Political News

నిర్భ‌యంగా మీ ఊరెళ్లండి: హైకోర్టు

వైసీపీ రెబ‌ల్ ఎంపీ, ఫైర్ బ్రాండ్ నాయ‌కుడు.. క‌నుమూరి ర‌ఘురామ‌కృష్ణ‌రాజుకు ఏపీ హైకోర్టు అభ‌యం ఇచ్చింది. సంక్రాంతిని పుర‌స్క‌రించుకుని త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం ఉమ్మ‌డి ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలోని న‌ర‌సాపురం నియోజ‌క‌వ‌ర్గానికి వెళ్తాన‌ని.. అయితే.. ఏపీ పోలీసులు త‌న‌పై కేసులుపెట్టి నిర్బంధించే అవ‌కాశం ఉందని.. దీనిని నిలువ‌రించాల‌ని.. ఆయ‌న కొన్ని రోజుల కింద‌ట పిటిష‌న్ దాఖ‌లు చేశారు. త‌న‌పై కేసులు న‌మోదు చేయ‌కుండా పోలీసులను, ప్ర‌భుత్వాన్ని ఆదేశించాల‌ని ఆయ‌న కోరారు. సంక్రాంతిని త‌న కుటుంబంతో స‌హా జ‌రుపుకొనేలా అవ‌కాశం క‌ల్పించాల‌ని కోరారు.

దీనిపై విచార‌ణ చేప‌ట్టి రాష్ట్ర హైకోర్టు.. తాజాగా కీల‌క ఆదేశాలు జారీ చేసింది. ర‌ఘురామ‌పై ఎలాంటి కేసులు న‌మోదు చేయాల్సి వ‌చ్చినా.. ముందుగా ఆయ‌న‌కు 41 ఏ కింద నోటీసులు ఇవ్వాల‌ని.. త‌గిన స‌మ‌యం ఇచ్చి ముందుగా వివ‌ర‌ణ తీసుకోవాల‌ని సూచించింది. అంతేకాదు.. ఆయ‌న‌ను నిర్బంధించ‌డానికి వీల్లేద‌ని తెలిపింది. సుప్రీంకోర్టు గ‌తంలో ఇచ్చిన తీర్పులు, ఆదేశాల మేర‌కు ఏపీ పోలీసులు వ్య‌వ‌హ‌రించాల‌ని హైకోర్టు తేల్చి చెప్పింది. “నిర్బ‌యంగా మీరు ఊరెళ్లండి” అని ర‌ఘురామ త‌ర‌ఫున న్యాయ‌వాదికి ఏపీ హైకోర్టు తేల్చి చెప్పింది.

ఎంపీ ర‌ఘురామ‌పై ఎలాంటి ఫిర్యాదులున్నా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ పాటించాల్సిందేనని ఏపీ పోలీసుల త‌ర‌ఫున న్యాయ‌వాదికి హైకోర్టు స్పష్టం చేసింది. ఏదైనా స‌రే.. కేసు పెట్టాలంటే ముందుగా ఆయ‌నకు తెలియ‌ప‌రిచి.. సంబంధిత నోటీసులు ఇవ్వాలని, ఆయ‌న నుంచి వివ‌ర‌ణ తీసుకున్న త‌ర్వాతే.. కేసులు పెట్టాల‌ని తెలిపింది. పిటిషనర్ తరఫున సీనియర్ లాయర్ వైవీ రవిప్రసాద్, ఉమేశ్ చంద్ర వాదనలు వినిపించారు. దీంతో ర‌ఘురామ ఏపీకి వ‌చ్చేందుకు మార్గం సుగ‌మ‌మైంది. ఎంపీగా గెలిచిన త‌ర్వాత‌.. ఆయ‌న‌వైసీపీతో విభేదించిన విష‌యం తెలిసిందే. త‌ర్వాత‌.. ఆయ‌న దాదాపు ఏపీకి రావ‌డ‌మే లేదు. గ‌తంలో ఏపీ సీఐడీ ఆయ‌న‌ను అరెస్టు చేయ‌డం.. త‌న‌పై పోలీసులు భౌతిక దాడులు చేశార‌ని ఎంపీ ర‌ఘురామ పేర్కొన‌డం.. దీనిపైనా విచార‌ణ జ‌ర‌గ‌డం తెలిసిందే.

Satya

Recent Posts

13 ఏళ్ల బాలుడు బాబు గారితో ఫోటో కోసం…

సినిమాల్లో వేషం కోసం చెన్నయ్ వెళ్లారు.. అభిమాన హీరోని కలిసి ఎందుకు హైదరాబాదు వెళ్లారు.. అనే వార్తలను తరచూ వింటూ…

5 hours ago

టికెట్ రేట్లు చేస్తున్న మేలు అర్థమవుతోందా

లెనిన్ సూపర్ హిట్టయిపోయింది. బ్లాక్ బస్టర్ దారిలో ఉంది. పదేళ్లకు పైగా విజయం కోసం మొహం వాచిపోయిన అఖిల్ అభిమానులకు…

6 hours ago

పోల‌వ‌రంపై చంద్ర‌బాబు శ‌ప‌థం

పోల‌వ‌రం ప్రాజెక్టును ఆరు నూరైనా పూర్తి చేస్తామ‌ని సీఎం చంద్ర‌బాబు శ‌ప‌థం చేశారు. గోదావ‌రి జిల్లాల్లో ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన ఆయ‌న…

8 hours ago

నాగార్జున 101 ఫిక్సయిందా?

అక్కినేని నాగార్జున కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 100వ సినిమా కోసం అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కానీ…

8 hours ago

ఇప్పుడున్న రాజకీయాల్లో ఎన్టీఆర్‌ ఇమ‌డ‌గ‌ల‌రా?

జూనియ‌ర్ ఎన్టీఆర్‌.. రాజ‌కీయ రంగ ప్ర‌వేశంపై త‌ర‌చుగా ప్ర‌చారం జ‌రుగుతూనే ఉంది. ఆయ‌న‌కు అను కూలంగా ఏపీలోనూ కొన్ని ప్రాంతాల్లో…

9 hours ago

చిరు దిగాడు… పంచాయితీ ముగిసింది

తెలుగు టాప్ కొరియోగ్రాఫ‌ర్ల‌యిన జానీ మాస్ట‌ర్, శేఖ‌ర్ మాస్ట‌ర్ ప‌ర‌స్ప‌రం అరుచుకుంటూ ఒక‌రి మీదికి ఒక‌రు దూసుకువెళ్తున్న వీడియో తాజాగా…

9 hours ago