ఏపీలో శాసనసభ ఎన్నికలకు మరో మూడు నెలలు మాత్రమే గడువున్న నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలు సన్నాహాలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే ఆయా పార్టీలలోని అసంతృప్త నేతలు పక్క పార్టీలవైపు చూస్తున్నారు. ముఖ్యంగా అధికార పార్టీలో టికెట్ రాని నేతలంతా టీడీపీ, జనసేలలో చేరుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా వైసీపీ టీంలో మరో వికెట్ పడింది. మాజీ మంత్రి, సీనియర్ రాజకీయవేత్త దాడి వీరభద్రరావు వైసీపీకి రాజీనామా చేశారు. ఆయన కుమారులు జై వీర్, రత్నాకర్ కూడా వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. అంతేకాదు, త్వరలోనే దాడి వీరభద్రరావు టీడీపీలో చేరబోతున్నారని తెలుస్తోంది.
దాడి వీరభద్రరావు తన రాజీనామా లేఖను సీఎం జగన్ తోపాటు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిలకు పంపించారు. తన అనుచరులతో కలిసి పార్టీని వీడుతున్నానని ఏకవాక్యంతో రాజీనామా లేఖ రాశారు. రేపో మాపో దాడి వీరభద్రరావు తన కుమారులతో కలిసి చంద్రబాబు, లోకేశ్ లతో భేటీ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇక, టీడీపీలో చేరే అంశం గురించి ఆల్రెడీ చంద్రబాబుతో దాడి చర్చించారని తెలుస్తోంది. అంతకుముందు, ఆయన జనసేనలో చేరతారని ప్రచారం జరిగింది.
వాస్తవానికి దాడి 2014కి ముందు వరకు టీడీపీలో ఉన్నారు. టీడీపీలో దాడి కీలక నేతగా వ్యవహరించి 4 సార్లు టీడీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచారు. మంత్రిగా కూడా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అయితే, ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల 2019లో దాడి వైసీపీలో చేరి అనకాపల్లి నుంచి బరిలోకి దిగాలని భావించినప్పటికీ జగన్ ఆయనకు టికెట్ ఇవ్వలేదు. ఇక, తాజాగా దాడి రాజీనామాతో అనకాపల్లి జిల్లాలో వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్టయింది. ఇక, త్వరలోనే తన రాజకీయ భవిష్యత్తుపై ప్రకటన చేస్తానని అన్నారు. ఏ పార్టీలో చేరబోయేది త్వరలోనే వెల్లడిస్తానని అన్నారు.
This post was last modified on January 2, 2024 11:45 pm
దర్శకుడు పూరి జగన్నాథ్, హీరో విజయ్ సేతుపతి కలయికలో రూపొందిన స్లమ్ డాగ్ షూటింగ్ ఎప్పుడో పూర్తయ్యింది. అదిగో ఇదిగో…
మెగా ఫ్యాన్స్ మహా అయోమయంలో ఉన్నారు. పెద్ది పోస్ట్ పోన్ అయ్యింది కానీ జూన్ నెలలో ఏ డేట్ కి…
స్టార్ హీరోలు డిజాస్టర్లు ఇచ్చినప్పుడు దాని తాలూకు పరిణామాలు కేవలం బాక్సాఫీస్ నష్టాలకే పరిమితం కాదు. ముఖ్యంగా సోషల్ మీడియా…
గత కొన్నేళ్లలో ఇండియన్ సినిమాలో వచ్చిన బెస్ట్ లవ్ స్టోరీల్లో ‘సైయారా’ ఒకటి. సంగీత ప్రధానంగా సాగే ఈ ప్రేమకథ.. దేశవ్యాప్తంగా…
ఒక భారీ చిత్రం విడుదలకు చాలా రోజుల ముందే హెచ్డీ ప్రింట్ లీక్ అయిపోవడం గత కొద్ది కాలంలో తొలిసారిగా…
గాడ్ ఆఫ్ వార్.. ఏడాది కిందట్నుంచి టాలీవుడ్లో విపరీతంగా చర్చనీయాంశం అవుతున్న ప్రాజెక్టు. ఇప్పటిదాకా ఎక్కువగా ఫ్యామిలీ, మాస్, యాక్షన్…