Political News

ఇంగ్లిషు మీడియం విషయంలో జగన్ కు సుప్రీం షాక్

గత కొద్ది నెలలుగా ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు, సుప్రీం కోర్టులో వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్న సంగతి తెలిసిందే. నిమ్మగడ్డ వ్యవహారం, ప్రభుత్వ కార్యాలయాలకు రంగులు….ఇళ్ల స్థలాల పంపిణీ….ఇలా దాదాపుగా అనేక విషయాల్లో జగన్ సర్కార్ కు న్యాయస్థానాల్లో చుక్కెదురైంది.

మరోవైపు, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిషు మీడియంలో బోధన వ్యవహారంపై ఏపీ సర్కార్ సుప్రీం కోర్టు గడప తొక్కిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా, మరోసారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియం అమలు వ్యవహారంపై ఏపీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధించేందుకు దేశపు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. ఎస్‌ఎల్‌పీ, స్టేపై ప్రతివాదులకు నోటీసులు జారీ చేసిన సుప్రీం….ఈ కేేసు తదుపరి విచారణను సెప్టెంబరు 25కు వాయిదా వేసింది.

ఏపీలోని సర్కారీ బడుల్లో ఇంగ్లీష్ మీడియం బోధనపై తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే. మాతృభాషలోనే విద్యనభ్యసించాలనుకునే వారికి ఆ అవకాశం ఇవ్వాలని, ఇంగ్లిషు మీడియం వల్ల పిల్లలు మాతృభాషను మరచిపోయే ప్రమాదముందన్న అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.

అయితే, ప్రస్తుత పోటీ ప్రపంచంలో నెగ్గాలంటే ఇంగ్లిషు మీడియం తప్పనిసరి అని ఏపీ ప్రభుత్వం వాదిస్తోంది. ఈ క్రమంలోనే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియం అమలుపై హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం పిటిషన్‌ దాఖలు చేసింది.ఇంగ్లిష్‌ మీడియం తప్పనిసరి చేస్తూ జగన్ సర్కార్ జారీ చేసిన జీవో నెం.81, 85ను హైకోర్టు కొట్టేయడంపై సుప్రీంలో పిటిషన్‌ వేసింది. ఆ పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు….హైకోర్టు ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది.

తాజా తీర్పుతో జగన్ సర్కార్‌కు మరోసారి న్యాయస్థానంలో ఎదురుదెబ్బ తగిలినట్లయింది. కాగా, 5వ తరగతి వరకు మాతృభాష తప్పనిసరి అని నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ(ఎన్ఈపీ)-2020ని కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా ఈ విధానం అమలులోకి తేబోతున్నామని తెలిపింది. ఈ రెండు పరిణామాల నేపథ్యంలో ఇంగ్లిష్ మీడియంపై ఏపీ సర్కార్ ఏ విధంగా ముందుకు పోతుందన్నది ఆసక్తికరంగా మారింది.

This post was last modified on September 3, 2020 1:09 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

లెజెండరీ ప్లేయర్లను దాటేసిన హిట్ మ్యాన్

వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…

18 minutes ago

తొమ్మిదేళ్ల విక్రమ్ సినిమాకు మోక్షం ?

క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…

41 minutes ago

‘అప్పుడు మహ్మద్ గజిని… ఇప్పుడు వైఎస్ జగన్’

అప్పుడు మహ్మద్‌ గజని… ఇప్పుడు వైఎస్‌ జగన్‌ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…

51 minutes ago

రాజాసాబ్.. దేవర రూట్లో వెళ్లినా..

సంక్రాంతి సీజన్ లో భారీ అంచనాల మధ్య వచ్చిన ది రాజా సాబ్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఒక రకమైన…

1 hour ago

ప్రసాదు ప్రీమియర్ల మీదే అందరి కన్ను

సంక్రాంతి రేసులో రెండో పుంజు దిగుతోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ది రాజా సాబ్ ఫలితం మీద దాదాపు…

2 hours ago

మాజీ సీబీఐ డైరెక్టర్ సతీమణి సైబర్ వలలో పడడమా…

వాళ్లు వీళ్లు అన్న తేడా లేకుండా మోసమే శ్వాసగా మారి.. తమ మాటల్ని నమ్మినోళ్లను మోసం చేసే సైబర్ బందిపోట్లు..…

2 hours ago