్లోనే మార్కెట్లోకి తేవాలనుకుంటున్నారు. ఈలోపు రెండు దశల్లో 76 మంది వాలంటీర్లకు ఈ వ్యాక్సిన్ వేశారు.
ఆ వ్యాక్సిన్ పని తీరు ఎలా ఉందో తెలుసుకోవడానికి అంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అది సత్ఫలితాల్నే ఇచ్చిందని.. ప్రముఖ మెడికల్ జర్నల్ లాన్సెట్ వెల్లడించడం విశేషం. ‘స్పుత్నిక్-వి’ పేరుతో రష్యా అభివృద్ధి చేసిన ఈ వ్యాక్సిన్ ఉపయోగించిన వారి శరీరాల్లో యాంటీబాడీలు ఉత్పత్తి అవుతున్నాయని ఈ జర్నల్ వెల్లడించింది.
ఈ ఏడాది జూన్-జులై నెలల్లో రెండు దశల్లో 38 మంది చొప్పున మొత్తం 76 మందికి వ్యాక్సిన్ అందించారు. వారందరిలోనూ వంద శాతం యాంటీ బాడీలు ఉత్పత్తి అయినట్లు లాన్సెట్ పేర్కొంది. ఎవరీలోనూ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా లేవని ఆ జర్నల్ పేర్కొనడం గమనార్హం.
ఐతే వ్యాక్సిన్ను దీర్ఘకాలంలో భద్రంగా, మరింత ప్రభావంతంగా తీర్చిదిద్దేందుకు మరిన్ని పరీక్షలు, మరింత పర్యవేక్షణ అవసరం అని అభిప్రాయపడింది. ఐతే రష్యా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ విషయంలో ప్రపంచ వ్యాప్తంగా వైద్య నిపుణుల్లో అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. రష్యా ఏం చేసినా అనుమానంగా చూసే దేశాలు.. ఇంత త్వరగా ఆ దేశం వ్యాక్సిన్ వృద్ధి చేసిందంటే.. అది అన్ని రకాల ప్రమాణాలనూ అందుకుందంటే సందేహమే అన్నారు.
తొలి రెండు దశల క్లినికల్ ట్రయల్స్కు సంబంధించిన ఎలాంటి సమాచారమూ ఆ దేశం ప్రపంచంతో పంచుకోకపోవడం సందేహాలకు తావిచ్చింది. ఐతే ఇప్పుడు మెడికల్ జర్నల్ లాన్సెట్ ఈ వ్యాక్సిన్ గురించి సానుకూలంగా ప్రచురించడంతో రష్యాకు బలమొచ్చింది. మరి ఈ వ్యాక్సిన్ మార్కెట్లోకి ఎప్పుడొస్తుందో చూడాలి.
This post was last modified on September 5, 2020 8:49 am
దాయాదీ దేశాలు భారత్, పాకిస్తాన్ ల మధ్య యుద్ధం మొదలైపోయిందనే చెప్పాలి. ఈ మేరకు గురువారం యుద్ధం జరుగుతున్న తీరుకు…
ఓ వైపు పాకిస్తాన్ కుట్రపూరిత వ్యూహాలు, మరోవైపు ఆ దేశం పెంచి పోషిస్తున్న ఉగ్రవాద దాడులు… వెరసి నిత్యం భారత…
డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యా.. ఒకప్పుడు చాలామంది హీరోలు, హీరోయిన్లు ఈ మాట చెప్పేవారు. ఐతే గతంలో సినిమాల్లోకి రావాలంటే…
వైసీపీ నాయకులపై కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే పదుల సంఖ్యలో కేసులు పడ్డాయి. జైలు-బెయిలు అంటూ.. నాయకులు, అప్పట్లో వైసీపీకి అనుకూలంగా…
ఏపీని కుదిపేస్తున్న లిక్కర్ కుంభకోణం వ్యవహారంపై ఇప్పుడు కేంద్రం పరిధిలోని ఎన్ ఫోర్స్మెంటు డైరెక్టరేట్ దృష్టి పెట్టింది. ఏపీ మద్యం…
ఇండస్ట్రీలో అంతే. ఒక్క హిట్ జాతకాలను మార్చేస్తుంది. ఒక్క ఫ్లాప్ ఎక్కడికో కిందకు తీసుకెళ్తుంది. డ్రాగన్ రూపంలో సూపర్ సక్సెస్…