ఏపీలో సస్పెండ్ అయ్యి కొంతకాలం తర్వాత అరెస్టయిన దళత డాక్టర్ సుధాకర్ కేసు కొత్త మలుపు తిరిగింది. 8 వారాల్లో సుధాకర్ కేసును ఛేదించాలని హైకోర్టు ఆ కేసును సీబీఐకి అప్పగించిన సంగతి తెలిసిందే. అంతర్జాతీయ పత్రికలకు కూడా ఎక్కిన ఈ కేసులో కుట్ర కోణం ఉందని సీబీఐ తేల్చి చెప్పింది. హైకోర్టులో ఈరోజు పిటిషను దాఖలు చేసిన సీబీఐ మరింత సమయం కావాలని పేర్కొంది. సీబీఐ వినతి మేరకు ఈ కేసు దర్యాప్తులో పూర్తి చేయడానికి ఏపీ హైకోర్టు మరో రెండు నెలల గడువు ఇచ్చింది.
విశాఖ జిల్లా నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో డాక్టర్ సుధాకర్ అనస్తీషియస్టుగా పనిచేస్తున్నారు. కరోనా తొలినాళ్లలో మాస్కుల కొరతపై మీడియా ముందు అసంతృప్తి వ్యక్తంచేశారు. అదేవారంలోనే అతను సస్పెండ్ అయ్యారు. సడెన్ గా కొంతకాలానికి విశాఖపట్నం రోడ్డుపై గుండుతో రోడ్డు మీద పోలీసులతో దెబ్బలు తింటూ ప్రత్యక్షం అయ్యారు. రోడ్డు మీద అతన్ని పోలీసులు కొట్టడం, తర్వాత ప్రభుత్వాన్ని అతను దుర్భాషలాడటం వీడియోలో కనిపించింది. తర్వాత అతను అరెస్టయ్యారు. అతన్ని మానసిక ఆస్పత్రికి తరలించారు. ఇది వివాదమై కోర్టుకెళ్లింది.
పోలీసు నివేదికకు, కోర్టు జడ్జితో విచారణ చేయించిన నివేదికకు తేడాలుండటంతో పోలీసులపై హైకోర్టు అనుమానం వ్యక్తంచేసింది. అనంతరం దీనిని వేగవంతమైన లోతైన దర్యాప్తుకోసం గడువుపెట్టి మరీ సీబీఐకి అప్పగించింది. రంగంలోకి దిగిన సీబీఐ… ఈరోజు మొత్తం వ్యవహారంపై పిటిషను దాఖలు చేసింది. కుట్ర కోణం ఉందని పేర్కొంటూ… మరింత సమయం కోరగా హైకోర్టు అనుమతించింది.
సీబీఐ వ్యాఖ్యలు ఏపీలో రాజకీయ కలకలానికి దారితీశాయి.
This post was last modified on September 1, 2020 7:44 pm
దేశవ్యాప్తంగా అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల పెంపు వ్యవహారం ఇప్పుడు రాజకీయ పార్టీల మధ్య చర్చకు దారితీసింది. ప్రాంతీయ పార్టీలు వీటికి…
దేశంలో రెండు కీలక అంశాలను తేల్చేసేందుకు కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు సిద్ధమైంది. 1) జమిలి ఎన్నికలు. 2) పార్లమెంటు…
ఏపీ రాజధాని అమరావతి నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. చాలా వేగంగా కూడా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఏర్పడిన కూటమి ప్రభుత్వం అమరావతి నిర్మాణాలను…
జగిత్యాల మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జీవన్ రెడ్డి తాజాగా బీఆర్ ఎస్ కండువా కప్పుకున్నారు. ఆ పార్టీ అధినేత…
జనాలను నవ్వించడం కోసం సెలబ్రెటీల వ్యక్తిగత జీవితాల్లోకి దూరితే.. పరిణామాలు ఎలా ఉంటాయో చెప్పడానికి ఈ ఉదంతం ఉదాహరణ. హైదరాబాద్కు…
దేశవ్యాప్తంగా మరో రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. వీటిలో ప్రధానంగా బిజెపి ఎక్కువగా ఆశలు పెట్టుకున్న రాష్ట్రం…