ఏపీలో దారుణం జరిగింది. వైసీపీ ఎమ్మెల్సీగా ఉన్న నాయకురాలి సోదరుడిని కొందరు గుర్తు తెలియని దుండగులు అత్యంత దారుణంగా హత్య చేశారు. కర్నూలు జిల్లాలోని పెండేకల్లు రైల్వే జంక్షన్లో జరిగిన ఈ దారుణం రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ వర్గాల్లో సంచలనం సృష్టించింది. ఉమ్మడి ప్రకాశం జిల్లా చీరాలకు చెందిన పోతుల సునీత.. వైసీపీలో ఎమ్మెల్సీగా ఉన్నారు.
ఆమె సోదరుడు రోము పెండేకల్లు రైల్వే జంక్షన్ వద్ద మృతి చెందిన స్థితిలో కనిపించారు. అయితే.. ఆయన రక్తపు మడుగులో ఉండడం.. పక్కనే పెద్ద పెద్ద బండరాళ్లు ఉండడంతో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఆయనను దారుణంగా హతమార్చి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఘటన విషయం తెలియగానే పోలీసులు, పలువురు వైసీపీ నాయకులు కూడాఘటనా స్థలానికి చేరుకున్నారు.
కాగా, 57 ఏళ్ల రాము..అలియాస్ అన్న.. అలియాస్ చిన్న.. అవివాహితుడు. గతంలో 30 ఏళ్ల కిందట ఆయన పీపుల్స్వార్ ఉద్యమంలో చురుగ్గా పనిచేశారు. అప్పట్లో రాముపై రివార్డు కూడా ప్రకటించారు. పోలీసులు సైతం ఆయన కోసం ఊరూ వాడా గాలించారు. ఈ క్రమంలో రాము 1991లో ప్రభుత్వానికి లొంగిపోయారు. ప్రస్తుతం గ్రామంలోనే ఉంటూ పనులు చేసుకుంటున్న ఆయన 10 ఏళ్లుగా మానసిక వ్యాధితో బాధపడుతున్నట్టు తెలిసింది.
కాగా, కర్నూలు జిల్లా పెండేకల్లు రైల్వే జంక్షన్ సమీపంలో శనివారం రాత్రి నిద్రించగా దుండగులు బండరాయితో కొట్టి చంపినట్టు పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు.. ఈ విషయం రాజకీయంగా కూడా దుమారం రేపింది. దీని వెనుక ఎవరున్నారనే విషయంపై సర్వత్రా చర్చ సాగుతోంది.
This post was last modified on January 7, 2024 5:58 pm
లోక నాయకుడు కమల్ హాసన్, లెజెండరీ దర్శకుడు శంకర్ కాంబోలో వచ్చిన ఇండియన్ 2 / భారతీయుడు 2 డిజాస్టర్…
ఎన్నికల సమయంలో ఉచిత పథకాలు ప్రకటించే దేశం ఏది అని అడిగితే.. ఠక్కున చెప్పే పేరు భారత్. రాష్ట్రాల అసెంబ్లీల…
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఎప్పుడూ పల్లెత్తు మాట అనడానికి కూడా వెనకాడే జగన్.. ఇప్పుడు తన గొంతు పెంచారు.…
మాచో స్టార్ గా ఒకప్పుడు మాస్ మార్కెట్ ని బాగా ఎంజాయ్ చేసిన హీరో గోపిచంద్. విలన్ గా కెరీర్…
సాధారణంగా అభిమాన సంఘాలంటే కొత్త సినిమాల విడుదల, సంబరాలు, పుట్టినరోజు వేడుకలకే పరిమితమవుతుంటాయి. అయితే, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్…
న్యాయస్థానాలపై, న్యాయమూర్తుల విషయంలో వైసీపీ అధినేత జగన్ తీరు గతంలో తీవ్రస్థాయిలో విమర్శలకు తావిచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు…