Political News

జగన్ కు షాక్..టీడీపీ గూటికి దాడి!

ఏపీలో శాసనసభ ఎన్నికలకు మరో మూడు నెలలు మాత్రమే గడువున్న నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలు సన్నాహాలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే ఆయా పార్టీలలోని అసంతృప్త నేతలు పక్క పార్టీలవైపు చూస్తున్నారు. ముఖ్యంగా అధికార పార్టీలో టికెట్ రాని నేతలంతా టీడీపీ, జనసేలలో చేరుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా వైసీపీ టీంలో మరో వికెట్ పడింది. మాజీ మంత్రి, సీనియర్ రాజకీయవేత్త దాడి వీరభద్రరావు వైసీపీకి రాజీనామా చేశారు. ఆయన కుమారులు జై వీర్, రత్నాకర్ కూడా వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. అంతేకాదు, త్వరలోనే దాడి వీరభద్రరావు టీడీపీలో చేరబోతున్నారని తెలుస్తోంది.

దాడి వీరభద్రరావు తన రాజీనామా లేఖను సీఎం జగన్ తోపాటు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిలకు పంపించారు. తన అనుచరులతో కలిసి పార్టీని వీడుతున్నానని ఏకవాక్యంతో రాజీనామా లేఖ రాశారు. రేపో మాపో దాడి వీరభద్రరావు తన కుమారులతో కలిసి చంద్రబాబు, లోకేశ్ లతో భేటీ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇక, టీడీపీలో చేరే అంశం గురించి ఆల్రెడీ చంద్రబాబుతో దాడి చర్చించారని తెలుస్తోంది. అంతకుముందు, ఆయన జనసేనలో చేరతారని ప్రచారం జరిగింది.

వాస్తవానికి దాడి 2014కి ముందు వరకు టీడీపీలో ఉన్నారు. టీడీపీలో దాడి కీలక నేతగా వ్యవహరించి 4 సార్లు టీడీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచారు. మంత్రిగా కూడా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అయితే, ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల 2019లో దాడి వైసీపీలో చేరి అనకాపల్లి నుంచి బరిలోకి దిగాలని భావించినప్పటికీ జగన్ ఆయనకు టికెట్ ఇవ్వలేదు. ఇక, తాజాగా దాడి రాజీనామాతో అనకాపల్లి జిల్లాలో వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్టయింది. ఇక, త్వరలోనే తన రాజకీయ భవిష్యత్తుపై ప్రకటన చేస్తానని అన్నారు. ఏ పార్టీలో చేరబోయేది త్వరలోనే వెల్లడిస్తానని అన్నారు.

This post was last modified on January 2, 2024 11:45 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఫర్ ద ఫస్ట్ టైమ్.. పెళ్లి మండపంగా రాష్ట్రపతి భవన్

రాష్ట్రపతి భవన్… భారత దేశ ప్రథమ పౌరుడి అదికారిక నివాసం. అన్నీ అధికారిక కార్యక్రమాలే తప్పించి ప్రైవేటు కార్యకలాపాలకు అక్కడ…

1 hour ago

వరుసబెట్టి 8 సార్లు!… రికార్డుల నిర్మలమ్మ!

మన తెలుగింటి ఆడపడచు నిర్మలా సీతారామన్ జాతీయ రాజకీయాల్లో సత్తా చాటుతున్నారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి హోదాలో వరుసగా…

1 hour ago

12 ఏళ్ళ రీమేక్ ఇప్పుడెందుకు స్వామి

నిన్న షాహిద్ కపూర్ దేవా చెప్పుకోదగ్గ అంచనాల మధ్య రిలీజయ్యింది. పూజ హెగ్డే హీరోయిన్ కావడంతో అంతోఇంతో మనోళ్ల దృష్టి…

1 hour ago

హైదరాబాద్ లో 9 రోజులుగా తల్లి మృతదేహంతో ఇద్దరు కుమార్తెలు

విన్నంతనే ఉలిక్కిపడే ఉదంతంగా దీన్ని చెప్పాలి. హైదరాబాద్ మహానగరంలో చోటుచేసుకున్న ఈ విషాద ఉదంతం గురించి తెలిస్తే నోట మాట…

1 hour ago

శేఖర్ కమ్ముల కాంప్రోమైజ్ అవ్వట్లేదు

నిర్మాణంలో ఉన్న పెద్ద సినిమాల్లో అంతగా సౌండ్ చేయకుండా కూల్ గా షూటింగ్ చేసుకుంటున్న సినిమా కుబేర. ధనుష్, నాగార్జున…

2 hours ago

ఈ ఎమ్మెల్యే నిజంగానే ‘వెండి’ కొండ

జనంపల్లి అనిరుధ్ రెడ్డి… ఈ పేరు గడచిన రెండు, మూడు రోజుల నుంచి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.…

2 hours ago