Political News

షాకింగ్‌: వైసీపీ ఎమ్మెల్సీ సోద‌రుడి దారుణ హ‌త్య‌

ఏపీలో దారుణం జ‌రిగింది. వైసీపీ ఎమ్మెల్సీగా ఉన్న నాయ‌కురాలి సోద‌రుడిని కొంద‌రు గుర్తు తెలియ‌ని దుండ‌గులు అత్యంత దారుణంగా హ‌త్య చేశారు. క‌ర్నూలు జిల్లాలోని పెండేక‌ల్లు రైల్వే జంక్ష‌న్‌లో జ‌రిగిన ఈ దారుణం రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ వ‌ర్గాల్లో సంచ‌ల‌నం సృష్టించింది. ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లా చీరాల‌కు చెందిన పోతుల సునీత‌.. వైసీపీలో ఎమ్మెల్సీగా ఉన్నారు.

ఆమె సోద‌రుడు రోము పెండేక‌ల్లు రైల్వే జంక్ష‌న్ వ‌ద్ద మృతి చెందిన స్థితిలో క‌నిపించారు. అయితే.. ఆయ‌న ర‌క్త‌పు మ‌డుగులో ఉండ‌డం.. ప‌క్క‌నే పెద్ద పెద్ద బండ‌రాళ్లు ఉండ‌డంతో ఎవ‌రో గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు ఆయ‌న‌ను దారుణంగా హ‌త‌మార్చి ఉంటార‌ని పోలీసులు భావిస్తున్నారు. ఘ‌ట‌న విష‌యం తెలియ‌గానే పోలీసులు, ప‌లువురు వైసీపీ నాయ‌కులు కూడాఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్నారు.

కాగా, 57 ఏళ్ల రాము..అలియాస్ అన్న.. అలియాస్ చిన్న‌.. అవివాహితుడు. గ‌తంలో 30 ఏళ్ల కింద‌ట ఆయ‌న పీపుల్స్‌వార్ ఉద్య‌మంలో చురుగ్గా ప‌నిచేశారు. అప్ప‌ట్లో రాముపై రివార్డు కూడా ప్ర‌క‌టించారు. పోలీసులు సైతం ఆయ‌న కోసం ఊరూ వాడా గాలించారు. ఈ క్ర‌మంలో రాము 1991లో ప్ర‌భుత్వానికి లొంగిపోయారు. ప్ర‌స్తుతం గ్రామంలోనే ఉంటూ పనులు చేసుకుంటున్న ఆయన 10 ఏళ్లుగా మానసిక వ్యాధితో బాధపడుతున్న‌ట్టు తెలిసింది.

కాగా, క‌ర్నూలు జిల్లా పెండేక‌ల్లు రైల్వే జంక్ష‌న్ సమీపంలో శ‌నివారం రాత్రి నిద్రించగా దుండగులు బండరాయితో కొట్టి చంపినట్టు పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మ‌రోవైపు.. ఈ విష‌యం రాజ‌కీయంగా కూడా దుమారం రేపింది. దీని వెనుక ఎవ‌రున్నార‌నే విష‌యంపై స‌ర్వ‌త్రా చ‌ర్చ సాగుతోంది.

This post was last modified on January 7, 2024 5:58 pm

Share

Recent Posts

విశ్వంభర వెళ్తున్న దారి సరైనదేనా

చిరంజీవి పుట్టినరోజు ఇంకో ఆరు రోజుల్లో రానుంది. రెండు కీలక అప్డేట్స్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. మెగా 158…

2 hours ago

యష్ మాటల్లో పరిణితి పని చేస్తుంది

ఇంకో పది రోజుల్లో టాక్సిక్ విడుదల కానుంది. కెజిఎఫ్ తర్వాత సుమారు నాలుగేళ్ల విలువైన కాలాన్ని దీని కోసమే ఖర్చు…

2 hours ago

వైసీపీ స‌త్తాకు `బ్యాలెట్` టెస్ట్‌?

ఏపీలో వ‌చ్చే సెప్టెంబ‌రులో నిర్వ‌హించాల‌ని భావిస్తున్న స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌ను బ్యాలెట్ విధానంలోనే నిర్వ‌హించాల‌ని రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం నిర్ణ‌యించింది. దీంతో…

2 hours ago

కేటీఆర్ కార్యకర్తల రక్తాన్ని అమ్ముకున్నారు

తెలంగాణాలో స్థానిక ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య విమర్శలు జోరందుకుంటున్నాయి. దీంతో రాజకీయ వేడి రాజుకుంటుంది.…

3 hours ago

భోగాపురం టూ సింగపూర్… బాబు గారి దిల్ ఖుష్

విజ‌య‌న‌గ‌రం జిల్లాలోని భోగాపురంలో అధునాతన వ‌స‌తుల‌తో నిర్మించిన అల్లూరి సీతారామ‌రాజు అంత‌ర్జాతీయ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్ర‌యం కార్య‌కలాపాలు ఆదివారం అర్ధ‌రాత్రి…

6 hours ago

బండ్ల కూతురి పెళ్లికి రానిది పవన్ ఒకరే

బండ్ల గ‌ణేష్ అనే న‌టుడు ఎప్పుడూ తెలుగులో పెద్ద పాత్ర‌లు చేసింది లేదు. న‌టుడిగా అత‌డిది గొప్ప కెరీర్ కాదు.…

6 hours ago