వంగవీటి రంగా ఎవరి వాడు.. ఆయనను ఓన్ చేసుకునేందుకు కాంగ్రెస్, జనసేనలు ప్రయత్నిస్తున్న దరిమిలా.. ఇదే చర్చ రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. తాజాగా జరిగిన రంగా వర్ధంతిని విజయ వాడ సహా గుంటూరు, నెల్లూరు, ఉభయ గోదావరి జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా నిర్వహించా రు. దాదాపు రంగా చనిపోయిన తర్వాత.. 15 ఏళ్లపాటు కాంగ్రెస్ రంగాను మరిచిపోయిందనే చెప్పాలి.
రాధా 2009 తర్వాత కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టడంతో ఆ పార్టీ కూడా రంగాను దాదాపు మరిచిపోయింది. అప్పటి నుంచి రంగా వర్ధంతులను, జయంతులను కాంగ్రెస్ తరఫున చేసిన వారు ఎవరూ లేరు. అయితే .. అనూహ్యంగా ఇప్పుడు వంగవీటి రంగాను కాంగ్రెస్ నాయకులు ఓన్ చేసుకున్నారు. కాంగ్రెస్ పీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు.. గుంటూరు, విజయవాడల్లో నిర్వహించిన కార్యక్రమాల్లో రంగా విగ్రహాలకు పుష్పమాలలు వేసి నివాళులర్పించారు.
అంతేకాదు.. రంగా భౌతికంగా ఉండి ఉంటే.. ఆయన కుటుంబం కాంగ్రెస్లోనే ఉండేదని వ్యాఖ్యానించా రు. రంగాకు టుంబానికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని చెప్పుకొచ్చారు. రంగా అభిమానులు కూడా కాంగ్రెస్లోకి రావాలని సూచించారు. మొత్తంగా రంగా అనుచరుల వైపు కాంగ్రెస్ అడుగులు జోరుగానే పడుతున్నాయి. ఇక, జనసేన విషయానికి వస్తే.. ఆ పార్టీ కూడా రంగా వైపు చూస్తోంది.
రంగా వర్ధంతిని పురస్కరించుకుని తెనాలిలో రంగా విగ్రహానికి జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్ నివాళులర్పించారు. రంగా అభిమానులుగా.. తాము ఆయనను అనుసరిస్తామని చెప్పారు. దీంతో రంగా వైపు.. జనసేన చూస్తోందన్నది స్పష్టంగా తేలి పోయింది ఇక, రంగా కుమారుడు రాధా నిర్వహించిన వర్ధంతి కార్యక్రమం(కాశీలో)లో ఏకంగా వైసీపీ మాజీ మంత్రి కొడాలి నాని పాల్గొన్నారు. ఇలా.. రంగా చుట్టూ రాజకీయాలు ఎన్నికలకు ముందు మరింత వేడెక్కడం గమనార్హం. మరి చివరకు రంగా ఎవరి వాడిగా మిగులుతాడో చూడాలి.
This post was last modified on December 27, 2023 6:37 pm
‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో గాడిన పడ్డట్లే పడి.. ఆ తర్వాత ‘లైగర్’, ‘డబుల్ ఇస్మార్ట్’ చిత్రాలతో ఎదురు దెబ్బలు తిన్నాడు…
దేశాన్ని కుదిపేసిన పెహల్గామ్ దుర్ఘటన పట్ల చిన్నా పెద్దా ప్రతి ఒక్కరిలోనూ తీవ్ర విషాదఛాయలు నెలకొన్నాయి. సినీ పరిశ్రమ నుంచి…
ప్రేక్షకులను బాలీవుడ్ మేకర్స్ ఎలా ఊహించుకుంటున్నారో కానీ కొన్ని సినిమాలు ప్రకటనల స్టేజి దగ్గరే నవ్వు తెప్పిస్తున్నాయి. నిన్న కార్తీక్…
యావత్ దేశాన్ని కుదిపేసిన పెహల్గామ్ సంఘటన తర్వాత ఊహించని కోణాల్లో వివాదాలు తలెత్తున్నాయి. తాజాగా ప్రభాస్ ఫౌజీ ద్వారా హీరోయిన్…
ప్రకాశం జిల్లాలోని ఒంగోలులో టిడిపి నేత ముప్పవరపు వీరయ్య చౌదరిని దారుణంగా హతమార్చిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి…
బాలీవుడ్ నటి కాదంబరి జత్వాని కిడ్నాప్ కేసులో ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్ ఆర్ ఆంజనేయులు ఆరోపణలు ఎదుర్కొంటున్న…