విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఈ దఫా గెలుపు పక్కా అని టీడీపీ రాసి పెట్టుకుంది. ఎందుకంటే.. ఇక్కడి వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే, నియోజకవర్గంతో గట్టి అనుబంధం పెంచుకున్న మల్లాది విష్ణును వైసీపీ పక్కన పెట్టింది. నియోజకవర్గతో సంబంధం లేని పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావుకు ఇక్కడ ఇంచార్జ్ బాధ్యతలు అప్పగించింది. దీంతో టీడీపీ ఆశలు మరింతగా పెరిగాయి. వాస్తవానికి ఈ దఫా మల్లాది పోటీ చేసినా.. గెలుపు టీడీపీదేననే అంచనాలు వున్నాయి.
సిట్టింగ్ ఎమ్మెల్యేపై వ్యతిరేకత, టీడీపీ మాజీ ఎమ్మెల్యే బొండా ఉమాపై సానుభూతి వంటివి పనిచేస్తాయని భావించారు. ఈ నేపథ్యంలోనే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో గెలుపు పక్కా అని టీడీపీ ఒక నిర్ణయానికి వచ్చింది. 2019 ఎన్నికల్లో విజయవాడ తూర్పులో విజయం దక్కించుకున్న టీడీపీ.. వైసీపీ హవాలోనూ తన నేత గద్దె రామ్మోహన్ను గెలిపించుకుంది. ఇక, సెంట్రల్ నియోజకవర్గం విషయానికి వస్తే.. గట్టి పోటీ ఇచ్చింది. టీడీపీ అప్పటి సిట్టింగ్ ఎమ్మెల్యే బొండా ఉమా వర్సెస్ వైసీపీ అభ్యర్థి మల్లాది విష్ణు మధ్య హోరా హోరీ పోరు సాగింది. కేవలంం 25 ఓట్ల తేడాతో మల్లాది విజయం సాధించారు.
దీనిని బట్టి సెంట్రల్లో టీడీపీ ఎంత బలంగా ఉందో అర్థమవుతుంది. అయితే.. అప్పట్లో టీడీపీ ఇంతగా బలోపేతం కావడానికి ఎంపీ అభ్యర్థిగా ఉన్న ప్రస్తుత పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని కారణమనే వాదన ఉంది. ఆర్థికంగా ఆయన బొండాకు ఎంతగానో సహకరించారనేది కూడా నిర్వివాదాంశం. ప్రచార ఖర్చుల నుంచి అంతో ఇంతో పంపిణీ వరకు కూడా కేశినేని నాని సహకరించా రని అంటారు. అయితే.. ఇప్పుడు నాని తప్పుకొంటున్నట్టు ప్రకటించారు. తనకు టికెట్ ఇవ్వడం లేదని.. ఇక, తాను పార్టీలో ఉండనని ఆయన చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సెంట్రల్ నియోజకవర్గంపై ప్రభావం పడుతుందా? అనేది ప్రశ్న.
ఆర్థికంగా చూసుకుంటే.. కేశినేని సోదరుడు చిన్న అలియాస్ శివనాథ్ ఖర్చుకు వెనుకాడకపోయినా.. కేశినేని నాని.. ఇండిపెం డెంట్గా పోటీ చేసినా.. లేక బీజేపీలో చేరి ఆ పార్టీ తరఫున పోటీ చేసినా.. ఇక్కడ ప్రభావం పడే అవకాశం ఉంటుందని అంటున్నా రు. కేశినేని నాని అంటే.. రాజకీయంగా విమర్శలు, వివాదాలు పక్కన పెడితే.. అభివృద్ధి విషయంలో ఆయన సొంత ఇమేజ్ సంపాయించుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ప్రభావం కనిపిస్తుందనేది అంచనా. అయితే.. ఇది సెంట్రల్లో టీడీపీని ఓడించేంత ఉండదని అంటున్నారు. అయితే.. నల్లేరుపై నడకగా ముందుకు సాగుతామని భావించిన టీడీపీ.. అంతో ఇంతో చెమటోడ్చక తప్పదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
This post was last modified on January 8, 2024 9:35 am
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…
కూటమి నాయకులకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కీలక రాజకీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానికరం`` అంటూ..…