Political News

150 మందిని మార్చినా గెలవవు జగన్: చంద్రబాబు

తెలంగాణ శాసనసభ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆంధ్రప్రదేశ్ సాధారణ ఎన్నికలపై దృష్టి సారించారు. ఏపీలో వైసిపి మరోసారి అధికారం చేపట్టేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తుండగా…ఎలాగైనా అధికారంలోకి రావాలని టిడిపి కృత నిశ్చయంతో ఉంది. ఈ నేపథ్యంలోనే వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ క్రమంలోనే టీడీపీ అధినేత చంద్రబాబు…సీఎం జగన్, వైసీపీ నేతలపై సంచలన విమర్శలు చేశారు.

మార్చి తర్వాత ఒక్కొక్కరు అడ్రస్ లేకుండా పోతారని చంద్రబాబు షాకింగ్ కామెంట్స్ చేశారు. ఓడిపోతామన్న భయంతోనే 11 మంది సిట్టింగ్ నేతలను జగన్ మార్చారని, 150 మందిని మార్చినా గెలవవు జగన్ అంటూ చంద్రబాబు చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి. ఒకచోట చెల్లని కాసు మరోచోట ఎలా చెల్లుతుందని చంద్రబాబు సెటైర్లు వేశారు. బీసీల జపం చేస్తున్న జగన్ కు పులివెందుల టికెట్ బీసీలకు కేటాయించే దమ్ముందా అని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత పెరుగుతోందని, మార్చినాటికి అది మరింత పెరుగుతుందని జోస్యం చెప్పారు. రాబోయే ఎన్నికల్లో కొందరు వైసీపీ నేతలకు డిపాజిట్లు కూడా గల్లంతవుతాయని చంద్రబాబు అన్నారు.

భరిస్తున్నారని ప్రజలను వేధించడం దుర్మార్గం, నీచం అని…. తనను ఎన్నుకున్న ప్రజలకు ధర్మకర్తలా ఉండాల్సింది పోయి నియంతలా మారారని విమర్శించారు. రాబోయేవి టీడీపీ-జనసేన ఎన్నికలు కావని, మనందరి భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన ఎన్నికలు అని చెప్పారు. అమాయకులైన కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, లోకేష్ కోసం వెళ్లడం బీటెక్ రవి చేసిన నేరమా? అని ప్రశ్నించారు. ఈసారి ఎన్నికల్లో రాష్ట్రం గెలవాలి, తెలుగుజాతి గెలవాలి అని పిలుపునిచ్చారు. అందరి అభిప్రాయాలు తీసుకుని… ఏ నియోజకవర్గంలో ఏ అభ్యర్థిని నిలబెట్టాలో నిర్ణయించే బాధ్యత తాను తీసుకుంటానని చెప్పారు. అందుకోసం టెక్నాలజీలను కూడా వినియోగించుకుంటానన్నారు.

అభ్యర్థుల ఎంపికలో ఎలాంటి తప్పు చేయనని అన్నారు. అభ్యర్థుల ఎంపికకు సంబంధించి సరికొత్త విధానాన్ని ఈ సారి అవలంబిస్తున్నానని, అభ్యర్థుల సమాచారం తన వద్ద తప్ప మరెవరి వద్దా ఉండదని చెప్పారు. ఈ ఎన్నికలు చారిత్రాత్మకంగా నిలిచిపోతాయని, పార్టీలు, రాజకీయ కార్యకర్తలతో పాటు ప్రజలు కూడా త్యాగం చేసి రాష్ట్రాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.

This post was last modified on December 14, 2023 9:30 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అల్లరోడి ఆల్కహాల్ అడ్రస్ ఎక్కడ

అల్లరి నరేష్ కొత్త సినిమా ఆల్కహాల్ టీజర్ వచ్చి అయిదు నెలలు దాటేసింది. దాంట్లో ప్రకటించిన విడుదల తేదీ జనవరి…

29 minutes ago

మామతో దళపతి… మాజీ అల్లుడితో ఎమోషనల్ డ్రామా

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కేవలం హీరోయిజం ఉన్న పాత్రలే చేస్తానని ఎప్పుడూ కట్టుబడరు. అందుకే నాలుగు…

32 minutes ago

దిల్ రాజుకు, నాగవంశీకి చెడిందా?

టాలీవుడ్లో మంచి అనుబంధం ఉన్న అగ్ర నిర్మాతల్లో దిల్ రాజు, నాగవంశీలది ఒకటి. ఇద్దరికి బిజినెస్ పరంగా గట్టి బంధమే…

1 hour ago

చిరుపై విమర్శకులకు లావణ్య కౌంటర్

ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి కుటుంబాన్ని సంతోషంలో ముంచెత్తే పరిణామం చోటుచేసుకుంది. చిరు తనయుడు రామ్ చరణ్ కవల పిల్లలకు తండ్రి…

1 hour ago

రెండు షాట్ల కోసం మహేష్ ఆరు నెలల కష్టం

రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు.. ఈ వార్త నిజం కావడానికి దశాబ్దంన్నర పాటు ఎదురు చూడాల్సి వచ్చింది అభిమానులు. వీరి…

2 hours ago

ఫ్యామిలీ మ్యాన్ హీరో చుట్టూ టైటిల్ వివాదం

రామ్ గోపాల్ వర్మ సత్యతో స్టార్ ఆర్టిస్టుగా మారిపోయిన మనోజ్ బాజ్ పాయ్ తెలుగులోనూ హ్యాపీ, ప్రేమకథ, కొమరం పులి…

2 hours ago