భారత ఐటీ దిగ్గజం ఇన్ఫోసిన్ కీలక ప్రకటన చేసింది. రానున్న రెండేళ్ల వ్యవధిలో దాదాపు పన్నెండువేల మంది అమెరికన్లకు ఉద్యోగాలు ఇవ్వనున్నట్లుగా వెల్లడించింది. దీనికి సంబంధించిన ప్రణాళికల్నిసిద్ధం చేసినట్లుగా ఆ కంపెనీ వెల్లడించింది.
ఐదేళ్లలో పాతిక వేల మంది అమెరికన్లకు ఉద్యోగాలు ఇవ్వాలన్న నిర్ణయానికి తాము కట్టబడి ఉన్నామని.. దీనికి తగ్గట్లే గడిచిన మూడేళ్లలో 13 వేల మంది అమెరికన్లకు ఉద్యోగాలు ఇచ్చినట్లుగా ఆ సంస్థ స్పష్టం చేసింది.
హెచ్ 1 బీ వీసాదారులకు వర్క్ వీసాలకు సంబంధించి ట్రంప్ సర్కారు అనేక నిబంధనల్ని విధించిననేపథ్యంలో ఇన్ఫోసిస్ ఈ కీలక ప్రకటన చేసినట్లు చెబుతున్నారు. ఒకవేళ ట్రంప్ సర్కారు కానీ నిబంధనల్ని విధించకుంటే.. ఈ ఉద్యోగాల్లో ఎక్కువగా భారతీయులకే సొంతమయ్యేవి. అమెరికన్లకు ఉద్యోగాలు ఇచ్చే క్రమంలో భారతీయుల ప్రయోజనాలకు అంతో ఇంతో నష్టం వాటిల్లినట్లేనని చెప్పక తప్పదు.
2020 జూన్ తో ముగిసే త్రైమాసికానికి ఇన్ఫోసిస్ లో 2.39 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. గడిచిన మూడేళ్లలో అమెరికాలో ఉద్యోగాల కల్పనపై ఇన్ఫోసిస్ ఎక్కువగా ఫోకస్ చేసింది. కరోనా మహమ్మారి కారణంగా ఆర్థికంగా కలకలం రేపుతున్న వేళ.. కొత్త ఉద్యోగాల విషయంలో ఇన్ఫోసిస్ చేసిన ప్రకటన ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ ప్రకటన భారతీయులకు బ్యాడ్ న్యూస్ గా చెప్పక తప్పదు.
This post was last modified on September 2, 2020 12:18 pm
వైసీపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదలైన తర్వాత.. కూటమి పార్టీల అభ్యర్థుల ప్రచారంలో భారీ మార్పు చోటు చేసుకుంది. ముఖ్యంగా ఉమ్మడి…
మహేష్ బాబు బావ అనే గుర్తింపుతో హీరోగా అడుగు పెట్టి కెరీర్ ఆరంభంలో కుదురుకోవడానికి చాలా కష్టపడ్డాడు సుధీర్ బాబు.…
2024లో టాలీవుడ్ నుంచి రాబోయే పెద్ద సినిమాలకు విడుదలకు సంబంధించి ఆల్మోస్ట్ ఒక క్లారిటీ వచ్చేసినట్లే. అందరూ ఎంతో ఉత్కంఠగా ఎదురు…
నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితం. రెండు సార్లు గెలిచి మంత్రి పదవి, ఒకసారి ఓడినా ఎమ్మెల్సీని చేసి మంత్రిని చేశారు. ముచ్చటగా…
పవన్ బాబాయికి ఒక్కసారి ఓటేయండి. ఒక్కసారి ఆయనను అసెంబ్లీకి పంపించండి .. ప్లీజ్ అంటూ.. మెగా ప్రిన్స్ నాగబాబు కుమారుడు…
మొన్నటిదాకా వరస ఫ్లాపులతో ఉక్కిరిబిక్కిరైన నాగార్జున ఈ సంవత్సరం నా సామిరంగతో ఊరట చెందారు. సోగ్గాడే చిన్ని నాయన రేంజ్…