Political News

షాకింగ్‌: వైసీపీ ఎమ్మెల్సీ సోద‌రుడి దారుణ హ‌త్య‌

ఏపీలో దారుణం జ‌రిగింది. వైసీపీ ఎమ్మెల్సీగా ఉన్న నాయ‌కురాలి సోద‌రుడిని కొంద‌రు గుర్తు తెలియ‌ని దుండ‌గులు అత్యంత దారుణంగా హ‌త్య చేశారు. క‌ర్నూలు జిల్లాలోని పెండేక‌ల్లు రైల్వే జంక్ష‌న్‌లో జ‌రిగిన ఈ దారుణం రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ వ‌ర్గాల్లో సంచ‌ల‌నం సృష్టించింది. ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లా చీరాల‌కు చెందిన పోతుల సునీత‌.. వైసీపీలో ఎమ్మెల్సీగా ఉన్నారు.

ఆమె సోద‌రుడు రోము పెండేక‌ల్లు రైల్వే జంక్ష‌న్ వ‌ద్ద మృతి చెందిన స్థితిలో క‌నిపించారు. అయితే.. ఆయ‌న ర‌క్త‌పు మ‌డుగులో ఉండ‌డం.. ప‌క్క‌నే పెద్ద పెద్ద బండ‌రాళ్లు ఉండ‌డంతో ఎవ‌రో గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు ఆయ‌న‌ను దారుణంగా హ‌త‌మార్చి ఉంటార‌ని పోలీసులు భావిస్తున్నారు. ఘ‌ట‌న విష‌యం తెలియ‌గానే పోలీసులు, ప‌లువురు వైసీపీ నాయ‌కులు కూడాఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్నారు.

కాగా, 57 ఏళ్ల రాము..అలియాస్ అన్న.. అలియాస్ చిన్న‌.. అవివాహితుడు. గ‌తంలో 30 ఏళ్ల కింద‌ట ఆయ‌న పీపుల్స్‌వార్ ఉద్య‌మంలో చురుగ్గా ప‌నిచేశారు. అప్ప‌ట్లో రాముపై రివార్డు కూడా ప్ర‌క‌టించారు. పోలీసులు సైతం ఆయ‌న కోసం ఊరూ వాడా గాలించారు. ఈ క్ర‌మంలో రాము 1991లో ప్ర‌భుత్వానికి లొంగిపోయారు. ప్ర‌స్తుతం గ్రామంలోనే ఉంటూ పనులు చేసుకుంటున్న ఆయన 10 ఏళ్లుగా మానసిక వ్యాధితో బాధపడుతున్న‌ట్టు తెలిసింది.

కాగా, క‌ర్నూలు జిల్లా పెండేక‌ల్లు రైల్వే జంక్ష‌న్ సమీపంలో శ‌నివారం రాత్రి నిద్రించగా దుండగులు బండరాయితో కొట్టి చంపినట్టు పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మ‌రోవైపు.. ఈ విష‌యం రాజ‌కీయంగా కూడా దుమారం రేపింది. దీని వెనుక ఎవ‌రున్నార‌నే విష‌యంపై స‌ర్వ‌త్రా చ‌ర్చ సాగుతోంది.

This post was last modified on January 7, 2024 5:58 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రెండు షాట్ల కోసం మహేష్ ఆరు నెలల కష్టం

రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు.. ఈ వార్త నిజం కావడానికి దశాబ్దంన్నర పాటు ఎదురు చూడాల్సి వచ్చింది అభిమానులు. వీరి…

7 minutes ago

ఫ్యామిలీ మ్యాన్ హీరో చుట్టూ టైటిల్ వివాదం

రామ్ గోపాల్ వర్మ సత్యతో స్టార్ ఆర్టిస్టుగా మారిపోయిన మనోజ్ బాజ్ పాయ్ తెలుగులోనూ హ్యాపీ, ప్రేమకథ, కొమరం పులి…

30 minutes ago

చిరు సినిమాలో దురంధర్ పాప?

సంక్రాంతికి ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రంతో భారీ విజయాన్నందుకున్నాడు మెగాస్టార్ చిరంజీవి. దీని కంటే ముందు ఆయన మొదలుపెట్టిన…

54 minutes ago

లడ్డూ విషయం పక్క దారి పట్టేసిందా

తిరుమల శ్రీవారి లడ్డూ విషయంలో కల్తీ నెయ్యి వ్యవహారం మరింత కాక రేపుతోంది. గత 2024 సెప్టెంబరు నుంచి ఇప్పటి…

2 hours ago

వారణాసి విశేషాలతో అభిమానుల్లో హుషారు

గుంటూరు కారం తర్వాత మహేష్ బాబు దర్శనం లేక డీలాపడిన అభిమానులకు ఊరట కలిగించేలా వారణాసి ఇంటర్వ్యూలు విడుదలయ్యాయి. మహేష్…

2 hours ago

ఐమాక్స్ కోసం రాజమౌళి ధర్నా

ప్రపంచంలోనే అతి పెద్ద సినిమా మార్కెట్ ఉన్న దేశాల్లో భారత్ ఒకటి. ఐతే భారీ చిత్రాల వీక్షణలో అద్భుతమైన అనుభూతిని…

2 hours ago