Political News

సీబీఐ సంచలనం… డాక్టర్ సుధాకర్ కేసులో కుట్ర ఉంది

ఏపీలో సస్పెండ్ అయ్యి కొంతకాలం తర్వాత అరెస్టయిన దళత డాక్టర్ సుధాకర్ కేసు కొత్త మలుపు తిరిగింది. 8 వారాల్లో సుధాకర్ కేసును ఛేదించాలని హైకోర్టు ఆ కేసును సీబీఐకి అప్పగించిన సంగతి తెలిసిందే. అంతర్జాతీయ పత్రికలకు కూడా ఎక్కిన ఈ కేసులో కుట్ర కోణం ఉందని సీబీఐ తేల్చి చెప్పింది. హైకోర్టులో ఈరోజు పిటిషను దాఖలు చేసిన సీబీఐ మరింత సమయం కావాలని పేర్కొంది. సీబీఐ వినతి మేరకు ఈ కేసు దర్యాప్తులో పూర్తి చేయడానికి ఏపీ హైకోర్టు మరో రెండు నెలల గడువు ఇచ్చింది.

విశాఖ జిల్లా నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో డాక్టర్‌ సుధాకర్‌ అనస్తీషియస్టుగా పనిచేస్తున్నారు. కరోనా తొలినాళ్లలో మాస్కుల కొరతపై మీడియా ముందు అసంతృప్తి వ్యక్తంచేశారు. అదేవారంలోనే అతను సస్పెండ్ అయ్యారు. సడెన్ గా కొంతకాలానికి విశాఖపట్నం రోడ్డుపై గుండుతో రోడ్డు మీద పోలీసులతో దెబ్బలు తింటూ ప్రత్యక్షం అయ్యారు. రోడ్డు మీద అతన్ని పోలీసులు కొట్టడం, తర్వాత ప్రభుత్వాన్ని అతను దుర్భాషలాడటం వీడియోలో కనిపించింది. తర్వాత అతను అరెస్టయ్యారు. అతన్ని మానసిక ఆస్పత్రికి తరలించారు. ఇది వివాదమై కోర్టుకెళ్లింది.

పోలీసు నివేదికకు, కోర్టు జడ్జితో విచారణ చేయించిన నివేదికకు తేడాలుండటంతో పోలీసులపై హైకోర్టు అనుమానం వ్యక్తంచేసింది. అనంతరం దీనిని వేగవంతమైన లోతైన దర్యాప్తుకోసం గడువుపెట్టి మరీ సీబీఐకి అప్పగించింది. రంగంలోకి దిగిన సీబీఐ… ఈరోజు మొత్తం వ్యవహారంపై పిటిషను దాఖలు చేసింది. కుట్ర కోణం ఉందని పేర్కొంటూ… మరింత సమయం కోరగా హైకోర్టు అనుమతించింది.

సీబీఐ వ్యాఖ్యలు ఏపీలో రాజకీయ కలకలానికి దారితీశాయి.

This post was last modified on September 1, 2020 7:44 pm

Share
Show comments
Published by
suman

Recent Posts

మ‌మ‌త ప‌రిస్థితి.. ఏపీకి పాఠం అవుతుందా?!

త‌మ్ముడు త‌మ్ముడే.. రాజ‌కీయం రాజ‌కీయ‌మే.. బీజేపీ విష‌యంలో ఇది అక్ష‌రాలా నిజం. త‌న‌కు అవ‌కాశం లేనంత సేపూ.. ఆ పార్టీ…

51 minutes ago

కెపాసిటీ లేకే ర‌జినీ సినిమా వ‌దిలేశా

సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్ హీరోగా లోక‌నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్ నిర్మించే సినిమా ద‌ర్శ‌కుడి ఎంపిక విష‌యంలో ఎంత త‌ల‌నొప్పి ఎదురైందో…

3 hours ago

తొలిసారి బాల‌య్య‌తో అనిరుధ్‌?

టాలీవుడ్లో ఇప్ప‌టికే ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ లాంటి అగ్ర క‌థానాయ‌కుల‌తో పాటు నాని, విజ‌య్…

4 hours ago

పవన్ వచ్చాక పిఠాపురంలో ఏం చేశారు?

ఉమ్మ‌డి తూర్పు గోదావ‌రి జిల్లాలోని పిఠాపురం నియోజ‌కవ‌ర్గం నుంచి తొలిసారి పోటీ చేసిన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ 2024…

4 hours ago

‘కల్తీ నెయ్యి’లో ఆ ఇద్దరిదే కీలక భూమిక?

కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారి ప్రసాదం తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగించారన్న కేసులో రోజుకో కొత్త…

5 hours ago

చంద్ర‌బాబు ప్ర‌క‌టించిన `లేబ‌ర్ అడ్డా` గురించి తెలుసా?

ఏపీ సీఎం చంద్ర‌బాబు గ‌త 2024లో కూట‌మి క‌ట్టి అధికారంలోకి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఆయ‌న ముఖ్య‌మంత్రి అయిన త‌ర్వాత‌..…

7 hours ago