బీఆర్ఎస్ మళ్ళీ రివర్సవబోతోందా ? పార్టీలో జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే అందరిలోను ఇవే అనుమానాలు పెరిగిపోతున్నాయి. తొందరలో జరగబోయే పార్లమెంటు ఎన్నికలకు కేటీయార్ సన్నాహక సమావేశాలను నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు జరిగిన సమావేశాల్లో మెజారిటి నేతలు టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చటం పెద్ద తప్పుగా చెప్పారట. తాజాగా ఎంఎల్ఏ కడియం శ్రీహరి మాట్లాడినపుడు కూడా టీఆర్ఎస్ స్ధానంలో బీఆర్ఎస్ ఏర్పాటు చేయటం పెద్ద తప్పన్నారు. పార్టీ పేరులో నుండి తెలంగాణా ఎప్పుడైతే దూరమైందో అప్పుడే పార్టీకి జనాలు దూరమైనట్లు చాలామంది నేతలు స్పష్టంగా చెప్పారట.
అంటే ప్రత్యక్షంగానో లేకపోతే పరోక్షంగానో ఎన్నికల్లో ఓటమికి కేసీయార్ నిర్ణయాలే కారణమని చెప్పేస్తున్నారు. ఏ నియోజకవర్గం సమీక్ష నిర్వహించినా పార్టీ నేతలు, క్యాడర్ పూర్తిగా అగ్రనాయకత్వాన్నే తప్పుపడుతున్నారు. అధిష్టానం చేసిన తప్పులవల్ల, అనుసరించిన ఏకపక్ష విధానాలే పార్టీ ఓటమికి కారణమని స్పష్టంగా చెబుతున్నారు. దాంతో అగ్రనాయకత్వంపై పార్టీ నేతలు, క్యాడర్లో ఎంత మంటుందన్న విషయం బయటపడుతోంది. పార్లమెంటు ఎన్నికలకు ముందు నేతలు, క్యాడర్లో బయటపడుతున్న అసంతృప్తి రాబోయే ఎన్నికల్లో రిఫ్లెక్టవుతుందా అనే సందేహాలు పెరిగిపోతున్నాయి. మెజారిటి నేతల ఆలోచనల ప్రకారం బీఆర్ఎస్ మళ్ళీ టీఆర్ఎస్ అవుతుందా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.
తొందరలో జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో కేసీయార్ కు మళ్ళీ ఎదురుదెబ్బ తప్పదా అనే సందేహాలు పెరిగిపోతున్నాయి. ఎందుకంటే కేసీయార్ పాలనపై జనాగ్రహం ఇంకా తగ్గలేదని నేతలు సమీక్షల్లో ప్రస్తావిస్తున్నారట. పైగా అసెంబ్లీ ఎన్నికలు జరిగిన మూడునెలల్లోపే పార్లమెంటు ఎన్నికలు జరుగుతుండటం కూడా బీఆర్ఎస్ కు పెద్ద సమస్యగా మారబోతోంది. ఎందుకంటే అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి రేవంత్ రెడ్డి ప్రజానుకూల నిర్ణయాలే తీసుకుంటున్నారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కోటిగా అమల్లోకి తెస్తున్నారు. ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలను గౌరవిస్తున్నారు. అన్ని వర్గాల జనాలకు అందుబాటులో ఉంటున్నారు. బాధ్యతలు తీసుకున్న వెంటనే మొదలుపెట్టిన ప్రజాదర్బార్ (ప్రజావాణి) కార్యక్రమం సూపర్ సక్సెస్ అయ్యింది. ముఖ్యమంత్రిగా కేసీయార్ పదేళ్ళ పాలనతో రేవంత్ నెలరోజుల పాలనను జనాలు పోల్చిచూసుకుంటున్నారు. కాబట్టి ఇలాంటి జనాభిప్రాయంతోనే కాంగ్రెస్ మెజారిటి సీట్లు గెలుస్తుందని అంచనా వేస్తున్నారు. కాబట్టి బీఆర్ఎస్ కు కష్టాలు తప్పవనే అంచనాలు పెరిగిపోతున్నాయి. చివరకు ఏమి జరుగుతుందో చూడాలి.
This post was last modified on January 12, 2024 9:22 pm
ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…
నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…
కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు.. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలకు కేరళలో తీవ్రనిరసన సెగ తగులుతోంది. రాహుల్-ప్రియాంక.. కేరళ మిమ్మల్ని క్షమించదు.…
నిజమేనండోయ్… జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏదైనా మాట ఇచ్చారంటే దానిని నెరవేర్చి తీరతారు. ఇందుకు…
కేంద్ర హోం శాఖ సహాయం మంత్రి బండి సంజయ్ తనయుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి…
తెలంగాణలో సింగిల్ స్క్రీన్లను నడిపించే ఎగ్జిబిటర్లకు, నిర్మాతలకు మధ్య పీటముడి గట్టిగానే బిగుసుకునేలా కనిపిస్తోంది. అద్దె విధానం పక్కన పెట్టి…