వైసీపీ రెబల్ ఎంపీ, ఫైర్ బ్రాండ్ నాయకుడు.. కనుమూరి రఘురామకృష్ణరాజుకు ఏపీ హైకోర్టు అభయం ఇచ్చింది. సంక్రాంతిని పురస్కరించుకుని తన సొంత నియోజకవర్గం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని నరసాపురం నియోజకవర్గానికి వెళ్తానని.. అయితే.. ఏపీ పోలీసులు తనపై కేసులుపెట్టి నిర్బంధించే అవకాశం ఉందని.. దీనిని నిలువరించాలని.. ఆయన కొన్ని రోజుల కిందట పిటిషన్ దాఖలు చేశారు. తనపై కేసులు నమోదు చేయకుండా పోలీసులను, ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఆయన కోరారు. సంక్రాంతిని తన కుటుంబంతో సహా జరుపుకొనేలా అవకాశం కల్పించాలని కోరారు.
దీనిపై విచారణ చేపట్టి రాష్ట్ర హైకోర్టు.. తాజాగా కీలక ఆదేశాలు జారీ చేసింది. రఘురామపై ఎలాంటి కేసులు నమోదు చేయాల్సి వచ్చినా.. ముందుగా ఆయనకు 41 ఏ కింద నోటీసులు ఇవ్వాలని.. తగిన సమయం ఇచ్చి ముందుగా వివరణ తీసుకోవాలని సూచించింది. అంతేకాదు.. ఆయనను నిర్బంధించడానికి వీల్లేదని తెలిపింది. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పులు, ఆదేశాల మేరకు ఏపీ పోలీసులు వ్యవహరించాలని హైకోర్టు తేల్చి చెప్పింది. “నిర్బయంగా మీరు ఊరెళ్లండి” అని రఘురామ తరఫున న్యాయవాదికి ఏపీ హైకోర్టు తేల్చి చెప్పింది.
ఎంపీ రఘురామపై ఎలాంటి ఫిర్యాదులున్నా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ పాటించాల్సిందేనని ఏపీ పోలీసుల తరఫున న్యాయవాదికి హైకోర్టు స్పష్టం చేసింది. ఏదైనా సరే.. కేసు పెట్టాలంటే ముందుగా ఆయనకు తెలియపరిచి.. సంబంధిత నోటీసులు ఇవ్వాలని, ఆయన నుంచి వివరణ తీసుకున్న తర్వాతే.. కేసులు పెట్టాలని తెలిపింది. పిటిషనర్ తరఫున సీనియర్ లాయర్ వైవీ రవిప్రసాద్, ఉమేశ్ చంద్ర వాదనలు వినిపించారు. దీంతో రఘురామ ఏపీకి వచ్చేందుకు మార్గం సుగమమైంది. ఎంపీగా గెలిచిన తర్వాత.. ఆయనవైసీపీతో విభేదించిన విషయం తెలిసిందే. తర్వాత.. ఆయన దాదాపు ఏపీకి రావడమే లేదు. గతంలో ఏపీ సీఐడీ ఆయనను అరెస్టు చేయడం.. తనపై పోలీసులు భౌతిక దాడులు చేశారని ఎంపీ రఘురామ పేర్కొనడం.. దీనిపైనా విచారణ జరగడం తెలిసిందే.
ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ కు ఒక ఎక్స్ పైరీ డేట్ ఉంటుందనేది ఎప్పటినుంచో వినిపించే మాటే. పాతికేళ్ల నుంచి ముప్పై…
మహారాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు దేవేంద్ర ఫడణవీస్తో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్…
విజయవాడ పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా ముగిసింది. ఏర్పాట్ల దగ్గరి నుంచి అయిపోయే దాకా ఎక్కడా అపశ్రుతి లేకుండా…
తెలంగాణ నాయకురాలు, తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) పార్టీ అధ్యక్షురాలు కవిత తాజాగా చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున…
పెద్ది నుంచి ఏదైనా బ్యాంగర్ లాంటి కంటెంట్ కావాలని ఎదురు చూస్తున్న అభిమానులకు అది మస్సా మస్సా వీడియో సాంగ్…
ఏపీ సీఎం చంద్రబాబు.. తాజాగా కల్లు రుచి చూశారు. వాస్తవానికి ఆయన ఇలాంటి వాటికి కడు దూరంగా ఉంటారు. అయితే..…