భారత ఐటీ దిగ్గజం ఇన్ఫోసిన్ కీలక ప్రకటన చేసింది. రానున్న రెండేళ్ల వ్యవధిలో దాదాపు పన్నెండువేల మంది అమెరికన్లకు ఉద్యోగాలు ఇవ్వనున్నట్లుగా వెల్లడించింది. దీనికి సంబంధించిన ప్రణాళికల్నిసిద్ధం చేసినట్లుగా ఆ కంపెనీ వెల్లడించింది.
ఐదేళ్లలో పాతిక వేల మంది అమెరికన్లకు ఉద్యోగాలు ఇవ్వాలన్న నిర్ణయానికి తాము కట్టబడి ఉన్నామని.. దీనికి తగ్గట్లే గడిచిన మూడేళ్లలో 13 వేల మంది అమెరికన్లకు ఉద్యోగాలు ఇచ్చినట్లుగా ఆ సంస్థ స్పష్టం చేసింది.
హెచ్ 1 బీ వీసాదారులకు వర్క్ వీసాలకు సంబంధించి ట్రంప్ సర్కారు అనేక నిబంధనల్ని విధించిననేపథ్యంలో ఇన్ఫోసిస్ ఈ కీలక ప్రకటన చేసినట్లు చెబుతున్నారు. ఒకవేళ ట్రంప్ సర్కారు కానీ నిబంధనల్ని విధించకుంటే.. ఈ ఉద్యోగాల్లో ఎక్కువగా భారతీయులకే సొంతమయ్యేవి. అమెరికన్లకు ఉద్యోగాలు ఇచ్చే క్రమంలో భారతీయుల ప్రయోజనాలకు అంతో ఇంతో నష్టం వాటిల్లినట్లేనని చెప్పక తప్పదు.
2020 జూన్ తో ముగిసే త్రైమాసికానికి ఇన్ఫోసిస్ లో 2.39 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. గడిచిన మూడేళ్లలో అమెరికాలో ఉద్యోగాల కల్పనపై ఇన్ఫోసిస్ ఎక్కువగా ఫోకస్ చేసింది. కరోనా మహమ్మారి కారణంగా ఆర్థికంగా కలకలం రేపుతున్న వేళ.. కొత్త ఉద్యోగాల విషయంలో ఇన్ఫోసిస్ చేసిన ప్రకటన ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ ప్రకటన భారతీయులకు బ్యాడ్ న్యూస్ గా చెప్పక తప్పదు.
This post was last modified on September 2, 2020 12:18 pm
ఎల్లుండి విడుదల కాబోతున్న తండేల్ కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టికెట్ రేట్ల పెంపుకు అనుమతి ఇవ్వడం గురించి చర్చ జరుగుతోంది.…
దేశభాషలందు తెలుగు లెస్స అని ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారు అంటుంటే…ఏపీలో వైసీపీ ప్రభుత్వం మాత్రం ఏపీలో తెలుగు ‘లెస్’…
న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో రెండో వంద కోట్ల బ్లాక్ బస్టర్ గా నిలిచిన సరిపోదా శనివారం అభిమానులతో…
గత నెల సంక్రాంతికి విడుదలైన గేమ్ ఛేంజర్ మొదటి రోజే హెచ్డి పైరసీకి గురి కావడం ఇండస్ట్రీ వర్గాలతో పాటు…
తమిళంలో బిగ్గెస్ట్ స్టార్లలో ఒకడు అజిత్ కుమార్. సూపర్ స్టార్ రజినీకాంత్ జోరు తగ్గాక.. అటు విజయ్, ఇటు అజిత్…
పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో వైసీపీ ఎంపీ…