Political News

‘జ‌గ‌న్ ని కాదు.. న‌న్ను చూసి గెలిపించండి ప్లీజ్‌’

వైసీపీలో కొత్త స్వ‌రం వినిపించింది. ఇప్ప‌టి వ‌ర‌కు సీఎం జ‌గ‌న్ కోసం.. ఆయ‌న‌ను తిరిగి ముఖ్య‌మంత్రిని చేయ‌డం కోస‌మే తాము ప‌నిచేస్తున్నామ‌ని చెప్పుకొన్న నాయ‌కులు.. ఇప్పుడు ఒక్కొక్క‌రుగా స్వ‌రం మారుస్తున్నారు. సీఎం కాదు.. మ‌మ్మ‌ల్ని చూసి గెలిపించండి అంటూ.. పిలుపునిస్తున్నారు. కొన్నాళ్ల కింద‌ట‌.. ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లాలో ఒక ఎమ్మెల్యే ఇదే మాట వినిపించారు. అప్ప‌ట్లో ఈ వ్యాఖ్య‌లు వైసీపీలో మంట‌లు రేపాయి. దీనిపై ఆయ‌న అధిష్టానానికి వివ‌ర‌ణ కూడా ఇచ్చుకున్నారు.

అయితే.. ఆ విష‌యం మ‌రుగున ప‌డిందిలే అనుకునేలోగా.. తాజాగా అసెంబ్లీ డిప్యూటీ స్పీక‌ర్‌, విజ‌య‌న‌గరం ఎమ్మెల్యే, వైశ్య సామాజిక వ‌ర్గానికి చెందిన సీనియ‌ర్ నాయ‌కుడు కోల‌గ‌ట్ల వీర‌భ‌ద్ర‌స్వామి కూడా ఇదే దారి ప‌ట్టారు. తాజాగా ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. “వ‌చ్చే ఎన్నిక‌ల్లో న‌న్ను చూసి గెలిపించండి. సీఎంను కాదు. జ‌గ‌న్ ఫొటోను చూసి కాదు. న‌న్ను, నా ప‌నితీరును చూసి గెలిపించండి” అని కోల‌గ‌ట్ల ప్ర‌క‌టించారు.

విజ‌య‌న‌గ‌రం నియోజ‌క‌వ‌ర్గంలోని ఉపాధ్యాయ‌, ఉద్యోగ సంఘాల నాయ‌కుల‌తో తాజాగా ఆదివారం ఆయ‌న ర‌హ‌స్యంగా భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా కోల‌గ‌ట్ల మాట్లాడుతూ.. “మీకు ప్ర‌భుత్వంపై పీక‌ల వ‌ర‌కు కోపం ఉంది. ఆ విష‌యం నాకు తెలుసు. మీ డిమాండ్లు ప‌రిష్కారం కాలేదు. మీరు సీఎం జ‌గ‌న్‌పై కోపంతో ఉన్నారు. అలాగ‌ని నాకు వ్య‌తిరేకం కావొద్దు. నేను మీ వాణ్ని. ఏ పార్టీలో ఉన్నా.. మీ కోసం ప‌నిచేస్తున్నాను. గ‌తంలోనూ మీకు మేలు చేశాను. సో.. న‌న్ను చూసి ఓటేయండి. సీఎం జ‌గ‌న్‌ను కాదు” అని ఆయ‌న చెప్పుకొచ్చారు.

మ‌రి ఈ వ్యాఖ్య‌లు ఏ మేర‌కు వీర‌భ‌ద్ర‌స్వామికి మేలు చేస్తాయో చూడాలి. అయితే.. మ‌రోవైపు వైసీపీ మాత్రం సీఎం జ‌గ‌న్‌ను చూపించే ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌ని అభ్య‌ర్థుల‌కు దిశానిర్దేశం చేస్తున్నారు. కానీ, క్షేత్ర‌స్థాయిలో ఒక‌రిద్ద‌రు(ఇప్ప‌టికి) మాత్రం త‌మ ను చూసి ఓటేయాల‌ని కోరుతుండ‌డం గ‌మ‌నార్హం

This post was last modified on January 8, 2024 3:16 pm

Share

Recent Posts

సూపర్ స్టార్ కూతురు ఎలా చేసింది

మలయాళం సూపర్ స్టార్ గా పేరొందిన మోహన్ లాల్ కూతురు విస్మయ ఈ శుక్రవారం విడుదల కాబోతున్న తుదక్కంతో తెరంగేట్రం…

1 hour ago

పీకే విక్టరీ బీజేపీకి డేంజర్ బెల్స్ మోగించినట్టేనా?

బీహార్.. జాతీయ రాజకీయాల్లో మరోమారు పతాక శీర్షికలకు ఎక్కేసింది. నిన్నటిదాకా బీజేపీ, జేడీయూ మైత్రి... జేడియూ చీఫ్ నితీశ్ కుమార్ నుంచి పాలనా…

4 hours ago

40 నిముషాల్లోనే శ్రీవారి దర్శనం… కేవలం వారికే!

నమ్మలేక పోతున్నారా… అయినా ఇది నిజం. తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలంటే గంటల తరబడి వేచి చూడాల్సి వస్తుందన్న సంగతి అందరికీ…

8 hours ago

జంతర్ మంతర్ కు చెక్ ?

దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ కు ఇటీవల ఎక్కడ లేని ప్రాచుర్యం లభించింది. నీట్ పేపర్ లీకేజి కి…

12 hours ago

సత్య హాస్యం చాలా ప్లస్ అవుతోంది

గతంలో బ్రహ్మానందం, బాబు మోహన్ లాంటి కమెడియన్స్ ఉన్నప్పుడు వాళ్ళ కోసమే విడిగా కామెడీ ఎపిసోడ్స్ రాసేవాళ్ళు. మెయిన్ రైటర్స్…

12 hours ago

వెంక‌ట‌ప్ప ఫెయిల్… ఇక మాలిక్ ఏం చేస్తాడో?

తెలుగు సినిమా చ‌రిత్ర‌లోనే అత్యంత గొప్ప న‌టుల జాబితా తీస్తే.. అందులో పైవ‌రుస‌లో ఉండే ఆర్టిస్టుల్లో మోహన్ బాబు ఒక‌రు.…

13 hours ago