Political News

బీజేపీకి ఛాన్సివ్వ‌ని జ‌గ‌న్‌.. హ‌డావుడి శంకుస్థాప‌న‌లు!

హిందూ ఓటు బ్యాంకును సొంతం చేసుకునేందుకు ఏపీ బీజేపీ నాయ‌కులు ప్ర‌య‌త్నిస్తున్నారు. ముఖ్యంగా కూలిపోయిన‌, వివిధ కార‌ణాల‌తో కూల్చేసిన ఆల‌యాల పున‌రుద్ధ‌ర‌ణ పేరుతో.. ఈ నెల 20 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ధ‌ర్నాల‌కు పిలుపునిచ్చేందుకు రాష్ట్ర క‌మ‌లం పార్టీ నాయ‌కులు రెడీ అయ్యారు. అయితే. అనూహ్యంగా వీరికి ఆ ఛాన్స్ ఇవ్వ‌కుండానే సీఎం జ‌గ‌న్ రంగంలోకి దిగిపోయారు. హ‌డావుడిగా.. ఆయా ప‌నుల‌కు శంకుస్థాప‌న‌లు చేశారు. ఓటుబ్యాంకు రాజ‌కీయాల‌కు శ్రీకారం చుట్టార‌నే టాక్ వినిపిస్తోంది.

ఏం చేశారంటే..

సీఎం జ‌గ‌న్‌.. గురువారం తెల్ల‌తెల్ల‌వారుతూనే విజ‌య‌వాడ‌కు వ‌చ్చేశారు.(ప్ర‌త్యేక హెలికాప్ట‌ర్‌కాదు.. కారులోనే) ఏకంగా.. 216 కోట్ల రూపాయల విలువైన‌ కనక దుర్గగుడి అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్ధాపనలు చేశారు. దీనిలో ఆలయ పునఃనిర్మాణానికి రూ. 5.60 కోట్లు, ఇంద్రకీలాద్రిపై కొండ రక్షణ చర్యలపనుల నిమిత్తం రూ. 4.25 కోట్లు, ఎల్టీ ప్యానల్ బోర్డులు, ఎనర్జీ వాటర్ మేనేజ్‌మెంట్, స్కాడా ఏర్పాటు నిమిత్తం రూ. 3.25 కోట్లు, 2016 పుష్కరాల సమయంలో కూల్చివేసిన ఆలయాల పునర్నిర్మాణంకు రూ 3.87 కోట్లు వెచ్చించ‌నున్నారు.

అదేవిధంగా కొండ దిగువున తొలిమెట్టు వద్ద ఆంజనేయ స్వామి, వినాయక ఆలయ నిర్మాణం కోసం రూ. 26 ల‌క్ష‌లు, అమ్మవారి అన్న ప్రసాద భవన నిర్మాణానికి రూ.30 కోట్లు, అమ్మవారి ప్రసాదం పోటు భవన నిర్మాణం కోసం రూ. 27 కోట్లు, కనకదుర్గ నగర్ నుంచి మహామండపం వరకు ఎలివేటెడ్ క్యూ కాంప్లెక్స్ నిర్మాణానికి రూ. 13 కోట్లు కేటాయించారు. ఈ ప‌నుల‌కు సీఎం శంకుస్థాప‌న చేశారు. అయితే.. ఈ స‌మ‌స్య‌లు.. ఎప్ప‌టి నుంచో ఉన్నాయి. వీటిని అనువుగా చేసుకుని బీజేపీ ధ‌ర్నాల‌కు, నిర‌స‌న‌ల‌కు పిలుపునిచ్చిన నేప‌థ్యంలో వీటికి శంకుస్థాప‌న‌లు చేయ‌డంపై(ఎలాంటి ముంద‌స్తు స‌మాచారం లేకుండానే) స్థానికులు నివ్వెర పోయారు.

This post was last modified on December 7, 2023 2:07 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

2 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

2 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

4 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

4 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

5 hours ago

బాబుకు కుప్పం ఎలానో… పవన్ కు పిఠాపురం అలా!

కుప్పం.. ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం. గ‌త 40 సంవ‌త్స‌రాలుగా ఏక ఛ‌త్రాధిప‌త్యంగా చంద్ర‌బాబు ఇక్క‌డ విజ‌యం దక్కించుకుంటున్నారు.…

6 hours ago