ఎన్నికల వేళ ఆయా పార్టీల బలాబలాలను బట్టి.. పొత్తులు అనివార్యంగా మారుతున్న పరిస్తితి కనిపిస్తోంది. ఈ క్రమంలో ప్రధాన రాజకీయ పార్టీలు కూడా పొత్తులకు తెరలెత్తుతున్నాయి. కానీ, ఎన్నికల వరకు తేల్చకపోవడం.. చివరి నిముషం వరకు సాగతీత ధోరణిని అవలంబించడం వల్ల ఆయా పార్టీలకు మేలు ఎంతన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తెలంగాణలో జనసేనతో బీజేపీ పొత్తు పెట్టుకుంది.
కానీ, ఈ పొత్తుల విషయంలో బీజేపీ నోటిఫికేషన్ వచ్చేసి.. ఇక, రేపో మాపో ఈ గడువు కూడా అయిపోతుందనగా .. అప్పుడు ఒక కొలిక్కి తెచ్చారు. దీంతో బీజేపీ ఆశించిన ఫలితం అయితే దక్కలేదు. పైగా జనసేనకు భారీ మైనస్ ఏర్పడింది. చివరి నిముషం వరకు ఈ పొత్తుల విషయం తెల్చకపోవడం.. అటు బీజేపీకి కూడా నష్టం చేకూర్చిందనే వాదన ఉంది. నాయకుల్లో నిరాశ, కేడర్లో నిస్సత్తువ ఆవరించాయి.
ఇక, ఏపీ విషయానికి వస్తే.. మరో నాలుగు మాసాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటి నుంచే.. ఇక్కడ పొత్తుల విషయాన్ని తేల్చేయాలని బీజేపీ నాయకులు అంతర్గత సంభాషణల్లో ప్రధానంగా తెరమీదికి తెస్తున్నారు. అంతేకాదు, ఏదో ఒక విషయాన్ని తేలిస్తే.. ప్రజల మైండ్ సెట్ను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు అవకాశం ఉంటుందని వారు చెబుతున్నారు.
అలా కాకుండా.. కేవలం ఎన్నికలకు ముందు పొత్తులు తేల్చడం ద్వారా ప్రజలను పార్టీవైపు మళ్లించడం.. వారిని సానుకూలంగా తమవైపు తిప్పుకోవడం వంటివి ఇబ్బందికరమని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ విషయంలో అయినా.. ముందుగానే మేల్కొనాలనేది బీజేపీ నేతల టాక్. ఇదిలావుంటే.. టీడీపీ-జనసేనల పొత్తు ఓకే అయినా.. బీజేపీ కోసం ఇరు పక్షాలుద్వారాలు తెరిచే ఉంచాయి. అయితే, మోడీ ద్వయం మాత్రం పొత్తులపై లెక్కలు వేసేందుకు సమయం తీసుకుంటుండడం ఈ పార్టీలను కూడా ఇబ్బంది పెడుతోందనే టాక్ వినిపిస్తోంది.
This post was last modified on December 8, 2023 10:37 am
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…
కూటమి నాయకులకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కీలక రాజకీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానికరం`` అంటూ..…