ఏపీలో దారుణం జరిగింది. వైసీపీ ఎమ్మెల్సీగా ఉన్న నాయకురాలి సోదరుడిని కొందరు గుర్తు తెలియని దుండగులు అత్యంత దారుణంగా హత్య చేశారు. కర్నూలు జిల్లాలోని పెండేకల్లు రైల్వే జంక్షన్లో జరిగిన ఈ దారుణం రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ వర్గాల్లో సంచలనం సృష్టించింది. ఉమ్మడి ప్రకాశం జిల్లా చీరాలకు చెందిన పోతుల సునీత.. వైసీపీలో ఎమ్మెల్సీగా ఉన్నారు.
ఆమె సోదరుడు రోము పెండేకల్లు రైల్వే జంక్షన్ వద్ద మృతి చెందిన స్థితిలో కనిపించారు. అయితే.. ఆయన రక్తపు మడుగులో ఉండడం.. పక్కనే పెద్ద పెద్ద బండరాళ్లు ఉండడంతో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఆయనను దారుణంగా హతమార్చి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఘటన విషయం తెలియగానే పోలీసులు, పలువురు వైసీపీ నాయకులు కూడాఘటనా స్థలానికి చేరుకున్నారు.
కాగా, 57 ఏళ్ల రాము..అలియాస్ అన్న.. అలియాస్ చిన్న.. అవివాహితుడు. గతంలో 30 ఏళ్ల కిందట ఆయన పీపుల్స్వార్ ఉద్యమంలో చురుగ్గా పనిచేశారు. అప్పట్లో రాముపై రివార్డు కూడా ప్రకటించారు. పోలీసులు సైతం ఆయన కోసం ఊరూ వాడా గాలించారు. ఈ క్రమంలో రాము 1991లో ప్రభుత్వానికి లొంగిపోయారు. ప్రస్తుతం గ్రామంలోనే ఉంటూ పనులు చేసుకుంటున్న ఆయన 10 ఏళ్లుగా మానసిక వ్యాధితో బాధపడుతున్నట్టు తెలిసింది.
కాగా, కర్నూలు జిల్లా పెండేకల్లు రైల్వే జంక్షన్ సమీపంలో శనివారం రాత్రి నిద్రించగా దుండగులు బండరాయితో కొట్టి చంపినట్టు పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు.. ఈ విషయం రాజకీయంగా కూడా దుమారం రేపింది. దీని వెనుక ఎవరున్నారనే విషయంపై సర్వత్రా చర్చ సాగుతోంది.
This post was last modified on January 7, 2024 5:58 pm
ప్రపంచంలో అత్యధిక ఆదరణ పొందిన సినిమాల లిస్టు తీస్తే ఖచ్చితంగా టాప్ త్రీలో ఉండే మూవీ అవతార్. మూడో భాగం…
ఫస్ట్ విడుదల కావాల్సిన బైకర్ హఠాత్తుగా వెనక్కు తగ్గడంతో శర్వానంద్ మరో సినిమా నారీనారీ నడుమ మురారి ముందుకు వచ్చేసింది.…
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వాణిజ్య యుద్ధానికి తెరలేపారు. భారత్ సహా వియత్నాం, థాయిలాండ్ నుంచి వచ్చే బియ్యంపై…
రాజకీయంగా ప్రశాంతంగా ఉండే నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి.. ఇప్పటి వరకు ఎవరినీ టార్గెట్ చేయలేదు. తన సతీమణి,…
తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం.. స్వప్నిస్తున్న తెలంగాణ విజన్ డాక్యుమెంటును తాజాగా మంగళవారం సాయంత్రం ఫ్యూచర్…
రకరకాల ప్రచారాలు, వదంతులు, డిస్కషన్లు, సోషల్ మీడియా తిట్లు, ఎన్నెన్నో కథలు వెరసి గత అయిదు రోజులుగా పెద్ద చర్చగా…