Political News

పబ్జీ సహా 118 చైనా యాప్ లు బ్యాన్

భారత్-చైనా సరిహద్దులో ఉన్న గాల్వాన్ లోయలో కొద్ది నెలల క్రితం ఉద్రిక్త వాతావరణం ఏర్పడిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో జరిగిన ఉద్రిక్త ఘటనలలో 20 మంది భారత జవాన్లు అమరులయ్యారు. ఆ ఘటన తర్వాత చైనాపై భారత్ లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. బ్యాన్ చైనా ప్రొడక్ట్స్, బాయ్ కాట్ చైనా యాప్స్ అనే నినాదం ఊపందుకుంది. ఈ నేపథ్యంలోనే టిక్ టాక్ సహా 59 చైనా యాప్స్ పై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. తాజాగా, మరోసారి భారత్-చైనా సరిహద్దులో ఉద్రిక్తతలు ఏర్పడిన నేపథ్యంలో కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పబ్జీ గేమ్ తో పాటు చైనాకు చెందిన 118 మొబైల్‌ యాప్స్‌పై నిషేధం విధించినట్లు కేంద్రం వెల్లడించింది. దేశ సార్వభౌమత్యం, సమగ్రతకు విఘాతం కలిగిస్తున్నాయన్న కారణంతోనే చైనా అప్లికేషన్లపై నిషేధం విధించినట్లు కేంద్రం తెలిపింది.

పబ్జీ గేమ్ కు యువతతోపాటు చిన్న పిల్లలు కూడా బానిసలవుతున్నారన్న సంగతి తెలిసిందే. ఆ మాయదారి గేమ్ వల్ల ఎంతోమంది ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు కోల్పోయారని, దానిని నిషేధించాలని చాలాకాలంగా డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా కేంద్రం వారి ఆకాంక్షలకు అనుగుణంగా చర్యలు తీసుకుంది. ఎంతోమందిని పొట్టనబెట్టుకున్న పబ్జీ గేమ్ తో పాటు 118 యాప్ లపై కేంద్రం నిషేధం విధించింది. దేశ భద్రతకు, ప్రజా జీవితానికి హానికరంగా పరిణమించిన ఈ యాప్ లను నిషేధించామని కేంద్రం ఓ ప్రకటనలో పేర్కొంది. పబ్జీతోపాటు లివిక్, పబ్జీ మొబైల్ లైట్, వుయ్ చాట్ వర్క్, వుయ్ చాట్ రీడింగ్ వంటి పలు యాప్ లను కేంద్రం నిషేధించింది. ఇక, భారత్ తరహాలోనే అమెరికా చైనా యాప్ లపై గుర్రుగా ఉన్న సంగతి తెలిసిందే.

This post was last modified on September 2, 2020 7:01 pm

Share
Show comments
Published by
suman
Tags: PUBG Ban

Recent Posts

మ‌మ‌త ప‌రిస్థితి.. ఏపీకి పాఠం అవుతుందా?!

త‌మ్ముడు త‌మ్ముడే.. రాజ‌కీయం రాజ‌కీయ‌మే.. బీజేపీ విష‌యంలో ఇది అక్ష‌రాలా నిజం. త‌న‌కు అవ‌కాశం లేనంత సేపూ.. ఆ పార్టీ…

2 hours ago

‘అడ్డంకులెన్నైనా.. ఆకివీడు రామాలయ నిర్మాణం ఆగదు’

ఏపీలో మతపరమైన వివాదాలకు కేంద్రంగా మారిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో ఆదివారం ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది.…

3 hours ago

కెపాసిటీ లేకే ర‌జినీ సినిమా వ‌దిలేశా

సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్ హీరోగా లోక‌నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్ నిర్మించే సినిమా ద‌ర్శ‌కుడి ఎంపిక విష‌యంలో ఎంత త‌ల‌నొప్పి ఎదురైందో…

4 hours ago

తొలిసారి బాల‌య్య‌తో అనిరుధ్‌?

టాలీవుడ్లో ఇప్ప‌టికే ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ లాంటి అగ్ర క‌థానాయ‌కుల‌తో పాటు నాని, విజ‌య్…

5 hours ago

పవన్ వచ్చాక పిఠాపురంలో ఏం చేశారు?

ఉమ్మ‌డి తూర్పు గోదావ‌రి జిల్లాలోని పిఠాపురం నియోజ‌కవ‌ర్గం నుంచి తొలిసారి పోటీ చేసిన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ 2024…

6 hours ago

‘కల్తీ నెయ్యి’లో ఆ ఇద్దరిదే కీలక భూమిక?

కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారి ప్రసాదం తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగించారన్న కేసులో రోజుకో కొత్త…

6 hours ago