Political News

పబ్జీ సహా 118 చైనా యాప్ లు బ్యాన్

భారత్-చైనా సరిహద్దులో ఉన్న గాల్వాన్ లోయలో కొద్ది నెలల క్రితం ఉద్రిక్త వాతావరణం ఏర్పడిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో జరిగిన ఉద్రిక్త ఘటనలలో 20 మంది భారత జవాన్లు అమరులయ్యారు. ఆ ఘటన తర్వాత చైనాపై భారత్ లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. బ్యాన్ చైనా ప్రొడక్ట్స్, బాయ్ కాట్ చైనా యాప్స్ అనే నినాదం ఊపందుకుంది. ఈ నేపథ్యంలోనే టిక్ టాక్ సహా 59 చైనా యాప్స్ పై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. తాజాగా, మరోసారి భారత్-చైనా సరిహద్దులో ఉద్రిక్తతలు ఏర్పడిన నేపథ్యంలో కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పబ్జీ గేమ్ తో పాటు చైనాకు చెందిన 118 మొబైల్‌ యాప్స్‌పై నిషేధం విధించినట్లు కేంద్రం వెల్లడించింది. దేశ సార్వభౌమత్యం, సమగ్రతకు విఘాతం కలిగిస్తున్నాయన్న కారణంతోనే చైనా అప్లికేషన్లపై నిషేధం విధించినట్లు కేంద్రం తెలిపింది.

పబ్జీ గేమ్ కు యువతతోపాటు చిన్న పిల్లలు కూడా బానిసలవుతున్నారన్న సంగతి తెలిసిందే. ఆ మాయదారి గేమ్ వల్ల ఎంతోమంది ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు కోల్పోయారని, దానిని నిషేధించాలని చాలాకాలంగా డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా కేంద్రం వారి ఆకాంక్షలకు అనుగుణంగా చర్యలు తీసుకుంది. ఎంతోమందిని పొట్టనబెట్టుకున్న పబ్జీ గేమ్ తో పాటు 118 యాప్ లపై కేంద్రం నిషేధం విధించింది. దేశ భద్రతకు, ప్రజా జీవితానికి హానికరంగా పరిణమించిన ఈ యాప్ లను నిషేధించామని కేంద్రం ఓ ప్రకటనలో పేర్కొంది. పబ్జీతోపాటు లివిక్, పబ్జీ మొబైల్ లైట్, వుయ్ చాట్ వర్క్, వుయ్ చాట్ రీడింగ్ వంటి పలు యాప్ లను కేంద్రం నిషేధించింది. ఇక, భారత్ తరహాలోనే అమెరికా చైనా యాప్ లపై గుర్రుగా ఉన్న సంగతి తెలిసిందే.

This post was last modified on September 2, 2020 7:01 pm

Share
Show comments
Published by
suman
Tags: PUBG Ban

Recent Posts

పవన్, ఫాన్స్ ఉన్నారు… హైప్ వస్తుందిలే

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి కేవలం ఎనిమిది నెలల్లో మూడో సినిమా రాబోతోంది. గత ఏడాది రెండు నెలల…

2 hours ago

డెవిల్ పాట మీద బూతు వివాదం

కాదేది బూతుకు అనర్హం అన్నారో సినీ కవి. కొందరు దీన్ని నిజం చేసే పనిలో ఉన్నారు. ఇటీవలే కన్నడ ప్యాన్…

4 hours ago

40 ఏళ్ల బంధాన్ని తెంచుకుంటున్నారా?

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆ పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. దీనిపై ఇటీవలి…

5 hours ago

టికెట్ రేట్ల పెంపు లేదు… అయినా హ్యాపీనే

తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు జిఓ కోసం ఎదురు చూసిన మైత్రి సంస్థకు చివరికి అది జరిగే సూచనలు లేకపోవడంతో…

6 hours ago

SRH ఈ హెచ్చరికలు వినాల్సిందే..

'ద హండ్రెడ్' వేలంలో పాకిస్థాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్‌ను సన్‌రైజర్స్ లీడ్స్ కొనుగోలు చేయడం ఊహించని వివాదానికి దారితీస్తోంది. ఈ…

8 hours ago

మీరు కాల్చండి.. నేను చూసుకుంటా. అని ఎవరన్నారు?

రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ స్థాయిలో కూడా సంచలనంగా మారిన మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ పార్టీ వ్యవహారం…

12 hours ago