Political News

రెండేళ్లలో 12వేల అమెరికన్లకు జాబ్స్ ఇస్తామన్న భారత ఐటీ దిగ్గజం

భారత ఐటీ దిగ్గజం ఇన్ఫోసిన్ కీలక ప్రకటన చేసింది. రానున్న రెండేళ్ల వ్యవధిలో దాదాపు పన్నెండువేల మంది అమెరికన్లకు ఉద్యోగాలు ఇవ్వనున్నట్లుగా వెల్లడించింది. దీనికి సంబంధించిన ప్రణాళికల్నిసిద్ధం చేసినట్లుగా ఆ కంపెనీ వెల్లడించింది.

ఐదేళ్లలో పాతిక వేల మంది అమెరికన్లకు ఉద్యోగాలు ఇవ్వాలన్న నిర్ణయానికి తాము కట్టబడి ఉన్నామని.. దీనికి తగ్గట్లే గడిచిన మూడేళ్లలో 13 వేల మంది అమెరికన్లకు ఉద్యోగాలు ఇచ్చినట్లుగా ఆ సంస్థ స్పష్టం చేసింది.

హెచ్ 1 బీ వీసాదారులకు వర్క్ వీసాలకు సంబంధించి ట్రంప్ సర్కారు అనేక నిబంధనల్ని విధించిననేపథ్యంలో ఇన్ఫోసిస్ ఈ కీలక ప్రకటన చేసినట్లు చెబుతున్నారు. ఒకవేళ ట్రంప్ సర్కారు కానీ నిబంధనల్ని విధించకుంటే.. ఈ ఉద్యోగాల్లో ఎక్కువగా భారతీయులకే సొంతమయ్యేవి. అమెరికన్లకు ఉద్యోగాలు ఇచ్చే క్రమంలో భారతీయుల ప్రయోజనాలకు అంతో ఇంతో నష్టం వాటిల్లినట్లేనని చెప్పక తప్పదు.

2020 జూన్ తో ముగిసే త్రైమాసికానికి ఇన్ఫోసిస్ లో 2.39 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. గడిచిన మూడేళ్లలో అమెరికాలో ఉద్యోగాల కల్పనపై ఇన్ఫోసిస్ ఎక్కువగా ఫోకస్ చేసింది. కరోనా మహమ్మారి కారణంగా ఆర్థికంగా కలకలం రేపుతున్న వేళ.. కొత్త ఉద్యోగాల విషయంలో ఇన్ఫోసిస్ చేసిన ప్రకటన ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ ప్రకటన భారతీయులకు బ్యాడ్ న్యూస్ గా చెప్పక తప్పదు.

This post was last modified on September 2, 2020 12:18 pm

Share
Show comments
Published by
Satya
Tags: Infosys

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

2 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

2 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

3 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

4 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

5 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

7 hours ago