మరో మూడు మాసాల్లో జరగనున్న ఎన్నికలకు సంబంధించి నినాదాల ప్రిపరేషన్లో ప్రధాన పార్టీలు బిజీగా ఉన్నాయి. టీడీపీ, వైసీపీలు ఈ విషయంలో దూకుడుగా ఉన్నాయి. ఇప్పటికే వైసీపీ నుంచి అనేక నినాదాలు హల్చల్ చేస్తున్నాయి. మా నమ్మకం నువ్వే జగన్, జగనన్నే మా నమ్మకం.. రావాలి జగన్, కావాలి జగన్.. వంటివి ఇప్పటికే పాపులర్ అయ్యాయి. ఇక, తాజాగా ఇస్తున్న నినాదాలు కూడా పార్టీని పరుగులు పెట్టిస్తున్నాయని నాయకులు అంటున్నారు. ‘వైనాట్ 175’ బాగా పాపులర్ అయింది.
జగన్ సారు మరో మారు.. నినాదం.. సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అదేవిధంగా జగనన్న.. మరో సారి నువ్వే అన్నా! నినాదానికి కూడా నెటిజన్లు ఫిదా అవుతున్నారు. గత ఎన్నికల సమయంలో పాటల రూపంలో దంచికొట్టిన ప్రచారాన్ని మరిపించేలా ఇప్పుడు కూడా అంతే స్థాయిలో ప్రచారం ఉండాలన్న లక్ష్యంతో వైసీపీ ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో సరికొత్త నినాదాల దిశగా పార్టీ నాయకులు, కార్యకర్తల ను ముందుకు నడిపిస్తోంది.
ఇక, టీడీపీ కూడా కొత్త నినాదాలపై దృష్టి పెట్టింది. చంద్రన్న.. విజన్, ఏపీ భవితకు బాబు భరోసా, బాబు భరోసా.. భవిష్యత్తు గ్యారెంటీ వంటివి ప్రజల్లోకి బాగానే వెళ్లాయి. ఇక, ఉద్యమ నినాదాలు కూడా ప్రచారం లో ఉన్నాయి. అయితే.. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మరిన్ని నినాదాల దిశగా పార్టీ కసరత్తు ప్రారంభించింది. ఐటీడీపీ సహా ఎన్నారై టీడీపీ కూడా నినాదాల రూపకల్పన దిశగా కసరత్తు చేస్తున్నాయి.
ఇక, బీజేపీ మోడీ నినాదాన్నే ముందుకు తీసుకువెళ్లాలని నిర్ణయించిన దరిమిలా.. కేంద్ర ప్రభుత్వ పథకా లకు మోడీ పేరును తొడిగి వాటితోనే ప్రచారం చేసుకోనున్నారు. మరోవైపు.. కాంగ్రెస్ కూడా ‘వైనాట్ ఏపీ’ నినాదాన్ని తెరమీదికి తెచ్చిన విషయం తెలిసిందే. ఇదిలావుంటే, తెలుగుపై పట్టు, రాజకీయాలపై ఆసక్తి ఉన్నవారిని నియమించుకునేందుకు కూడా పార్టీలు రెడీగా ఉన్నాయట. మొత్తానికి ఒకవైపు పార్టీ వ్యూహలు.. మరోవైపు నినాదాల కసరత్తుతో అన్ని పార్టీలు బిజీబిజీగా ఉండడం గమనార్హం.
This post was last modified on December 27, 2023 9:20 pm
‘ఆర్ఎక్స్ 100’ మూవీతో సెన్సేషన్ క్రియేట్ చేసిన యువ దర్శకుడు అజయ్ భూపతి, మళ్లీ తన పవర్ చూపించిన సినిమా..…
విశాఖ రైల్వే జోన్..ఉమ్మడి ఏపీ విడిపోయిన తర్వాత రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన కీలక హామీలలో ఒకటి. జగన్ హయాంలో అదిగో…
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి అంతర్జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారారు. ఇప్పటికే వలసదారులపై కఠిన…
అగ్రరాజ్యం అమెరికాలో నూతన అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ పగ్గాలు చేపట్టినప్పుడు.. భారత ప్రధాని నరేంద్ర మోడీ మురిసిపోయారు. "నా ప్రియ…
ఇవాళ సీనియర్ నిర్మాత, ఫైనాన్షియర్ శింగనమల రమేష్ బాబు ప్రెస్ మీట్ నిర్వహించడం ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తి రేపింది. పధ్నాలుగు…
ఆంధ్రప్రదేశ్లో ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చిన కొన్ని నెలల నుంచి తెలుగుదేశం, జనసేన కార్యకర్తల నుంచి ఒక రకమైన అసంతృప్త…