Political News

కాంగ్రెస్ కి పెద్ద షాకే ఇది

తెలంగాణాలో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి గవర్నర్ తమిళిసై మొదటి షాక్ ఇచ్చారా ? పార్టీ వర్గాల సమాచారం ప్రకారం అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇంతకీ విషయం ఏమిటంటే గవర్నర్ కోటాలో భర్తీ చేయాల్సిన రెండు ఎంఎల్సీ స్ధానాల భర్తీపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం రెడీ అయ్యింది. భర్తీ చేయాల్సిన రెండుపేర్లపై రేవంత్ పెద్ద కసరత్తే చేస్తున్నారు. ఇదే విషయమై పార్టీలోని కొందరు సీనియర్లతో పాటు అధిష్టానంతో కూడా చర్చలు జరిపారు. ఒకటిరెండు రోజుల్లో ఎంపిక కూడా అయిపోవాలని అనుకుంటున్నారు రేవంత్.

సరిగ్గా ఇలాంటి సమయంలో గవర్నర్ కోటా భర్తీకి రాజ్ భవన్ రెడ్ సిగ్నల్ చూపించింది. కోర్టులో కేసు విచారణలో ఉన్న కారణంగా రెండసీట్లను భర్తీ చేయటం సాధ్యంకాదని గవర్నర్ తమిళిసై ముఖ్యమంత్రికి కబురుచేశారు. కేసీయార్ పాలనలో ఈ రెండుస్ధానాల భర్తీ కోసం గవర్నర్ కు సిఫారసు చేశారు. ఏదైనా రంగాల్లో నిపుణులను రెండు స్ధానాల్లో భర్తీ చేయాల్సుంటుంది. అయితే ఇపుడు ఆ వృత్తులు, నిపుణులు అన్నదంతా పక్కకుపోయింది. భర్తీ అవుతున్నదంతా అచ్చంగా రాజకీయ కారణాలు, నేతలతోనే అని అందరికీ తెలిసిందే.

అదే పద్దతిలో కేసీయార్ హయాంలో దాసోజు శ్రవణ్, సత్యనారాయణ అనే నేతలను సిఫారసు చేశారు. అయితే గవర్నర్ ఆ ఫైలును పెండింగులో పెట్టేశారు. కేసీయార్ ప్రభుత్వం ఎంత ప్రయత్నించినా గవర్నర్ మాత్రం ఫైలుపై సంతకం చేయలేదు. దాంతో ఏమి చేయలేక కేసీయార్ ఆ ఫైలును పక్కనపడేశారు. దాంతో అప్పటినుండి ఆ రెండుస్ధానాలు భర్తీ కాకుండా అలాగే ఆగిపోయింది.

పెండింగులో ఉన్న రెండుస్ధానాలను భర్తీచేసే అవకాశం ఇపుడు తమకు వచ్చిందని రేవంత్ రెడ్డితో పాటు అందరు అనుకున్నారు. అందుకనే హడావుడిగా కసరత్తు కూడా మొదలుపెట్టేశారు. తీరా ఇపుడు రాజ్ భవన్ ఏమో మొత్తం కసరత్తును ఆపేయాలన్నట్లుగా సమాచారం ఇచ్చింది. ఎందుకంటే కేసీయార్ హయాంలోనే ఎంఎల్సీల ఫైలుపై గవర్నర్ సంతకం చేయకపోవటాన్ని చాలెంజ్ చేస్తు కోర్టులో కేసు దాఖలు చేశారు. ఆ కేసు ఇంకా పెండింగులోనే ఉంది. కోర్టులో కేసు క్లియర్ అయితే తప్ప గవర్నర్ కోటాను భర్తీ చేసేందుకు లేదని చల్లగా చెప్పారు.

This post was last modified on January 18, 2024 4:53 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

ఒక‌రు తీర్థ యాత్ర‌లు.. మ‌రొక‌రు విదేశీ యాత్ర‌లు!

ఏపీలో ఎన్నిక‌లు ముగిసిన త‌ర్వాత‌.. ఒక‌వైపు తీవ్రమైన హింస చెల‌రేగిన విష‌యం తెలిసిందే. ఇదెలా ఉన్నా అధికార, ప్ర‌తిపక్ష నాయ‌కులు…

2 hours ago

పోలీసులు ఏంచేస్తున్నారు.. చంద్ర‌బాబు ఆవేద‌న‌

ఏపీలో జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల పోలింగ్ అనంత‌రం.. ప‌ల్నాడు, తిరుప‌తి, తాడిప‌త్రి ప్రాంతాల్లో చెల‌రేగిన హింస‌పై చంద్ర‌బాబు ఆవేద‌న వ్య‌క్తం…

2 hours ago

ఏపీ హింస‌.. నిప్పులు చెరిగిన ఈసీ..

రాష్ట్రంలో జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల పోలింగ్ ప్ర‌క్రియ ముగిసిన త‌ర్వాత చెల‌రేగిన తీవ్ర హింస‌ పై కేంద్ర ఎన్నికల సంఘం…

8 hours ago

దెయ్యాన్ని ప్రేమించే ‘లవ్ మీ’ కుర్రాడు

https://www.youtube.com/watch?v=BacOcD8e_3k బాక్సాఫీస్ డ్రైగా ఉన్న టైంలో సరైన సినిమా కోసం మూవీ లవర్సే కాదు ట్రేడ్ మొత్తం ఎదురు చూస్తోంది.…

15 hours ago

రవితేజ సమస్యే నానికి వచ్చిందా

కథలు, కాంబోలు చూసేందుకు ఎంత బాగున్నా బడ్జెట్ విషయంలో ప్రాక్టికల్ గా ఆలోచించకపోతే చాలా సమస్యలు తలెత్తే పరిస్థితులను నిర్మాతలు…

17 hours ago

విశ్వంభరలో స్టాలిన్ అక్కయ్య

చిరంజీవి హీరోగా వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న విశ్వంభర షూటింగ్ ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్విరామంగా జరిగిపోతోంది. ఎన్నికలు ప్లస్ విదేశీ…

18 hours ago