Political News

డీజీపీ సవాంగ్ కు చంద్రబాబు లేఖ

ఏపీలో దళితులపై దాడులు పెరిగిపోతున్నాయంటూ ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీ తీవ్ర ఆరోపణలు చేస్తోన్న సంగతి తెలిసిందే. విశాఖ జిల్లా పెందుర్తిలోని టాలీవుడ్‌ నిర్మాత, నటుడు నూతన్‌ నాయుడు ఇంట్లో దళిత యువకుడి శిరోముండనం ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. దీంతోపాటు, డాక్టర్ సుధాకర్ కేసు, కొందరు జర్నలిస్టులపై దాడి….ఇలా వరుస ఘటనలపై టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ఏపీల శాంతి భద్రతలు నానాటికీ క్షీణిస్తున్నాయంటూ ఏపీ డీజీపీ గౌతం సవాంగ్‌కు ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. గత ఏడాది కాలంగా రాష్ట్రంలో శాంతి భద్రతలు దారుణమైన స్థితికి చేరుకున్నాయని, దోపిడిదారులు, గుండాలు, మాఫియా శక్తులు ఏపీని ఆటవిక రాజ్యంగా మార్చాయని ఆరోపించారు. ఏపీలో బడుగుబలహీన వర్గాల వారిపై గంపగుత్త దాడులు, చట్ట ఉల్లంఘనల, ప్రాథమిక హక్కులను కాల రాయడం వంటివి నిత్యకృత్యమయ్యాయని చంద్రబాబు ఆరోపించారు.

ప్రజాస్వామ్యాన్నే ప్రమాదంలోకి నెట్టారని, మీడియాపై కూడా వరుస దాడులు చేస్తున్నారని లేఖలో చంద్రబాబు పేర్కొన్నారు. తుని, నెల్లూరు, చీరాల ప్రాంతాల్లో జర్నలిస్టులపై దాడులు జరిగాయని, పుంగనూరులో జర్నలిస్ట్ వెంకట నారాయణ ఇంటిపై వైసీపీ కార్యకర్తలు దాడి చేయడంతో ఆ వ్యవహారం బయటకు రాకుండా పోలీసులు తొక్కిపెడుతున్నారన్న ఆరోపణలున్నాయని లేఖలో పేర్కొన్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తోన్న పుంగనూరులో ఇటీవల ఇద్దరు దళితులు అనుమానాస్పదంగా మరణించారని, అక్కడి శాంతి భద్రతలకు ఈ దుర్ఘటనలే దుష్ట్యాంతాలని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు. పుంగనూరుతోపాటు ఏపీ మొత్తం శాంతిభద్రతలు క్షీణించాయని, జర్నలిస్ట్ లపై దాడే అందుకు సాక్ష్యమని అన్నారు. ఫోర్త్ ఎస్టేట్ లాంటి మీడియాపై దాడులు కొనసాగితే ప్రజాస్వామ్యం ఉనికినే కోల్పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. నేరస్థులపై కఠిన చర్యలు తీసుకొని ఈ తరహా దాడులు పునరావృతం కాకుండా చూడాలని కోరారు. జర్నలిస్ట్ వెంకట నారాయణపై దాడి ఘటన వీడియో క్లిప్పింగ్‌లను లేఖతో పాటు చంద్రబాబు జత చేశారు.

This post was last modified on September 1, 2020 7:36 pm

Share
Show comments
Published by
suman

Recent Posts

హీరామండి రిపోర్ట్ ఏంటి

మాములుగా ఒక వెబ్ సిరీస్ గురించి సినిమా ప్రేక్షకులు ఎదురు చూడటం తక్కువ. కానీ హీరామండి ఈ విషయంలో తన…

55 mins ago

జ్యోతికృష్ణ గెలవాల్సిన సవాల్ పెద్దదే

ఇవాళ హరిహర వీరమల్లు కొత్త టీజర్ రిలీజ్ చేసి ఇకపై దర్శకత్వ బాధ్యతలు జ్యోతికృష్ణ చూసుకుంటాడని అధికారికంగా ప్రకటించడం అభిమానుల్లో…

1 hour ago

హాట్ టాపిక్‌గా చంద్ర‌బాబు ‘టోపీ’.. ఏంటిది?

టీడీపీ అధినేత చంద్ర‌బాబు ప్ర‌స్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ప‌ర్య‌టిస్తున్నారు. సార్వ‌త్రిక ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఆయ‌న విస్తృతంగా ప్ర‌చారం చేస్తున్నారు. అటు…

2 hours ago

ఇక్కడే చస్తానంటున్న బండ్ల గణేష్ !

బండ్ల గణేష్ ఆలియాస్ బ్లేడ్ గణేష్. నిజమే ఈ కమేడియన్ పేరు వింటే మొదటగా గుర్తొచ్చేది 7 ఓ క్లాక్…

3 hours ago

ఎన్నిక‌ల కోడ్ ఉంద‌ని ఆగుతున్నాం: బొత్స

ఏపీ అధికార పార్టీ వైసీపీ కీల‌క నాయ‌కుడు, మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఎన్నిక‌ల కోడ్ ఉంద‌ని…

4 hours ago

మూడో టిల్లు జోడిగా బుట్టబొమ్మ?

టిల్లు స్క్వేర్ తో ఏకంగా వంద కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న సిద్దు జొన్నలగడ్డ ఒకపక్క జాక్, తెలుసు…

13 hours ago