Political News

బీజేపీ అయోమయం పెంచేస్తోందా ?

ఏపీ రాజకీయాల్లో అయోమయం పెరిగిపోతోంది. దీనికి ప్రధాన కారణం బీజేపీయేననే చెప్పాలి. దీనికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరింత ఆజ్యం పోస్తున్నారు. అయోమయానికి ఒకరకంగా కారణం కూడా పవననే చెప్పాలి. ఎలాగంటే ఎన్డీయేలో పార్టనర్ హోదాలో బీజేపీ మిత్రపక్షంగా ఉంటూనే టీడీపీతో పవన్ పొత్తు పెట్టుకున్నారు. నిజానికి దీన్ని అనైతికమనే చెప్పాలి. కానీ ప్రస్తుత రాజకీయాల్లో నైతికం, అనైతికమనే ప్రస్తావన పెద్దగా ఉండటం లేదు. తమకు ఏది లాభం చేస్తోందో దాన్ని పార్టీల అధ్యక్షులు, అధినేతలు ఫాలో అయిపోతున్నారు.

ఇపుడు విషయం ఏమిటంటే టీడీపీతో పొత్తుపెట్టుకున్న పవన్ మిత్రపక్షమైన బీజేపీతో ఒక్కసారి కూడా వేదికను పంచుకోలేదు. వచ్చే ఎన్నికల్లో తాను టీడీపీతోనే కలిసి ఎన్నికలకు వెళుతున్నట్లు పవన్ చాలాసార్లు ప్రకటించారు. భవిష్యత్తుకు గ్యారంటీ అనే చంద్రబాబు హామీతో విడుదలైన పాంప్లెట్ మీద చంద్రబాబు సంతకంతో పాటు పవన్ సంతకం కూడా ఉంది. కాబట్టి టీడీపీ-జనసేన పొత్తు అధికారికమనే చెప్పాలి. మరి తన మిత్రపక్షం జనసేన చంద్రబాబు నాయుడు తో పొత్తు పెట్టుకున్నప్పుడు బీజేపీ ఏమి చేయాలి ?

కలిస్తే పై రెండుపార్టీలతో కలవాలి లేకపోతే జనసేనతో విడిపోవాలి. కానీ బీజేపీ ఆపనిమాత్రం చేయటంలేదు. జనసేన తమ మిత్రపక్షమేనని, రాబోయే ఎన్నికల్లో తమ రెండుపార్టీలు కలిసే ఎన్నికలకు వెళతాయని పదేపదే చెబుతోంది. ఈ విషయాన్ని బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఎన్నిసార్లు చెప్పుంటారో లెక్కేలేదు. సడెన్ గా తెలంగాణా ఎన్నికల్లో బీజేపీ, జనసేన పొత్తులు పెట్టుకుని పోటీచేయటం, ఫలితాల తర్వాత విడిపోవటం కూడా అయిపోయింది.

తెలంగాణాలో జనసేనతో పొత్తు విషయంలో ఇంత క్లారిటితో ఉన్న బీజేపీ మరి ఏపీ విషయంలో మాత్రం ఎందుకు నాన్చుతోందో అర్ధంకావటంలేదు. ఇపుడు సమస్య ఏమిటంటే టీడీపీ, జనసేనతో కలిసి బీజేపీ ఎన్నికలకు వెళుతుందా వెళ్ళదా అన్నది తేలటంలేదు. ఎన్నికలు మరో నాలుగు మాసాల్లోకి వచ్చేసింది. బీజేపీ ఏ సంగతి చెప్పనంతవరకు టీడీపీ, జనసేన మధ్య కూడా సీట్ల విషయంలో అయోమయం తప్పేట్లులేదు. పొత్తుల విషయంలో నరేంద్రమోడీ ఏ సంగతి చెప్పకుండా వాయిదాలు వేస్తున్నారు. అందుకనే ఏపీ రాజకీయాల్లో పొత్తులపై బీజేపీ అయోమయం పెంచేస్తోందనే అనుకోవాలి.

This post was last modified on December 17, 2023 5:38 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఫ్లెక్సీ టికెట్ ధరలు నిజంగా మేలు చేస్తాయా

టాలీవుడ్ నిర్మాతలు త్వరలోనే ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు ఒక విన్నపం చేయబోతున్నారు. మహారాష్ట్ర, కర్ణాటక తరహాలో ఏపీ తెలంగాణలో ఫ్లెక్సి…

40 minutes ago

‘సీఎం’ విజయ్ కు లైన్ క్లియర్!

తమిళనాడు రాజకీయాలు మూడు రోజులుగా రసవత్తరంగా మారిన సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో టీవీకే పార్టీకి ప్రజలు…

1 hour ago

ఎవ‌రీ అర్లేక‌ర్‌… ఎందుకింత ర‌చ్చ‌!

ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా తీవ్ర చ‌ర్చ‌కు, ర‌చ్చ‌కు దారి తీసిన పేరు రాజేంద్ర విశ్వనాథ్ అర్లేక‌ర్‌. ఈయ‌న త‌మిళ‌నాడుకు ఇంచార్జ్ గ‌వ‌ర్న‌ర్‌గా…

2 hours ago

కొర‌వ‌డిన రాజ్యాంగం: విజ‌య్ విష‌యంలో ఏం జ‌రుగుతోంది?

దేశంలో ప్ర‌జాస్వామ్యానికి, ముఖ్యంగా రాజ్యాంగానికి పెద్ద పీట వేస్తున్నామ‌ని ప‌దే ప‌దే చెబుతున్నా.. ఆ స్ఫూర్తి మాత్రం ఎక్క‌డా క‌నిపించ‌డం…

3 hours ago

ఫ‌స్ట్ టైమ్ ఎంపీ: తండ్రికి త‌గ్గ వార‌సుడు.. !

పువ్వు పుట్టగానే పరిమళించినట్టుగా రాజకీయాల్లోకి వచ్చిన కొంతమంది యువ నాయకులు తమ తండ్రుల వారసత్వాన్ని నిలబెట్టే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు.…

3 hours ago

నితిన్ మూడు నిర్ణయాలు సరైనవే

వరస డిజాస్టర్ల దెబ్బకు కొంత బ్రేక్ తీసుకున్న నితిన్ మళ్ళీ సెట్స్ లోకి అడుగు పెడుతున్నాడు. డెబ్యూ దర్శకులను నమ్మి…

5 hours ago