కరోనా వ్యాక్సిన్ కోసం ప్రపంచవ్యాప్తంగా జనాలు ఎలా ఎదురు చూస్తున్నారో తెలిసిందే. వివిధ దేశాలు కోవిడ్ వ్యాక్సిన్ కోసం కొన్ని నెలలుగా ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. కొన్ని వ్యాక్సిన్లు త్వరలోనే మార్కెట్లోకి రాబోతున్నాయి.
ఐతే వాటి కంటే ముందే రష్యా తయారు చేసిన వ్యాక్సిన్ క్లినికల్ పరీక్షలన్నీ పూర్తి చేసుకుని ప్రభుత్వ అనుమతులు కూడా పొందింది. దీన్ని ఇంకొన్ని రోజుల్లోనే మార్కెట్లోకి తేవాలనుకుంటున్నారు. ఈలోపు రెండు దశల్లో 76 మంది వాలంటీర్లకు ఈ వ్యాక్సిన్ వేశారు.
ఆ వ్యాక్సిన్ పని తీరు ఎలా ఉందో తెలుసుకోవడానికి అంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అది సత్ఫలితాల్నే ఇచ్చిందని.. ప్రముఖ మెడికల్ జర్నల్ లాన్సెట్ వెల్లడించడం విశేషం. ‘స్పుత్నిక్-వి’ పేరుతో రష్యా అభివృద్ధి చేసిన ఈ వ్యాక్సిన్ ఉపయోగించిన వారి శరీరాల్లో యాంటీబాడీలు ఉత్పత్తి అవుతున్నాయని ఈ జర్నల్ వెల్లడించింది.
ఈ ఏడాది జూన్-జులై నెలల్లో రెండు దశల్లో 38 మంది చొప్పున మొత్తం 76 మందికి వ్యాక్సిన్ అందించారు. వారందరిలోనూ వంద శాతం యాంటీ బాడీలు ఉత్పత్తి అయినట్లు లాన్సెట్ పేర్కొంది. ఎవరీలోనూ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా లేవని ఆ జర్నల్ పేర్కొనడం గమనార్హం.
ఐతే వ్యాక్సిన్ను దీర్ఘకాలంలో భద్రంగా, మరింత ప్రభావంతంగా తీర్చిదిద్దేందుకు మరిన్ని పరీక్షలు, మరింత పర్యవేక్షణ అవసరం అని అభిప్రాయపడింది. ఐతే రష్యా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ విషయంలో ప్రపంచ వ్యాప్తంగా వైద్య నిపుణుల్లో అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. రష్యా ఏం చేసినా అనుమానంగా చూసే దేశాలు.. ఇంత త్వరగా ఆ దేశం వ్యాక్సిన్ వృద్ధి చేసిందంటే.. అది అన్ని రకాల ప్రమాణాలనూ అందుకుందంటే సందేహమే అన్నారు.
తొలి రెండు దశల క్లినికల్ ట్రయల్స్కు సంబంధించిన ఎలాంటి సమాచారమూ ఆ దేశం ప్రపంచంతో పంచుకోకపోవడం సందేహాలకు తావిచ్చింది. ఐతే ఇప్పుడు మెడికల్ జర్నల్ లాన్సెట్ ఈ వ్యాక్సిన్ గురించి సానుకూలంగా ప్రచురించడంతో రష్యాకు బలమొచ్చింది. మరి ఈ వ్యాక్సిన్ మార్కెట్లోకి ఎప్పుడొస్తుందో చూడాలి.
This post was last modified on September 5, 2020 8:49 am
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి కేవలం ఎనిమిది నెలల్లో మూడో సినిమా రాబోతోంది. గత ఏడాది రెండు నెలల…
కాదేది బూతుకు అనర్హం అన్నారో సినీ కవి. కొందరు దీన్ని నిజం చేసే పనిలో ఉన్నారు. ఇటీవలే కన్నడ ప్యాన్…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆ పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. దీనిపై ఇటీవలి…
తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు జిఓ కోసం ఎదురు చూసిన మైత్రి సంస్థకు చివరికి అది జరిగే సూచనలు లేకపోవడంతో…
'ద హండ్రెడ్' వేలంలో పాకిస్థాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ను సన్రైజర్స్ లీడ్స్ కొనుగోలు చేయడం ఊహించని వివాదానికి దారితీస్తోంది. ఈ…
రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ స్థాయిలో కూడా సంచలనంగా మారిన మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ పార్టీ వ్యవహారం…