కరోనా వ్యాక్సిన్ కోసం ప్రపంచవ్యాప్తంగా జనాలు ఎలా ఎదురు చూస్తున్నారో తెలిసిందే. వివిధ దేశాలు కోవిడ్ వ్యాక్సిన్ కోసం కొన్ని నెలలుగా ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. కొన్ని వ్యాక్సిన్లు త్వరలోనే మార్కెట్లోకి రాబోతున్నాయి.
ఐతే వాటి కంటే ముందే రష్యా తయారు చేసిన వ్యాక్సిన్ క్లినికల్ పరీక్షలన్నీ పూర్తి చేసుకుని ప్రభుత్వ అనుమతులు కూడా పొందింది. దీన్ని ఇంకొన్ని రోజుల్లోనే మార్కెట్లోకి తేవాలనుకుంటున్నారు. ఈలోపు రెండు దశల్లో 76 మంది వాలంటీర్లకు ఈ వ్యాక్సిన్ వేశారు.
ఆ వ్యాక్సిన్ పని తీరు ఎలా ఉందో తెలుసుకోవడానికి అంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అది సత్ఫలితాల్నే ఇచ్చిందని.. ప్రముఖ మెడికల్ జర్నల్ లాన్సెట్ వెల్లడించడం విశేషం. ‘స్పుత్నిక్-వి’ పేరుతో రష్యా అభివృద్ధి చేసిన ఈ వ్యాక్సిన్ ఉపయోగించిన వారి శరీరాల్లో యాంటీబాడీలు ఉత్పత్తి అవుతున్నాయని ఈ జర్నల్ వెల్లడించింది.
ఈ ఏడాది జూన్-జులై నెలల్లో రెండు దశల్లో 38 మంది చొప్పున మొత్తం 76 మందికి వ్యాక్సిన్ అందించారు. వారందరిలోనూ వంద శాతం యాంటీ బాడీలు ఉత్పత్తి అయినట్లు లాన్సెట్ పేర్కొంది. ఎవరీలోనూ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా లేవని ఆ జర్నల్ పేర్కొనడం గమనార్హం.
ఐతే వ్యాక్సిన్ను దీర్ఘకాలంలో భద్రంగా, మరింత ప్రభావంతంగా తీర్చిదిద్దేందుకు మరిన్ని పరీక్షలు, మరింత పర్యవేక్షణ అవసరం అని అభిప్రాయపడింది. ఐతే రష్యా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ విషయంలో ప్రపంచ వ్యాప్తంగా వైద్య నిపుణుల్లో అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. రష్యా ఏం చేసినా అనుమానంగా చూసే దేశాలు.. ఇంత త్వరగా ఆ దేశం వ్యాక్సిన్ వృద్ధి చేసిందంటే.. అది అన్ని రకాల ప్రమాణాలనూ అందుకుందంటే సందేహమే అన్నారు.
తొలి రెండు దశల క్లినికల్ ట్రయల్స్కు సంబంధించిన ఎలాంటి సమాచారమూ ఆ దేశం ప్రపంచంతో పంచుకోకపోవడం సందేహాలకు తావిచ్చింది. ఐతే ఇప్పుడు మెడికల్ జర్నల్ లాన్సెట్ ఈ వ్యాక్సిన్ గురించి సానుకూలంగా ప్రచురించడంతో రష్యాకు బలమొచ్చింది. మరి ఈ వ్యాక్సిన్ మార్కెట్లోకి ఎప్పుడొస్తుందో చూడాలి.
This post was last modified on September 5, 2020 8:49 am
హనుమాన్ అంశ్ కలెక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్తో మొదలైన సినిమా రూ.200 కోట్ల…
నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ నుంచి వచ్చిన తొలి పాట ‘ఆయా షేర్’ అద్భుతమైన స్పందన తెచ్చుకుని ఎక్కడికో…
ఖైదీ నెంబర్ 150 నుంచి కంబ్యాక్ అయ్యాక ఎప్పుడూ చూడని ఒక విచిత్రమైన పరిస్థితిని చిరంజీవి ఎదురుకుంటున్నట్టు మెగా వర్గాల…
నిన్న విడుదలైన ఎపిక్ మీద సోషల్ మీడియా లోపలా బయటా మిక్స్డ్ టాక్ నడుస్తున్న మాట వాస్తవం. ఈ విషయాన్ని…
ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు.. ఫేస్ బుక్ వెతుకుతున్నారు.. సిగ్నల్ సింబల్ గిర్రున తిరుగుతోంది కానీ రీల్స్ ముందుకు జరగడం లేదు.…
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కోల్ కతాలోని కాళీ ఘాట్ ఆలయంలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన చేపల కూర…