Political News

మంత్రుల పేషీలపై సెన్సార్

మంత్రుల పేషీల్లో తీసుకుంటున్న సిబ్బంది నియామకాలపై రేవంత్ రెడ్డి సెన్సార్ విధించినట్లు సమాచారం. కొత్తగా బాధ్యతలు తీసుకున్న 11 మంది మంత్రులు తమ పేషీల్లో అవసరమైన సిబ్బందిని తీసుకుంటారు. మంత్రుల పేషీల్లో పీఎస్ లు, ఓఎస్డీలు, పీఏలు, అటెండర్లను తీసుకుంటారు. కొందరు మంత్రులైతే అదనపు పీఎస్ లను కూడా తీసుకుంటారు. మంత్రుల సంఖ్య తక్కువగాను శాఖలు ఎక్కువగాను ఉండటం వల్ల కొందరు కీలకమైన శాఖలు పొందిన మంత్రులు ఎక్కువమంది సిబ్బందిని పెట్టుకోవటం సహజమే.

అయితే మంత్రులు పెట్టుకునే సిబ్బంది విషయంలో రేవంత్ సెన్సార్ పెట్టారట. సెన్సార్ అంటే ఏమీలేదు గత ప్రభుత్వంలో మంత్రుల దగ్గర పనిచేసిన సిబ్బందిలో ఎవరినీ ఇపుడు పెట్టుకోవద్దని స్పష్టంగా చెప్పినట్లు సమాచారం. బీఆర్ఎస్ ప్రభుత్వంలో పనిచేసిన కొందరు మంత్రులుపైన, మంత్రుల సిబ్బందిపైనా చాలా ఆరోపణలున్నాయి. వచ్చిన ఆరోపణలపై విచారణ జరపాలని, యాక్షన్ తీసుకోవాలని ప్రభుత్వం సిద్ధపడుతోంది. ఇటువంటి సమయంలో తమను తాము రక్షించుకునేందుకు మాజీ మంత్రుల దగ్గర పనిచేసిన సిబ్బంది ఇప్పటి మంత్రుల దగ్గర కూడా పనిచేసేందుకు ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటారు.

ఈ విషయం రేవంత్ దృష్టికి వచ్చింది కాబట్టే ముందుగానే మంత్రులందరినీ హెచ్చరించినట్లు ప్రభుత్వవర్గాలు చెబుతున్నాయి. అలాగే ఇపుడు మంత్రులు తీసుకోవాలని అనుకుంటున్న సిబ్బంది జాబితాలను ముఖ్యమంత్రి ఆపీసుకు ముందుగా పంపాలని చెప్పారట. ఎందుకంటే సదరు సిబ్బందిపైన ఇంటెలిజెన్స్ తో సమాచారం తెప్పించుకుని అందులో క్లీన్ చిట్ ఉన్న వాళ్ళకి వెంటనే క్లియరెన్స్ ఇవ్వాలన్నది రేవంత్ భావనగా తెలుస్తోంది.

మంత్రుల పేషీల్లోని సిబ్బంది నియామకానికి సంబంధించిన క్లియరెన్స్ బాధ్యతలను ముఖ్యమంత్రి కార్యాలయంలోని సెక్రటరీ షా నవాజ్ ఖాసి పర్యవేక్షిస్తున్నారట. సర్వీసులో ఎలాంటి అవినీతి ఆరోపణలు, మరకలు లేని వాళ్ళని మాత్రమే పేషీల్లో పెట్టుకోవాలని ముఖ్యమంత్రి కార్యాలయం మంత్రులందరికీ స్పష్టంగా సూచనలు చేసిందని సమాచారం. పేషీలోని సిబ్బంది విషయంలో ఒకటికి రెండుసార్లు ముఖ్యమంత్రి కార్యాలయం నుండి సూచనలు రావటంతో మంత్రులు కూడా ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారట. ఎంతమంది మంత్రులు రేవంత్ ఆదేశాలు, సూచనలను పాటిస్తారో చూడాల్సిందే.

This post was last modified on December 15, 2023 12:46 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

అటు కేటీఆర్‌.. ఇటు హ‌రీష్‌.. మ‌రి కేసీఆర్ ఎక్క‌డ‌?

వ‌రంగ‌ల్‌-న‌ల్గొండ‌-ఖ‌మ్మం ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక‌లో బీఆర్ఎస్ను గెలిపించే బాధ్య‌త‌ను భుజాలకెత్తుకున్న కేటీఆర్ ప్ర‌చారంలో తీరిక లేకుండా ఉన్నారు. స‌భ‌లు,…

8 hours ago

బేబీ ఇమేజ్ ఉపయోగపడటం లేదే

గత ఏడాది అతి పెద్ద బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా రికార్డులు సృష్టించిన బేబీ సంచలనం ఏకంగా దాన్ని హిందీలో…

9 hours ago

ఎంఎస్ సుబ్బులక్ష్మిగా కీర్తి సురేష్ ?

మహానటిలో సావిత్రిగా తన అద్భుత నటనతో కట్టిపడేసిన కీర్తి సురేష్ మళ్ళీ దాన్ని తలపించే ఇంకో పాత్ర చేయలేదంటేనే ఆ…

9 hours ago

లొంగిపో .. ఎన్ని రోజులు తప్పించికుంటావ్ ?

'ఎక్కడున్నా భారత్‌కు తిరిగొచ్చి విచారణకు హాజరవ్వు. తప్పించుకోవద్దని నేను అభ్యర్థిస్తున్నాను. ఏ తప్పూ చేయకపోతే.. ఎందుకు భయపడుతున్నావ్‌? ఎన్ని రోజులు…

9 hours ago

అస‌లు.. అంచ‌నాలు వ‌స్తున్నాయి.. వైసీపీ డీలా ప‌డుతోందా?

ఏపీలో ఎన్నిక‌లు ముగిసి.. వారం రోజులు అయిపోయింది. ఈ నెల 13న నాలుగో ద‌శ సార్వ‌త్రిక ఎన్నిక‌ల పోలింగ్‌లో భాగంగా…

10 hours ago

మంత్రులు సైలెంట్‌.. అన్నింటికీ రేవంత్ కౌంట‌ర్‌

కాంగ్రెస్ హైక‌మాండ్ ఎంత చెప్పినా తెలంగాణ‌లోని ఆ పార్టీకి చెందిన కొంత‌మంది మంత్రుల్లో ఎలాంటి మార్పు రావ‌డం లేద‌ని తెలిసింది.…

12 hours ago