మరో మూడు మాసాల్లో జరగనున్న ఎన్నికలకు సంబంధించి నినాదాల ప్రిపరేషన్లో ప్రధాన పార్టీలు బిజీగా ఉన్నాయి. టీడీపీ, వైసీపీలు ఈ విషయంలో దూకుడుగా ఉన్నాయి. ఇప్పటికే వైసీపీ నుంచి అనేక నినాదాలు హల్చల్ చేస్తున్నాయి. మా నమ్మకం నువ్వే జగన్, జగనన్నే మా నమ్మకం.. రావాలి జగన్, కావాలి జగన్.. వంటివి ఇప్పటికే పాపులర్ అయ్యాయి. ఇక, తాజాగా ఇస్తున్న నినాదాలు కూడా పార్టీని పరుగులు పెట్టిస్తున్నాయని నాయకులు అంటున్నారు. ‘వైనాట్ 175’ బాగా పాపులర్ అయింది.
జగన్ సారు మరో మారు.. నినాదం.. సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అదేవిధంగా జగనన్న.. మరో సారి నువ్వే అన్నా! నినాదానికి కూడా నెటిజన్లు ఫిదా అవుతున్నారు. గత ఎన్నికల సమయంలో పాటల రూపంలో దంచికొట్టిన ప్రచారాన్ని మరిపించేలా ఇప్పుడు కూడా అంతే స్థాయిలో ప్రచారం ఉండాలన్న లక్ష్యంతో వైసీపీ ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో సరికొత్త నినాదాల దిశగా పార్టీ నాయకులు, కార్యకర్తల ను ముందుకు నడిపిస్తోంది.
ఇక, టీడీపీ కూడా కొత్త నినాదాలపై దృష్టి పెట్టింది. చంద్రన్న.. విజన్, ఏపీ భవితకు బాబు భరోసా, బాబు భరోసా.. భవిష్యత్తు గ్యారెంటీ వంటివి ప్రజల్లోకి బాగానే వెళ్లాయి. ఇక, ఉద్యమ నినాదాలు కూడా ప్రచారం లో ఉన్నాయి. అయితే.. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మరిన్ని నినాదాల దిశగా పార్టీ కసరత్తు ప్రారంభించింది. ఐటీడీపీ సహా ఎన్నారై టీడీపీ కూడా నినాదాల రూపకల్పన దిశగా కసరత్తు చేస్తున్నాయి.
ఇక, బీజేపీ మోడీ నినాదాన్నే ముందుకు తీసుకువెళ్లాలని నిర్ణయించిన దరిమిలా.. కేంద్ర ప్రభుత్వ పథకా లకు మోడీ పేరును తొడిగి వాటితోనే ప్రచారం చేసుకోనున్నారు. మరోవైపు.. కాంగ్రెస్ కూడా ‘వైనాట్ ఏపీ’ నినాదాన్ని తెరమీదికి తెచ్చిన విషయం తెలిసిందే. ఇదిలావుంటే, తెలుగుపై పట్టు, రాజకీయాలపై ఆసక్తి ఉన్నవారిని నియమించుకునేందుకు కూడా పార్టీలు రెడీగా ఉన్నాయట. మొత్తానికి ఒకవైపు పార్టీ వ్యూహలు.. మరోవైపు నినాదాల కసరత్తుతో అన్ని పార్టీలు బిజీబిజీగా ఉండడం గమనార్హం.
This post was last modified on December 27, 2023 9:20 pm
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…
ఒక పెద్ద సినిమాలో రాముడి పాత్రను పోషించడం ఏ నటుడికైనా అరుదైన అవకాశమే. దాన్ని లైఫ్ టైం ఛాన్స్లాగే ఫీలవుతారు ఎవ్వరైనా. ‘ఆదిపురుష్’ ఫలితం…
వైసీపీ అధినేత, తన బ్రదర్ జగన్పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్…